టాటా చిప్ తయారీ ప్లాంట్లు వస్తున్నాయ్
కొవిడ్ సమయంలో సెమీకండక్టర్ చిప్ల కొరత వల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఎంతో ఇబ్బంది పడింది. చిప్ల వాడకం తప్పనిసరి కావడంతో, అవి లభించక వాహనాల తయారీ కూడా నెమ్మదించింది.
ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
సీజీ పవర్కూ అనుమతులు
మొత్తం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు
దిల్లీ: కొవిడ్ సమయంలో సెమీకండక్టర్ చిప్ల కొరత వల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఎంతో ఇబ్బంది పడింది. చిప్ల వాడకం తప్పనిసరి కావడంతో, అవి లభించక వాహనాల తయారీ కూడా నెమ్మదించింది. ఈ పరిస్థితి మళ్లీ ఎదురవ్వకుండా, దేశీయ కంపెనీలతో పాటు అంతర్జాతీయ విపణులకూ అందించేందుకు మనదేశంలో 3 సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు గురువారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందులో టాటా గ్రూప్ 2 ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా.. జపాన్కు చెందిన రెనెసాస్ భాగస్వామ్యంతో సీజీ పవర్ ఒక ప్లాంటు నిర్మించనుంది. వీటి వల్ల మొత్తం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
రూ.76,000 కోట్ల ప్రభుత్వ మద్దతు: రక్షణ, వాహన, టెలికమ్యూనికేషన్ రంగాల కోసం చిప్ సెట్లను తయారు చేసే ఈ మూడు ప్లాంట్ల నిర్మాణం వచ్చే 100 రోజుల్లో ప్రారంభమవుతుందని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ‘డెవలప్మెంట్ ఆఫ్ సెమీకండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యాన్ఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్’ పథకం కింద ఏర్పాటయ్యే ఈ ప్లాంట్లకు ప్రభుత్వం నుంచి రూ.76,000 కోట్ల మద్దతు లభిస్తుంది.
టాటాలు.. 2 ప్లాంట్లు: తైవాన్కు చెందిన పవర్చిప్ సెమీకండక్టర్ మ్యాన్ఫ్యాక్చరింగ్ కార్ప్ భాగస్వామ్యంతో, టాటా గ్రూప్నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ఒక సెమీకండక్టర్ ఫ్యాబ్ను గుజరాత్లోని ఢొలేరాలో ఏర్పాటు చేయనుంది. నెలకు 50,000 వేఫర్ల తయారీ సామర్థ్యం దీని సొంతం. ఈ ప్లాంటుపై రూ.91,000 కోట్ల పెట్టుబడులు పెడతారు. 28 ఎన్ఎమ్ టెక్నాలజీతో అత్యుత్తమ పనితీరును అందించే చిప్లను ఇక్కడ తయారు చేస్తారు. వీటిని విద్యుత్తు వాహనాలు, టెలికాం, రక్షణ ఆటోమోటివ్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, డిస్ప్లే, పవర్ ఎలక్ట్రానిక్స్లో వినియోగిస్తారు. టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.27,000 కోట్లతో అస్సోంలోని మారిగావ్లో సెమీకండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ రోజుకు 4.8 కోట్ల చిప్లు తయారవుతాయి.
సనంద్లో సీజీ పవర్ చిప్ యూనిట్: జపాన్కు చెందిన రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్ప్, థాయ్లాండ్కు చెందిన స్టార్స్ మైక్రోఎలక్ట్రానిక్స్తో కలిసి సీజీ పవర్ రూ.7,600 కోట్ల పెట్టుబడితో గుజరాత్లోని సనంద్లో ఒక ప్లాంటు నిర్మించనుంది. రోజుకు 1.5 కోట్ల చిప్లను ఇక్కడ తయారు చేస్తారు. వీటిని వినియోగ ఉత్పత్తులు, పారిశ్రామిక, ఆటోమోటివ్, విద్యుత్ రంగాల్లో వాడతారు. ఇదే ప్రాంతంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన మైక్రాన్ సంస్థకూ గతేడాది జూన్లోనే మంత్రివర్గం అనుమతించింది.
భారీ స్థాయిలో ఉద్యోగాలు..: అతి తక్కువ సమయంలోనే ఈ మూడు ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయని.. వీటి వల్ల నేరుగా 20,000 అత్యాధునిక టెక్ ఉద్యోగాలు, 60,000 పరోక్ష ఉద్యోగాలు రానున్నాయని మంత్రి వైష్ణవ్ తెలిపారు.
గర్వంగా ఉంది: టాటా గ్రూప్
ఢొలేరాలో రూ.91,000 కోట్లతో ఏర్పాటు చేసే భారత తొలి వాణిజ్య ఫ్యాబ్ ద్వారా అంతర్జాతీయ సెమీకండక్టర్ పరిశ్రమలోకి టాటా ఎలక్ట్రానిక్స్ అడుగుపెడుతుంది. ఈ ఏడాదే ప్లాంటును నిర్మిస్తాం. సెమీకండక్టర్ తయారీలోకి భారత్ అడుగుపెట్టడానికి మేం ఆధ్వర్యం వహించడం గర్వంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్