E-Verification of ITR: ఇ-వెరిఫై చేయలేదా? ఆ రిటర్నులను తొలగించుకోవచ్చు
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడు, దాన్ని 30 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాలి. కొంతమంది గడువు లోపు వెరిఫై చేయలేదు. ఇలాంటి వారు పాత రిటర్నులను పూర్తిగా తొలగించి (డిస్కార్డ్), కొత్త రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చింది.
ఐటీ విభాగం వెసులుబాటు
ఈనాడు - హైదరాబాద్ : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడు, దాన్ని 30 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాలి. కొంతమంది గడువు లోపు వెరిఫై(E-Verification of ITR) చేయలేదు. ఇలాంటి వారు పాత రిటర్నులను పూర్తిగా తొలగించి (డిస్కార్డ్), కొత్త రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) లేదా 139(5) కింద రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేయకుండా ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. వెరిఫై చేసిన వారికి ఈ వెసులుబాటు ఉండదు. మదింపు సంవత్సరం 2023-24 (ఆర్థిక సంవత్సరం 2022-23) నుంచి మాత్రమే ఈ అవకాశం. క్రితం ఆర్థిక సంవత్సర రిటర్నులను తొలగించడం సాధ్యం కాదు. పన్ను చెల్లింపుదారుల రిటర్నులలో పొరపాట్లు ఉన్నప్పుడు, రివైజ్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ డిస్కార్డ్ ఆప్షన్ను తీసుకొచ్చింది.
ఒకసారి రిటర్నులు తొలగిస్తే.. ఇక రిటర్నులు దాఖలు చేయనట్లే లెక్క. మళ్లీ కొత్తగా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. దీనికి సంబంధించి మరిన్ని సందేహాలను ఆదాయపు పన్ను విభాగం నివృతి చేసింది. కొన్ని పరిశీలిద్దాం..
? నేను జులై 30న ఆదాయపు పన్ను రిటర్నులను సెక్షన్ 139(1) కింద దాఖలు చేశాను. వెరిఫికేషన్ చేయలేదు. ఈ రిటర్నులను తొలగించొచ్చా
ఆదాయపు పన్ను సెక్షన్ 139(1)/139(4)/139(5) కింద దాఖలు చేసిన రిటర్నులను ఇప్పటికీ వెరిఫై చేయకపోతే ఆ రిటర్నులను పూర్తిగా తొలగించేయొచ్చు. ఒకసారి తొలగించాక, తాజాగా రిటర్నులు దాఖలు చేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, సెక్షన్ 139(1) ప్రకారం గడువు లోపు రిటర్నులు దాఖలు చేశారా లేదా అనేది చూసుకోవాలి. గడువు తీరిన తర్వాత దాఖలు చేసిన రిటర్నులకు సెక్షన్ 234ఎఫ్ కింద నిబంధనల మేరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
? పొరపాటున రిటర్ను తొలగిస్తే, తిరిగి పొందవచ్చా
సాధ్యం కాదు. ఒకసారి తొలగించిన రిటర్నులను వెనక్కి తెప్పించలేం. కాబట్టి, డిస్కార్డ్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకోండి.
? ‘డిస్కార్డ్’ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది
ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్లోకి లాగిన్ అయి, ఇ-ఫైల్, ఇన్కంట్యాక్స్ రిటర్న్, ఇ-వెరిఫై ఐటీఆర్కు వెళ్లి అక్కడ ‘డిస్కార్డ్’ ఆప్షన్ను ఎంచుకోవచ్చు.
దీంతోపాటు ఇంకా కొన్ని సందేహాలకూ ఆదాయపు పన్ను విభాగం సమాధానాలు ఇచ్చింది..
- రిటర్నులను డిస్కార్డ్ చేసిన తర్వాత కచ్చితంగా కొత్త రిటర్నులను దాఖలు చేయాలి.
- ఐటీఆర్-5ని ఆదాయపు పన్ను విభాగం సీపీసీకి పోస్టులో పంపించిన వారు, రిటర్నులను తొలగించకూడదు.
- ఐటీఆర్ను వెరిఫై చేసేంత వరకూ ఎన్నిసార్లయినా రిటర్నులను తొలగించి, కొత్తది దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.
- గడువులోపు రిటర్నులను సెక్షన్ 139(1) కింద దాఖలు చేసినప్పటికీ, తర్వాత దాన్ని తొలిగిస్తే.. కొత్తగా దాఖలు చేస్తున్న రిటర్నులను సెక్షన్ 139(4) కింద దాఖలు చేయాల్సి ఉంటుంది.
- వెరిఫై చేసిన రిటర్నులను రివైజ్డ్ చేసుకునే వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM