ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి
ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా రెండో రోజూ సూచీలు నష్టపోయాయి. బలహీన ఆసియా సంకేతాలతో లోహ, ఇంధన, స్థిరాస్తి షేర్లు డీలాపడ్డాయి.
సమీక్ష
ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా రెండో రోజూ సూచీలు నష్టపోయాయి. బలహీన ఆసియా సంకేతాలతో లోహ, ఇంధన, స్థిరాస్తి షేర్లు డీలాపడ్డాయి. రూపాయి నీరసపడటం, విదేశీ మదుపర్ల అమ్మకాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 24 పైసలు తగ్గి 82.44 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.73 శాతం తగ్గి 74.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టపోగా, ఐరోపా సూచీలు కుదేలయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 57,890.66 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీ.. ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో 57,422.98 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 398.18 పాయింట్ల నష్టంతో 57,527.10 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 131.85 పాయింట్లు తగ్గి 16,945.05 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,917.35- 17,109.45 పాయింట్ల మధ్య కదలాడింది.
* డెట్ మ్యూచువల్ ఫండ్పై పన్నుల్లో మార్పులు చేయడంతో ఏఎంసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. యూటీఐ అసెట్ 4.73%, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 4.44%, హెచ్డీఎఫ్సీ అసెట్ 4.21%, శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ 3.21%, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ 1.29% చొప్పున తగ్గాయి.
* సెన్సెక్స్ 30 షేర్లలో 24 నష్టపోయాయి. బజాజ్ ఫిన్సర్వ్ 3.81%, బజాజ్ ఫైనాన్స్ 3.19%, టాటా స్టీల్ 2.58%, రిలయన్స్ 1.96%, ఎల్ అండ్ టీ 1.96%, ఎస్బీఐ 1.38%, హెచ్సీఎల్ టెక్ 1.36%, ఎం అండ్ ఎం 1.25%, మారుతీ 1.24%, ఎన్టీపీసీ 1.06% చొప్పున డీలాపడ్డాయి. కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ 0.74% రాణించాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి, లోహ, కమొడిటీస్, ఇంధన, ఆర్థిక సేవలు, పరిశ్రమలు, సేవలు, చమురు-గ్యాస్ 2.28% వరకు పడ్డాయి. బీఎస్ఈలో 2541 షేర్లు నష్టాల్లో ముగియగా, 967 స్క్రిప్లు లాభపడ్డాయి. 122 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* ఇబ్బందికరమైన మార్కెటింగ్ కాల్స్, సందేశాల నిబంధనలు ఉల్లంఘించినందుకు 2021లో 15,382, 2022లో 32,032 కనెక్షన్లను టెలికాం ఆపరేటర్లు నిలిపివేసినట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఇటువంటి వాటిని నిరోధించనందుకు యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లపై రూ.34.9 కోట్ల జరిమానాలను ట్రాయ్ విధించినట్లు తెలిపారు.
* నైకాకు చెందిన అయిదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కంపెనీకు రాజీనామా చేశారు. నైకా సూపర్స్టోర్ సీఈఓ వికాస్ గుప్తా, నైకా ఫ్యాషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గోపాల్ ఆస్థానా, చీఫ్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫీసర్ మనోజ్ గాంధీ, బిజినెస్ హెడ్ శుచి పాండ్యా, ఫైనాన్స్ హెడ్ లలిత్ ప్రుతీలు ఇందులో ఉన్నారు. ఇందులో నలుగురు ఎగ్జిక్యూటివ్ల రాజీనామాలకు కారణాలు తెలియలేదు. ప్రుతీ మాత్రం ఎడ్టెక్ సంస్థ యునివోలో సీఎఫ్ఓగా చేరారు. ఈ రాజీనామాలు స్వచ్ఛందంగా చేసినట్లు నైకా తెలిపింది.
* జర్మనీ విద్యుత్ ఓఈఎం ఇరాకిట్లో వాటాను కొనుగోలు చేసినట్లు కోల్కతాకు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ మోటోవోల్ట్ ప్రకటించింది.
* ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ ఏప్రిల్లో 250 మిలియన్ డాలర్ల ఈక్విటీ నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కంపెనీ విలువను 22 బిలియన్ డాలర్లు (రూ.1.80 లక్షల కోట్లు)గా లెక్కకట్టారు.
* అదానీ గ్రూప్ 10 షేర్లలో 7 కంపెనీలు శుక్రవారం నష్టపోయాయి. ఎన్డీటీవీ 4.87%, అదానీ పవర్ 4.27%, అదానీ విల్మర్ 3.24%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.90%, అదానీ పోర్ట్స్ 2.56%, ఏసీసీ 2.08%, అంబుజా సిమెంట్స్ 0.01% చొప్పున పడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 4.84%, అదానీ ట్రాన్స్మిషన్ 3.78%, అదానీ టోటల్ గ్యాస్ 2.49% పెరిగాయి.
* జమ్మూ కశ్మీర్లో కనుగొన్న లిథియం నిల్వలతో ప్రపంచంలో అగ్రగామి వాహన తయారీ దేశంగా భారత్ నిలుస్తుందని కేంద్ర రహదారి, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా రవాణాను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్ అంతా విద్యుత్ బస్సులదేనని అన్నారు.
* నెలకు ఒకసారి బరిస్తా స్టోర్లలో పనిచేయనున్నట్లు స్టార్బక్స్ కొత్త భారత సంతతి సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ తెలిపారు. కంపెనీ సంస్కృతి, వినియోగదారులు, సవాళ్లు, అవకాశాల గురించి తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు