Vikram-1 Rocket: ఏడంతస్తుల పొడవైన రాకెట్
అంతరిక్ష రంగంలోని అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ల డిజైన్, తయారీ, పరీక్షలు, పరిశోధన కోసం కొత్త కేంద్రం ‘మ్యాక్స్-క్యూ’ను ప్రారంభించింది.
విక్రమ్-1ను ఆవిష్కరించిన స్కైరూట్ ఏరోస్పేస్
హైదరాబాద్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రారంభం
ఈనాడు - హైదరాబాద్
అంతరిక్ష రంగంలోని అంకుర సంస్థ స్కైరూట్(Skyroot) ఏరోస్పేస్ రాకెట్ల డిజైన్, తయారీ, పరీక్షలు, పరిశోధన కోసం కొత్త కేంద్రం ‘మ్యాక్స్-క్యూ’ను ప్రారంభించింది. హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంగళవారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన ఏడంతస్తుల పొడవైన విక్రమ్-1 అనే రాకెట్ను(Vikram-1 rocket) ఆయన ఆవిష్కరించారు. దీన్ని వచ్చే ఏడాది ఆరంభంలో తొలిసారిగా నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది. ఇది దాదాపు 300 కిలోల పేలోడ్ను దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. పూర్తిగా కార్బన్ ఫైబర్ కాంపోజిట్ బాడీతో రూపొందిన ఈ రాకెట్ ద్వారా బహుళ ఉపగ్రహాలను ప్రయోగించొచ్చు. ఇందులో త్రీడీ ముద్రిత ద్రవ ఇంజిన్ను ఏర్పాటు చేశారు.
రూ.526 కోట్ల పెట్టుబడులు: స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ కంపెనీలో దాదాపు 280 మంది పనిచేస్తున్నారని, రూ.526 కోట్ల పెట్టుబడులను సమీకరించామని తెలిపారు. కొత్త ప్రాంగణానికి పెట్టిన పేరు గురించి వివరిస్తూ.. అంతరిక్షంలోకి వెళ్లే ప్రతి రాకెట్ ఒక దశలో గరిష్ఠ ఒత్తిడికి గురికావాల్సి ఉంటుందని, దాన్ని ‘మ్యాక్స్-క్యూ’ అంటారని చెప్పారు. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ కేంద్రం... దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ అభివృద్ధి కేంద్రమని చెప్పారు. ఈ అధునాతన ప్రాంగణంలో రాకెట్ల డిజైన్, తయారీ, పరీక్షలకు అన్ని వసతులు ఉన్నాయన్నారు. స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ మాట్లాడుతూ.. తమ డిజైన్ నైపుణ్యానికి దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి విక్రమ్-1ను రూపొందించినట్లు చెప్పారు. ఈ రాకెట్లోని మొదటి మూడు దశలు ఘన ఇంధనంతో పనిచేస్తాయి. దీనికి తక్కువ మౌలిక వసతులు సరిపోతాయి. 72 గంటల్లోనే దీన్ని అసెంబుల్ చేసి, ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. విక్రమ్ శ్రేణి కింద మరిన్ని రాకెట్లను అభివృద్ధి చేస్తున్నట్లు స్కైరూట్ పేర్కొంది. వాటిలో క్రయోజెనిక్ ఇంజిన్నూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఉపగ్రహ ప్రయోగాల కోసం స్కైరూట్ ఇటీవల ఫ్రాన్స్ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. 2018లో ఏర్పాటైన ఈ సంస్థ గత ఏడాది విజయవంతంగా విక్రమ్-ఎస్ అనే రాకెట్ను తొలిసారిగా ప్రయోగించింది. తద్వారా భారత్లో ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేటు సంస్థగా రికార్డు సృష్టించింది.
