పెను ముప్పుగా మధుమేహ వ్యాధి
అల్జీమర్స్, మధుమేహం, ఊబకాయం వ్యాధులకు చికిత్సలో వినియోగించే కొన్ని నూతన ఔషధాలను బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ త్వరలో మనదేశంలోకి తీసుకురానుంది.
కొత్త ఔషధాలు తెస్తున్నాం
ఎలీ లిల్లీ అండ్ కంపెనీ సీఈఓ డేవిడ్ రిక్స్
ఈనాడు, హైదరాబాద్: అల్జీమర్స్, మధుమేహం, ఊబకాయం వ్యాధులకు చికిత్సలో వినియోగించే కొన్ని నూతన ఔషధాలను బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ త్వరలో మనదేశంలోకి తీసుకురానుంది. బయో ఏషియా 2024 సదస్సుకు బుధవారం హాజరైన ఎలీ లిల్లీ అండ్ కంపెనీ సీఈఓ డేవిడ్ రిక్స్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. భారతదేశంలో ఊబకాయం, మధు మేహ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చైనా తర్వాత ఈ జబ్బులున్న వారి సంఖ్య భారతదేశంలో అధికంగా ఉండగా.. ఈ విషయంలో త్వరలో చైనాను భారత్ మించిపోయే అవకాశం ఉందనీ హెచ్చరించారు. మధు మేహ వ్యాధికి తగిన పరిష్కారాలు కనుగొనేందుకు ఎన్నో ఏళ్లుగా ఎలీ లిల్లీ కృషి చేస్తూ, ఎన్నో కొత్త ఔషధాలు తీసుకువచ్చినట్లు వివరించారు. ఎక్కువ మంది బాధితులకు ఈ మందులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్జీమర్స్ వ్యాధికి విప్లవాత్మక పరిష్కారాన్ని కనుగొన్నామని, దీనికి త్వరలో అనుమతులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఊబకాయ చికిత్సలో తాము అందించే మందులకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉందని గుర్తు చేశారు. భారతదేశంలో 3 దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్నామని, బెంగుళూరులో తమ కంపెనీకి అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఉందని వెల్లడించారు. భారతదేశ వృద్ధి అవకాశాల వల్ల, ప్రజల తలసరి ఆదాయం - జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. జీవశాస్త్రాలు, ఔషధ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రస్థానంగా మారిందని ప్రశంసించారు.
ఏఐ, డేటాతో పరిశోధనలు వేగవంతం
ఏఐ (కృత్రిమ మేధ), డేటా టెక్నాలజీలతో మందుల పరిశోధన వేగవంతం అవుతున్నట్లు మెడ్ట్రానిక్ ఛైర్మన్ - సీఈఓ జెఫ్ మార్తా అభిప్రాయపడ్డారు. శాస్త్ర పరిశోధనలు హైదరాబాద్లో అధికంగా జరుగుతున్నాయని, ఇందులో మెడ్ట్రానిక్ భాగస్వామి అవుతోందని వివరించారు. ప్రతి సెకనుకు ఇద్దరు రోగులకు తాము సేవలు అందిస్తున్నామని, వైద్యులు, టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే తొలి మెడ్టెక్ కంపెనీ తమదేనని తెలిపారు. పార్కిన్సన్ వ్యాధికి 30 ఏళ్లుగా నెర్వ్ సిమ్యులేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని, మెదడుకు వెళ్లే సంకేతాలను గుర్తించే సెన్సర్లను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్.. వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం వైద్యశాస్త్రం, ఔషధ పరిశ్రమ, ఔషధ ఉపకరణాల మీద విశేష ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు.
జీవశాస్త్రాలు.. ఐటీ కలిసి ఉంది ఇక్కడే
విద్య, వైద్య రంగాల్లో ఏఐ, ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానం క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటి ఆధారంగా వస్తు, సేవలు ఆవిష్కరించడానికి అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎండీ జెరెమీ జెర్జెన్స్ అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉన్నందునే, 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. జీవ శాస్త్రాలు, ఐటీ పరిజ్ఞానం అందుబాటులో ఉన్న మెరుగైన ప్రదేశం ఇంతకంటే మరొకటి కనిపించ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా ఆరోగ్య సవాళ్లకు తగిన పరిష్కారాలు ఆవిష్కరించడానికి కృషి చేస్తున్నామని వివరించారు.
వైద్య రంగంలో నిపుణుల కొరత
వైద్య రంగంలో ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ప్రధాన సమస్యగా మారిందని అపోలో హాస్పిటల్స్ సంయుక్త ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. బయో ఏషియా సదస్సులో భాగంగా నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులు, నర్సులు తగినంత సంఖ్యలో లేరు. వృద్ధాప్య జనాభా పెరుగుదల, కొత్త సాంకేతికతలు, వైద్య విధానాలు, జీవన శైలి వ్యాధులు పెరగడం లాంటివి ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. వైద్య సేవలను ఎక్కడినుంచైనా అందించే సాంకేతికత అందుబాటులోకి రావాలి. ఇప్పటికే టెలిమెడిసిన్ లాంటి సేవలను అందిస్తున్నాం. కృత్రిమ మేధ (ఏఐ) క్లినికల్ ఇంటెలిజెన్స్ రానున్న రోజుల్లో ఎంతో కీలకం కానుంది. ప్రతి సమాచారాన్ని ఏఐ మీద విశ్లేషిస్తే, కచ్చితమైన చికిత్స అందించేందుకు వీలవుతుంద’ని సంగీత పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం.. -
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగం పెరుగుతున్న తరుణంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సలహా అందించారు. -
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభపడ్డాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే