Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. ఫోన్‌లపై భారీ ఆఫర్లు!

Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వేసవిలో సరికొత్త ఆఫర్లతో సేల్‌కు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ పేరుతో మే 5 నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుంది.

Published : 01 May 2023 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ (Big Saving Days Sale)ను ప్రకటించింది. ఈ సేల్‌ మే 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 10 వరకు ఆరు రోజులపాటు కొనసాగనుంది. ఇందులో ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ముందుగానే పాల్గొనే అవకాశం ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సివుంది. ఈ సేల్‌లో కొన్ని మొబైల్‌ మోడల్స్‌పై భారీగా ఆఫర్లు ప్రకటించారు. ఈ జాబితాలో యాపిల్‌ ఐఫోన్ 13, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ 5జీ, గూగుల్ పిక్సెల్‌ 6ఏ వంటి ప్రీమియం ఫోన్లు కూడా ఉన్నాయి. 

ఆఫర్లు వీటిపైనే

ఈ సేల్‌లో బడ్జెట్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. పోకో(Poco) సీ55 ధర ₹ 11,999 కాగా.. ఈ సేల్‌లో ₹ 7,999కే విక్రయించనున్నారు. అలాగే ఇన్ఫీనిక్స్(Infinix) హాట్‌ 20 5జీ ఫోన్‌ ధర ₹ 17,999 కాగా.. ₹ 9,999కే కొనుగోలు చేయొచ్చు. ₹ 10,999 ధర కలిగిన మోటో(Moto) ఈ13 ఫోన్‌ను ఈ సేల్‌లో ₹ 7,499కే విక్రయించనున్నారు. రెడ్‌మీ(Redmi) నోట్‌ 12 ప్రో 5జీ మోడల్‌ ధర ₹ 29,999 కాగా.. ₹ 21,749కే కొనుగోలు చేయొచ్చు. రియల్‌మీ(Realme) 10ప్రో+ 5జీ ధర ₹ 25,999 కాగా.. ఈ సేల్‌లో ₹ 22,999కే విక్రయించనున్నారు. అలానే, పోకో ఎక్స్ 5 ప్రో 5జీ ఫోన్‌ ధర ₹ 25,999 కాగా.. ₹ 20,999కే కొనుగోలు చేయొచ్చు. 

గూగుల్ పిక్సెల్‌ (Google Pixel) ఫోన్‌లపై కూడా ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. గూగుల్ పిక్సెల్‌ 6ఏ ధర ₹ 43,999 కాగా.. ఈ సేల్‌లో ₹ 25,999కే లభిస్తుంది. ఇక, పిక్సెల్‌ 7 మోడల్‌ ధర ₹ 59,999 ఉండగా.. ₹ 44,999కే కొనుగోలు చేయొచ్చు. వీటితోపాటు శాంసంగ్‌ (Samsung) గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌3, శాంసంగ్‌ ఎస్‌21 ఎఫ్‌ఈ 5జీ, ఐఫోన్ 13 (iPhone 13) మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్‌ ఉండబోతోందని కంపెనీ పేర్కొంది. డిస్కౌంట్‌ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. మే 1 నుంచి కర్టైన్‌ రైజర్‌ డీల్స్‌ (Curtain Raiser Deals) పేరుతో వేటిపై ఎంత ఆఫర్లు ఉంటాయనే వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించనుంది. అయితే ఈ సేల్‌లో టీవీ, హోమ్‌ అఫ్లియెన్సెస్‌పై 70 శాతం వరకు.. ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్లు, ఐప్యాడ్లు, ప్రింటర్లు వంటి వాటిపై దాదాపు 80 శాతం వరకు డిస్కౌంట్‌ ఉంటుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని