Electric Vehicles: ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్లు.. ఏయే కంపెనీ ఎంతెంత?
Electric Vehicles: ఫిబ్రవరిలో 65,700 యూనిట్ల విద్యుత్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. డిసెంబరు, జనవరిలోనూ దాదాపు ఇవే నంబర్లు నమోదయ్యాయి. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ప్రత్యేక రాయితీలు, ప్రయోజనాలను అందిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్ ద్విచక్ర వాహనాల (Electric two wheelers) గిరాకీ స్తంభించిపోయింది. కొత్త మోడళ్ల విడుదల నెమ్మదించింది. ఫలితంగా కస్టమర్లను ఆకర్షించేందుకు తయారీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఓలా, ఏథర్ సహా ఇతర ప్రముఖ కంపెనీలన్నీ ప్రత్యేక రాయితీలను ఇస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన కొత్త మోడళ్లకూ ఈ ఆఫర్లను వర్తింపజేస్తున్నాయి.
వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో 65,700 యూనిట్ల విద్యుత్ ద్విచక్ర వాహనాలు (Electric two wheelers) అమ్ముడయ్యాయి. డిసెంబరు, జనవరిలోనూ దాదాపు ఇవే నంబర్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు అప్రమత్తమయ్యాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు రాయితీలు, ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నాయి.
★ ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 ప్రో మోడల్ ధరను రూ.16,000 వరకు తగ్గించింది. లోన్పై తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. పైగా సున్నా డౌన్పేమెంట్తో వాహనాన్ని చేతికందిస్తోంది.
★ మోటోకార్ప్ మద్దతు ఉన్న ఏథర్ ఎనర్జీ తమ విద్యుత్ వాహనాలపై వినియోగదారులకు రూ.17,000 వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. లోన్పై తీసుకునేవారికి జీరో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ను కూడా ఇస్తోంది.
★ ఒకినావా ఆటోటెక్పై ప్రభుత్వం తరఫున వచ్చే రాయితీలు నిలిచిపోయాయి. దీంతో ఒక్కసారిగా వాహనాల ధరలు పెరిగాయి. ఫలితంగా విక్రయాలు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న స్టాక్ను పూర్తి చేయడం కోసం కంపెనీ రూ.8,750 వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. కొత్త స్టాక్పై మాత్రం ఈ ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేసింది.
★ గ్రీవ్స్కాటన్కు చెందిన యాంపియర్ ఇటీవల విడుదల చేసిన ప్రైమస్ మోడల్పై రూ.5,000 వరకు క్యాష్బ్యాక్ ఇస్తోంది.
★ జితేంద్ర ఈవీటెక్ తమ మోడళ్లపై రూ.6,000 వరకు రాయితీనిస్తోంది.
గిరాకీ పడిపోవడంతో కంపెనీలు తయారీని క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉంది. భారత్లో రెండో అతిపెద్ద విద్యుత్ ద్విచక్రవాహన తయారీ కంపెనీ అయిన టీవీఎస్ మోటార్ మార్చి నాటికి 25,000 యూనిట్ల నెలవారీ విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఫిబ్రవరిలో దాంట్లో సగం మాత్రమే విక్రయించగలిగింది. అదే తరహాలో ఏథర్ ఎనర్జీ సైతం 20,000 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, 9,000 యూనిట్లను మాత్రమే విక్రయించింది. నవంబరు నాటికి 10 లక్షల వాహనాల తయారీని అందుకోవాలని ఓలా ఎలక్ట్రిక్ నిర్దేశించుకుంది. ఫిబ్రవరిలో 17,700 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి