2030కి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

భారత్‌ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2023-24లో దేశ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Published : 06 Dec 2023 02:22 IST

ఎస్‌ అండ్‌ పీ అంచనా

దిల్లీ: భారత్‌ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2023-24లో దేశ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే ఏడాది వృద్దిరేటు 6.9 శాతానికి, 2026-27 నాటికి 7 శాతానికి చేరుతుందని లెక్కగట్టింది. ఈ క్రమంలో 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలుస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మన దేశం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మన కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి. ప్రపంచానికి అతిపెద్ద తయారీ కేంద్రంగా నిలవడమే ఇప్పుడు భారత్‌ ముందున్న సవాలు అని ఎస్‌ అండ్‌ పీ తెలిపింది. సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనికి బలమైన లాజిస్టిక్స్‌ నిబంధనావళి అవసరమని తెలిపింది. మరోవైపు భారత శ్రామిక వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయాల్సి ఉందని వెల్లడించింది. అందుకోసం కార్మికులు, ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపర్చాలని సూచించింది. మహిళా భాగస్వామ్యాన్ని కూడా పెంచాలని తెలిపింది. వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్‌ మార్కెట్‌.. రాబోయే దశాబ్ద కాలంలో భారత అంకురాల వ్యవస్థ విస్తరణకు ఉపకరిస్తుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని