ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి
ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా రెండో రోజూ సూచీలు నష్టపోయాయి. బలహీన ఆసియా సంకేతాలతో లోహ, ఇంధన, స్థిరాస్తి షేర్లు డీలాపడ్డాయి.
సమీక్ష
ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా రెండో రోజూ సూచీలు నష్టపోయాయి. బలహీన ఆసియా సంకేతాలతో లోహ, ఇంధన, స్థిరాస్తి షేర్లు డీలాపడ్డాయి. రూపాయి నీరసపడటం, విదేశీ మదుపర్ల అమ్మకాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 24 పైసలు తగ్గి 82.44 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.73 శాతం తగ్గి 74.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టపోగా, ఐరోపా సూచీలు కుదేలయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 57,890.66 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీ.. ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో 57,422.98 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 398.18 పాయింట్ల నష్టంతో 57,527.10 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 131.85 పాయింట్లు తగ్గి 16,945.05 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,917.35- 17,109.45 పాయింట్ల మధ్య కదలాడింది.
* డెట్ మ్యూచువల్ ఫండ్పై పన్నుల్లో మార్పులు చేయడంతో ఏఎంసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. యూటీఐ అసెట్ 4.73%, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 4.44%, హెచ్డీఎఫ్సీ అసెట్ 4.21%, శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ 3.21%, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ 1.29% చొప్పున తగ్గాయి.
* సెన్సెక్స్ 30 షేర్లలో 24 నష్టపోయాయి. బజాజ్ ఫిన్సర్వ్ 3.81%, బజాజ్ ఫైనాన్స్ 3.19%, టాటా స్టీల్ 2.58%, రిలయన్స్ 1.96%, ఎల్ అండ్ టీ 1.96%, ఎస్బీఐ 1.38%, హెచ్సీఎల్ టెక్ 1.36%, ఎం అండ్ ఎం 1.25%, మారుతీ 1.24%, ఎన్టీపీసీ 1.06% చొప్పున డీలాపడ్డాయి. కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ 0.74% రాణించాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి, లోహ, కమొడిటీస్, ఇంధన, ఆర్థిక సేవలు, పరిశ్రమలు, సేవలు, చమురు-గ్యాస్ 2.28% వరకు పడ్డాయి. బీఎస్ఈలో 2541 షేర్లు నష్టాల్లో ముగియగా, 967 స్క్రిప్లు లాభపడ్డాయి. 122 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* ఇబ్బందికరమైన మార్కెటింగ్ కాల్స్, సందేశాల నిబంధనలు ఉల్లంఘించినందుకు 2021లో 15,382, 2022లో 32,032 కనెక్షన్లను టెలికాం ఆపరేటర్లు నిలిపివేసినట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఇటువంటి వాటిని నిరోధించనందుకు యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లపై రూ.34.9 కోట్ల జరిమానాలను ట్రాయ్ విధించినట్లు తెలిపారు.
* నైకాకు చెందిన అయిదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కంపెనీకు రాజీనామా చేశారు. నైకా సూపర్స్టోర్ సీఈఓ వికాస్ గుప్తా, నైకా ఫ్యాషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోపాల్ ఆస్థానా, చీఫ్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫీసర్ మనోజ్ గాంధీ, బిజినెస్ హెడ్ శుచి పాండ్యా, ఫైనాన్స్ హెడ్ లలిత్ ప్రుతీలు ఇందులో ఉన్నారు. ఇందులో నలుగురు ఎగ్జిక్యూటివ్ల రాజీనామాలకు కారణాలు తెలియలేదు. ప్రుతీ మాత్రం ఎడ్టెక్ సంస్థ యునివోలో సీఎఫ్ఓగా చేరారు. ఈ రాజీనామాలు స్వచ్ఛందంగా చేసినట్లు నైకా తెలిపింది.
* జర్మనీ విద్యుత్ ఓఈఎం ఇరాకిట్లో వాటాను కొనుగోలు చేసినట్లు కోల్కతాకు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ మోటోవోల్ట్ ప్రకటించింది.
* ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ ఏప్రిల్లో 250 మిలియన్ డాలర్ల ఈక్విటీ నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కంపెనీ విలువను 22 బిలియన్ డాలర్లు (రూ.1.80 లక్షల కోట్లు)గా లెక్కకట్టారు.
* అదానీ గ్రూప్ 10 షేర్లలో 7 కంపెనీలు శుక్రవారం నష్టపోయాయి. ఎన్డీటీవీ 4.87%, అదానీ పవర్ 4.27%, అదానీ విల్మర్ 3.24%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.90%, అదానీ పోర్ట్స్ 2.56%, ఏసీసీ 2.08%, అంబుజా సిమెంట్స్ 0.01% చొప్పున పడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 4.84%, అదానీ ట్రాన్స్మిషన్ 3.78%, అదానీ టోటల్ గ్యాస్ 2.49% పెరిగాయి.
* జమ్మూ కశ్మీర్లో కనుగొన్న లిథియం నిల్వలతో ప్రపంచంలో అగ్రగామి వాహన తయారీ దేశంగా భారత్ నిలుస్తుందని కేంద్ర రహదారి, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా రవాణాను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్ అంతా విద్యుత్ బస్సులదేనని అన్నారు.
* నెలకు ఒకసారి బరిస్తా స్టోర్లలో పనిచేయనున్నట్లు స్టార్బక్స్ కొత్త భారత సంతతి సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ తెలిపారు. కంపెనీ సంస్కృతి, వినియోగదారులు, సవాళ్లు, అవకాశాల గురించి తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (8)
జియో ఎయిర్ఫైబర్కు రూ.1,000 ఛార్జీ మినహాయింపు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్