E-Verification of ITR: ఇ-వెరిఫై చేయలేదా? ఆ రిటర్నులను తొలగించుకోవచ్చు
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడు, దాన్ని 30 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాలి. కొంతమంది గడువు లోపు వెరిఫై చేయలేదు. ఇలాంటి వారు పాత రిటర్నులను పూర్తిగా తొలగించి (డిస్కార్డ్), కొత్త రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చింది.
ఐటీ విభాగం వెసులుబాటు
ఈనాడు - హైదరాబాద్ : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడు, దాన్ని 30 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాలి. కొంతమంది గడువు లోపు వెరిఫై(E-Verification of ITR) చేయలేదు. ఇలాంటి వారు పాత రిటర్నులను పూర్తిగా తొలగించి (డిస్కార్డ్), కొత్త రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) లేదా 139(5) కింద రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేయకుండా ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. వెరిఫై చేసిన వారికి ఈ వెసులుబాటు ఉండదు. మదింపు సంవత్సరం 2023-24 (ఆర్థిక సంవత్సరం 2022-23) నుంచి మాత్రమే ఈ అవకాశం. క్రితం ఆర్థిక సంవత్సర రిటర్నులను తొలగించడం సాధ్యం కాదు. పన్ను చెల్లింపుదారుల రిటర్నులలో పొరపాట్లు ఉన్నప్పుడు, రివైజ్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ డిస్కార్డ్ ఆప్షన్ను తీసుకొచ్చింది.
ఒకసారి రిటర్నులు తొలగిస్తే.. ఇక రిటర్నులు దాఖలు చేయనట్లే లెక్క. మళ్లీ కొత్తగా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. దీనికి సంబంధించి మరిన్ని సందేహాలను ఆదాయపు పన్ను విభాగం నివృతి చేసింది. కొన్ని పరిశీలిద్దాం..
? నేను జులై 30న ఆదాయపు పన్ను రిటర్నులను సెక్షన్ 139(1) కింద దాఖలు చేశాను. వెరిఫికేషన్ చేయలేదు. ఈ రిటర్నులను తొలగించొచ్చా
ఆదాయపు పన్ను సెక్షన్ 139(1)/139(4)/139(5) కింద దాఖలు చేసిన రిటర్నులను ఇప్పటికీ వెరిఫై చేయకపోతే ఆ రిటర్నులను పూర్తిగా తొలగించేయొచ్చు. ఒకసారి తొలగించాక, తాజాగా రిటర్నులు దాఖలు చేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, సెక్షన్ 139(1) ప్రకారం గడువు లోపు రిటర్నులు దాఖలు చేశారా లేదా అనేది చూసుకోవాలి. గడువు తీరిన తర్వాత దాఖలు చేసిన రిటర్నులకు సెక్షన్ 234ఎఫ్ కింద నిబంధనల మేరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
? పొరపాటున రిటర్ను తొలగిస్తే, తిరిగి పొందవచ్చా
సాధ్యం కాదు. ఒకసారి తొలగించిన రిటర్నులను వెనక్కి తెప్పించలేం. కాబట్టి, డిస్కార్డ్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకోండి.
? ‘డిస్కార్డ్’ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది
ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్లోకి లాగిన్ అయి, ఇ-ఫైల్, ఇన్కంట్యాక్స్ రిటర్న్, ఇ-వెరిఫై ఐటీఆర్కు వెళ్లి అక్కడ ‘డిస్కార్డ్’ ఆప్షన్ను ఎంచుకోవచ్చు.
దీంతోపాటు ఇంకా కొన్ని సందేహాలకూ ఆదాయపు పన్ను విభాగం సమాధానాలు ఇచ్చింది..
- రిటర్నులను డిస్కార్డ్ చేసిన తర్వాత కచ్చితంగా కొత్త రిటర్నులను దాఖలు చేయాలి.
- ఐటీఆర్-5ని ఆదాయపు పన్ను విభాగం సీపీసీకి పోస్టులో పంపించిన వారు, రిటర్నులను తొలగించకూడదు.
- ఐటీఆర్ను వెరిఫై చేసేంత వరకూ ఎన్నిసార్లయినా రిటర్నులను తొలగించి, కొత్తది దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.
- గడువులోపు రిటర్నులను సెక్షన్ 139(1) కింద దాఖలు చేసినప్పటికీ, తర్వాత దాన్ని తొలిగిస్తే.. కొత్తగా దాఖలు చేస్తున్న రిటర్నులను సెక్షన్ 139(4) కింద దాఖలు చేయాల్సి ఉంటుంది.
- వెరిఫై చేసిన రిటర్నులను రివైజ్డ్ చేసుకునే వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (8)
జియో ఎయిర్ఫైబర్కు రూ.1,000 ఛార్జీ మినహాయింపు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది.