పెను ముప్పుగా మధుమేహ వ్యాధి
అల్జీమర్స్, మధుమేహం, ఊబకాయం వ్యాధులకు చికిత్సలో వినియోగించే కొన్ని నూతన ఔషధాలను బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ త్వరలో మనదేశంలోకి తీసుకురానుంది.
కొత్త ఔషధాలు తెస్తున్నాం
ఎలీ లిల్లీ అండ్ కంపెనీ సీఈఓ డేవిడ్ రిక్స్
ఈనాడు, హైదరాబాద్: అల్జీమర్స్, మధుమేహం, ఊబకాయం వ్యాధులకు చికిత్సలో వినియోగించే కొన్ని నూతన ఔషధాలను బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ త్వరలో మనదేశంలోకి తీసుకురానుంది. బయో ఏషియా 2024 సదస్సుకు బుధవారం హాజరైన ఎలీ లిల్లీ అండ్ కంపెనీ సీఈఓ డేవిడ్ రిక్స్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. భారతదేశంలో ఊబకాయం, మధు మేహ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చైనా తర్వాత ఈ జబ్బులున్న వారి సంఖ్య భారతదేశంలో అధికంగా ఉండగా.. ఈ విషయంలో త్వరలో చైనాను భారత్ మించిపోయే అవకాశం ఉందనీ హెచ్చరించారు. మధు మేహ వ్యాధికి తగిన పరిష్కారాలు కనుగొనేందుకు ఎన్నో ఏళ్లుగా ఎలీ లిల్లీ కృషి చేస్తూ, ఎన్నో కొత్త ఔషధాలు తీసుకువచ్చినట్లు వివరించారు. ఎక్కువ మంది బాధితులకు ఈ మందులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్జీమర్స్ వ్యాధికి విప్లవాత్మక పరిష్కారాన్ని కనుగొన్నామని, దీనికి త్వరలో అనుమతులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఊబకాయ చికిత్సలో తాము అందించే మందులకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉందని గుర్తు చేశారు. భారతదేశంలో 3 దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్నామని, బెంగుళూరులో తమ కంపెనీకి అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఉందని వెల్లడించారు. భారతదేశ వృద్ధి అవకాశాల వల్ల, ప్రజల తలసరి ఆదాయం - జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. జీవశాస్త్రాలు, ఔషధ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రస్థానంగా మారిందని ప్రశంసించారు.
ఏఐ, డేటాతో పరిశోధనలు వేగవంతం
ఏఐ (కృత్రిమ మేధ), డేటా టెక్నాలజీలతో మందుల పరిశోధన వేగవంతం అవుతున్నట్లు మెడ్ట్రానిక్ ఛైర్మన్ - సీఈఓ జెఫ్ మార్తా అభిప్రాయపడ్డారు. శాస్త్ర పరిశోధనలు హైదరాబాద్లో అధికంగా జరుగుతున్నాయని, ఇందులో మెడ్ట్రానిక్ భాగస్వామి అవుతోందని వివరించారు. ప్రతి సెకనుకు ఇద్దరు రోగులకు తాము సేవలు అందిస్తున్నామని, వైద్యులు, టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే తొలి మెడ్టెక్ కంపెనీ తమదేనని తెలిపారు. పార్కిన్సన్ వ్యాధికి 30 ఏళ్లుగా నెర్వ్ సిమ్యులేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని, మెదడుకు వెళ్లే సంకేతాలను గుర్తించే సెన్సర్లను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్.. వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం వైద్యశాస్త్రం, ఔషధ పరిశ్రమ, ఔషధ ఉపకరణాల మీద విశేష ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు.
జీవశాస్త్రాలు.. ఐటీ కలిసి ఉంది ఇక్కడే
విద్య, వైద్య రంగాల్లో ఏఐ, ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానం క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటి ఆధారంగా వస్తు, సేవలు ఆవిష్కరించడానికి అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎండీ జెరెమీ జెర్జెన్స్ అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉన్నందునే, 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. జీవ శాస్త్రాలు, ఐటీ పరిజ్ఞానం అందుబాటులో ఉన్న మెరుగైన ప్రదేశం ఇంతకంటే మరొకటి కనిపించ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా ఆరోగ్య సవాళ్లకు తగిన పరిష్కారాలు ఆవిష్కరించడానికి కృషి చేస్తున్నామని వివరించారు.
వైద్య రంగంలో నిపుణుల కొరత
వైద్య రంగంలో ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ప్రధాన సమస్యగా మారిందని అపోలో హాస్పిటల్స్ సంయుక్త ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. బయో ఏషియా సదస్సులో భాగంగా నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులు, నర్సులు తగినంత సంఖ్యలో లేరు. వృద్ధాప్య జనాభా పెరుగుదల, కొత్త సాంకేతికతలు, వైద్య విధానాలు, జీవన శైలి వ్యాధులు పెరగడం లాంటివి ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. వైద్య సేవలను ఎక్కడినుంచైనా అందించే సాంకేతికత అందుబాటులోకి రావాలి. ఇప్పటికే టెలిమెడిసిన్ లాంటి సేవలను అందిస్తున్నాం. కృత్రిమ మేధ (ఏఐ) క్లినికల్ ఇంటెలిజెన్స్ రానున్న రోజుల్లో ఎంతో కీలకం కానుంది. ప్రతి సమాచారాన్ని ఏఐ మీద విశ్లేషిస్తే, కచ్చితమైన చికిత్స అందించేందుకు వీలవుతుంద’ని సంగీత పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (8)
జియో ఎయిర్ఫైబర్కు రూ.1,000 ఛార్జీ మినహాయింపు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్