మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది.
గత 10 ఏళ్లలో 4,62,733 కేసులు
ఆర్టీఐ దరఖాస్తుకు స్పందనగా ఆర్బీఐ వెల్లడి
దిల్లీ: గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ‘2013-14 నుంచి 2022-23 మధ్య ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మొత్తం మీద 4,62,733 మోసాలు జరిగాయి. అత్యధికంగా మహారాష్ట్రలో జరగ్గా.. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, హరియాణ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్లలోనూ మొత్తం బ్యాంకు మోసాలు 8,000-12,000 వరకు జరిగాయ’ని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఆంగ్ల వార్తా సంస్థ ‘మనీకంట్రోల్’ దాఖలు చేసిన పిటిషన్కు స్పందనగా ఆర్బీఐ తెలిపింది. ఓ వైపు బ్యాంకుల్లో మోసాలు పెరుగుతున్నా.. అవి మాత్రం రుణ నష్టభయ నిర్వహణపైనే దృష్టి సారించాయని కేర్రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ అంటున్నారు.
కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారానే
ఆర్బీఐ ఇటీవలి వార్షిక నివేదికలను విశ్లేషిస్తే చాలా వరకు మోసాలు రుణాలు, కార్డులు, డిజిటల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతుల్లోనే జరిగాయి. ఉదాహరణకు 2022-23లో నమోదైన 13,530 కేసుల్లో సగం వరకు (6,659) కార్డులు, నెట్ బ్యాంకింగ్ల్లోనే చోటుచేసుకున్నాయి. రుణాల్లో 4109 మోసాలు జరిగాయి. 2021-22లో 9,097 మోసాలు కనిపించగా.. అందులో రుణాలకు సంబంధించే 3,833 ఉన్నాయి. 3591 కేసులు కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిగాయి. 2020-21లో మొత్తం 7338 మోసాలు జరగ్గా..అందులో 3476 మోసాలు రుణాల్లో కనిపించాయి. ఇక 2545 మోసాలు నెట్బ్యాంకింగ్, కార్డు ద్వారా చోటు చేసుకున్నాయి.
ప్రజలు ఏం చేయాలంటే..
మోసాల బారినపడకుండా ప్రజలు తమ కేవైసీ (వినియోగదారు సమాచారం) నిబంధనలను తెలుసుకుని, ఎప్పటికప్పుడు తమ వివరాలను అప్డేట్ చేస్తుండాలని ఆర్బీఐ తెలిపింది. ఫోన్ కాల్స్, ఎస్ఎమ్ఎస్, ఇమెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని, ఓటీపీలను బ్యాంకులు ఎప్పుడూ అడగవని.. అటువంటి సందేశాలు బ్యాంకు పేరిట వచ్చినా స్పందించొద్దని ఆర్బీఐ హెచ్చరించింది. బ్యాంకులూ కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎమ్ఎల్) వంటి కొత్త సాంకేతికతపై పెట్టుబడులు పెట్టడం ద్వారా డిజిటల్ సేవలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
అంతర్జాతీయ బ్యాంకు మోసాల్లో రివకరీ 2-3 శాతమే: ఇంటర్పోల్
సింగపూర్: అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జరిగిన మోసపూరిత నగదు లావాదేవీల్లో 96 శాతానికి పైగా కనిపెట్టలేకపోయారని ఇంటర్పోల్ అంటోంది. చట్టవ్యతిరేకంగా జరిగిన 2-3 లక్షల కోట్ల డాలర్ల లావాదేవీల్లో 2-3% మేరే రికవరీ చేసి.. బాధితులకు అప్పజెప్పినట్లు ఇంటర్పోల్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చట్టవ్యతిరేక లావాదేవీలను అరికట్టడానికి 196 సభ్య దేశాల్లోని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, ప్రైవేటు ఆర్థిక సంస్థలతో కలిసి ఇంటర్పోల్ పనిచేస్తోంది. ఈ లావాదేవీలన్నీ డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, ఆయుధాలు, ఆర్థిక అవకతవకలకు సంబంధించినవేనని ఇంటర్పోల్ సెక్రటరీ జనరల్ జుర్గన్ స్టాక్ పేర్కొన్నారు. ఏటా 2-3 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.164-246 లక్షల కోట్ల) మేర చట్టవ్యతిరేక లావాదేవీలు జరుగుతున్నాయన్న అంచనాలున్నాయని అన్నారు. లావాదేవీల పరిశీలనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ప్రపంచవ్యాప్త బ్యాంకింగ్ సంఘాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!