150కి పైగా అంకురాలు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పుడు అగ్రపథాన ఉందని, ఇతర దేశాలకు మార్గదర్శనం చేసే స్థితికి చేరుకుందని ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ తెలిపారు. అంతరిక్ష రంగం అభివృద్ధికి అడ్డుగా ఉన్న సంకెళ్లను తొలగించేందుకు ప్రధాని చేసిన కృషితో నాలుగేళ్లలో ఇందులో ఎంతో అభివృద్ధి సాధ్యమయ్యిందని అన్నారు. కొన్ని ఏళ్ల క్రితం 10 లోపే ఉన్న అంతరిక్ష అంకురాల సంఖ్య నేడు 150కి చేరిందని పేర్కొన్నారు. స్కైరూట్ సంస్థ భారత శాస్త్ర, సాంకేతిక సామర్థ్యానికి ప్రబల ఉదాహరణ అని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరగడం వల్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇస్రోకు, అంకుర పరిశ్రమలకు మధ్య ఆరోగ్యకర సహకారానికి మార్గం సుగమమవుతుందని జితేంద్ర సింగ్ చెప్పారు. అంతిమంగా దీనివల్ల భారత్ నుంచి చేపట్టే అంతరిక్ష ప్రయోగాల సంఖ్య పెరిగి, దేశానికి మరింత ఆదాయం సమకూరుతుందని చెప్పారు. 2047లో దేశం 100వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకునే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్యం గణనీయంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అంతరిక్ష రంగంలో భారత్ వాటా 8 బిలియన్ డాలర్లు (2 శాతం)గా ఉందని, 2040 నాటికి దాన్ని 40 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. అయితే కొన్ని ప్రపంచ సంస్థలు ఒకడుగు ముందుకేసి.. 100 బిలియన్ డాలర్ల స్థాయిని అందుకునే సత్తా భారత రోదసీ రంగానికి ఉన్నట్లు చెబుతున్నాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
Play Store: ప్లే స్టోర్లో ప్రభుత్వ యాప్లను పోలిన ఫేక్ యాప్స్కు చెక్ పెట్టేందుకు గూగుల్ లేబుల్స్ తీసుకురానుంది. -
యూఎస్లో యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ను లాంచ్ చేసిన రెడ్డీస్
డాక్టర్ రెడ్డీస్ అమెరికాలో జెనరిక్ యాంటీ బాక్టీరియల్ ఔషధాన్ని విడుదల చేసింది. -
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
Naresh Goyal: క్యాన్సర్తో పోరాడుతున్న తన భార్య జీవిత చరమాంకంలో ఉందని, ఆమె పక్కన ఉండేందుకు మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలని జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కోర్టును కోరారు. -
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 732 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
Bajaj Pulsar NS400Z: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్400Z పేరుతో మరో కొత్త పల్సర్ను లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
Noise Pop Buds: నాయిస్ మరో ట్రూవైర్లెస్ ఇయర్ఫోన్స్ను భారత్లో విడుదల చేసింది. క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. -
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 453 పాయింట్ల లాభంతో 75,064 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 135 పాయింట్లు పుంజుకొని 22,783 దగ్గర కొనసాగుతోంది. -
కోఫోర్జ్ చేతికి సిగ్నిటీ టెక్నాలజీస్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ను, దేశీయ ఐటీ రంగ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన కోఫోర్జ్ లిమిటెడ్ (గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్) సొంతం చేసుకోనుంది. -
పన్ను రాయితీలను ‘ఊహాజనిత నష్టం’గా ఎలా పరిగణిస్తారు?
ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలను, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) ‘ఊహాజనిత నష్టం’ గా ఎలా నిర్ణయిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు. -
మన ఎలక్ట్రానిక్స్లో చైనా, హాంకాంగ్ నుంచే 56%
గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులు 89.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.45 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
సేవల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయ్
మన దేశం నుంచి సేవల ఎగుమతులు, ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 1.3% తగ్గి 30 బిలియన్ డాలర్ల (సుమరు రూ.2.5 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ గురువారం తెలిపింది. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
నష్టాల నుంచి లాభాల్లోకి
ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవ్వడం, సానుకూల తయారీ గణాంకాల మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్ను బలోపేతం చేశాయి. -
రాణించిన డాబర్ ఇండియా
డాబర్ ఇండియా, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.341.22 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.292.76 కోట్ల కంటే ఇది 16.55% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.2,677.80 కోట్ల నుంచి 5.11% పెరిగి రూ.2,814.6 4 కోట్లకు చేరింది. -
బియ్యం, డెయిరీ ఉత్పత్తులపైనా నిఘా
దేశీయ మార్కెట్లో విక్రయమయ్యే పోషక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్), డెయిరీ ఉత్పత్తులు, మసాలాలపై నిఘా పెట్టాలని ఆహార నియంత్రణాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ భావిస్తోంది. -
‘కొవాగ్జిన్’ ఆవిష్కరణలో భద్రతకే పెద్దపీట
టీకా తీసుకున్న ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ‘కొవాగ్జిన్’ టీకాను రూపొందించినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ గురువారం వెల్లడించింది. ‘ఏదైనా టీకా ప్రభావం కొంతకాలమే ఉండొచ్చు, కానీ రోగుల భద్రత ఎంతో ముఖ్యం. -
కోల్ ఇండియా లాభంలో 26% వృద్ధి
కోల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.8,682.20 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.6,875.07 కోట్ల కంటే ఇది 26.2% అధికం. -
37% తగ్గిన అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం
అదానీ ఎంటర్ప్రైజెస్, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.450.58 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.722.48 కోట్లతో పోలిస్తే ఇది 37% తక్కువ. -
జీఎస్టీ నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం
రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీ ఉన్నతాధికారుల 3వ జాతీయ సమన్వయ సమావేశం శుక్రవారం జరగనుంది. -
సంక్షిప్త వార్తలు( 7)
ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల సంస్థ అవేవా, హైదరాబాద్లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటువంటి కేంద్రాల్లో ఇది ఆరోది.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?