Vikram-1 Rocket: ఏడంతస్తుల పొడవైన రాకెట్
అంతరిక్ష రంగంలోని అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ల డిజైన్, తయారీ, పరీక్షలు, పరిశోధన కోసం కొత్త కేంద్రం ‘మ్యాక్స్-క్యూ’ను ప్రారంభించింది.
విక్రమ్-1ను ఆవిష్కరించిన స్కైరూట్ ఏరోస్పేస్
హైదరాబాద్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రారంభం
ఈనాడు - హైదరాబాద్
అంతరిక్ష రంగంలోని అంకుర సంస్థ స్కైరూట్(Skyroot) ఏరోస్పేస్ రాకెట్ల డిజైన్, తయారీ, పరీక్షలు, పరిశోధన కోసం కొత్త కేంద్రం ‘మ్యాక్స్-క్యూ’ను ప్రారంభించింది. హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంగళవారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన ఏడంతస్తుల పొడవైన విక్రమ్-1 అనే రాకెట్ను(Vikram-1 rocket) ఆయన ఆవిష్కరించారు. దీన్ని వచ్చే ఏడాది ఆరంభంలో తొలిసారిగా నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది. ఇది దాదాపు 300 కిలోల పేలోడ్ను దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. పూర్తిగా కార్బన్ ఫైబర్ కాంపోజిట్ బాడీతో రూపొందిన ఈ రాకెట్ ద్వారా బహుళ ఉపగ్రహాలను ప్రయోగించొచ్చు. ఇందులో త్రీడీ ముద్రిత ద్రవ ఇంజిన్ను ఏర్పాటు చేశారు.
రూ.526 కోట్ల పెట్టుబడులు: స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ కంపెనీలో దాదాపు 280 మంది పనిచేస్తున్నారని, రూ.526 కోట్ల పెట్టుబడులను సమీకరించామని తెలిపారు. కొత్త ప్రాంగణానికి పెట్టిన పేరు గురించి వివరిస్తూ.. అంతరిక్షంలోకి వెళ్లే ప్రతి రాకెట్ ఒక దశలో గరిష్ఠ ఒత్తిడికి గురికావాల్సి ఉంటుందని, దాన్ని ‘మ్యాక్స్-క్యూ’ అంటారని చెప్పారు. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ కేంద్రం... దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ అభివృద్ధి కేంద్రమని చెప్పారు. ఈ అధునాతన ప్రాంగణంలో రాకెట్ల డిజైన్, తయారీ, పరీక్షలకు అన్ని వసతులు ఉన్నాయన్నారు. స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ మాట్లాడుతూ.. తమ డిజైన్ నైపుణ్యానికి దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి విక్రమ్-1ను రూపొందించినట్లు చెప్పారు. ఈ రాకెట్లోని మొదటి మూడు దశలు ఘన ఇంధనంతో పనిచేస్తాయి. దీనికి తక్కువ మౌలిక వసతులు సరిపోతాయి. 72 గంటల్లోనే దీన్ని అసెంబుల్ చేసి, ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. విక్రమ్ శ్రేణి కింద మరిన్ని రాకెట్లను అభివృద్ధి చేస్తున్నట్లు స్కైరూట్ పేర్కొంది. వాటిలో క్రయోజెనిక్ ఇంజిన్నూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఉపగ్రహ ప్రయోగాల కోసం స్కైరూట్ ఇటీవల ఫ్రాన్స్ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. 2018లో ఏర్పాటైన ఈ సంస్థ గత ఏడాది విజయవంతంగా విక్రమ్-ఎస్ అనే రాకెట్ను తొలిసారిగా ప్రయోగించింది. తద్వారా భారత్లో ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేటు సంస్థగా రికార్డు సృష్టించింది.
150కి పైగా అంకురాలు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పుడు అగ్రపథాన ఉందని, ఇతర దేశాలకు మార్గదర్శనం చేసే స్థితికి చేరుకుందని ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ తెలిపారు. అంతరిక్ష రంగం అభివృద్ధికి అడ్డుగా ఉన్న సంకెళ్లను తొలగించేందుకు ప్రధాని చేసిన కృషితో నాలుగేళ్లలో ఇందులో ఎంతో అభివృద్ధి సాధ్యమయ్యిందని అన్నారు. కొన్ని ఏళ్ల క్రితం 10 లోపే ఉన్న అంతరిక్ష అంకురాల సంఖ్య నేడు 150కి చేరిందని పేర్కొన్నారు. స్కైరూట్ సంస్థ భారత శాస్త్ర, సాంకేతిక సామర్థ్యానికి ప్రబల ఉదాహరణ అని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరగడం వల్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇస్రోకు, అంకుర పరిశ్రమలకు మధ్య ఆరోగ్యకర సహకారానికి మార్గం సుగమమవుతుందని జితేంద్ర సింగ్ చెప్పారు. అంతిమంగా దీనివల్ల భారత్ నుంచి చేపట్టే అంతరిక్ష ప్రయోగాల సంఖ్య పెరిగి, దేశానికి మరింత ఆదాయం సమకూరుతుందని చెప్పారు. 2047లో దేశం 100వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకునే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్యం గణనీయంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అంతరిక్ష రంగంలో భారత్ వాటా 8 బిలియన్ డాలర్లు (2 శాతం)గా ఉందని, 2040 నాటికి దాన్ని 40 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. అయితే కొన్ని ప్రపంచ సంస్థలు ఒకడుగు ముందుకేసి.. 100 బిలియన్ డాలర్ల స్థాయిని అందుకునే సత్తా భారత రోదసీ రంగానికి ఉన్నట్లు చెబుతున్నాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్