Electric Vehicles: ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్లు.. ఏయే కంపెనీ ఎంతెంత?
Electric Vehicles: ఫిబ్రవరిలో 65,700 యూనిట్ల విద్యుత్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. డిసెంబరు, జనవరిలోనూ దాదాపు ఇవే నంబర్లు నమోదయ్యాయి. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ప్రత్యేక రాయితీలు, ప్రయోజనాలను అందిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్ ద్విచక్ర వాహనాల (Electric two wheelers) గిరాకీ స్తంభించిపోయింది. కొత్త మోడళ్ల విడుదల నెమ్మదించింది. ఫలితంగా కస్టమర్లను ఆకర్షించేందుకు తయారీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఓలా, ఏథర్ సహా ఇతర ప్రముఖ కంపెనీలన్నీ ప్రత్యేక రాయితీలను ఇస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన కొత్త మోడళ్లకూ ఈ ఆఫర్లను వర్తింపజేస్తున్నాయి.
వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో 65,700 యూనిట్ల విద్యుత్ ద్విచక్ర వాహనాలు (Electric two wheelers) అమ్ముడయ్యాయి. డిసెంబరు, జనవరిలోనూ దాదాపు ఇవే నంబర్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు అప్రమత్తమయ్యాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు రాయితీలు, ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నాయి.
★ ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 ప్రో మోడల్ ధరను రూ.16,000 వరకు తగ్గించింది. లోన్పై తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. పైగా సున్నా డౌన్పేమెంట్తో వాహనాన్ని చేతికందిస్తోంది.
★ మోటోకార్ప్ మద్దతు ఉన్న ఏథర్ ఎనర్జీ తమ విద్యుత్ వాహనాలపై వినియోగదారులకు రూ.17,000 వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. లోన్పై తీసుకునేవారికి జీరో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ను కూడా ఇస్తోంది.
★ ఒకినావా ఆటోటెక్పై ప్రభుత్వం తరఫున వచ్చే రాయితీలు నిలిచిపోయాయి. దీంతో ఒక్కసారిగా వాహనాల ధరలు పెరిగాయి. ఫలితంగా విక్రయాలు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న స్టాక్ను పూర్తి చేయడం కోసం కంపెనీ రూ.8,750 వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. కొత్త స్టాక్పై మాత్రం ఈ ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేసింది.
★ గ్రీవ్స్కాటన్కు చెందిన యాంపియర్ ఇటీవల విడుదల చేసిన ప్రైమస్ మోడల్పై రూ.5,000 వరకు క్యాష్బ్యాక్ ఇస్తోంది.
★ జితేంద్ర ఈవీటెక్ తమ మోడళ్లపై రూ.6,000 వరకు రాయితీనిస్తోంది.
గిరాకీ పడిపోవడంతో కంపెనీలు తయారీని క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉంది. భారత్లో రెండో అతిపెద్ద విద్యుత్ ద్విచక్రవాహన తయారీ కంపెనీ అయిన టీవీఎస్ మోటార్ మార్చి నాటికి 25,000 యూనిట్ల నెలవారీ విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఫిబ్రవరిలో దాంట్లో సగం మాత్రమే విక్రయించగలిగింది. అదే తరహాలో ఏథర్ ఎనర్జీ సైతం 20,000 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, 9,000 యూనిట్లను మాత్రమే విక్రయించింది. నవంబరు నాటికి 10 లక్షల వాహనాల తయారీని అందుకోవాలని ఓలా ఎలక్ట్రిక్ నిర్దేశించుకుంది. ఫిబ్రవరిలో 17,700 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్