షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది.
ధర రూ.24.90 లక్షలు
బీజింగ్: షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. దీని ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24.90 లక్షలు)గా నిర్ణయించింది. టెస్లా, బీవైడీ సంస్థల కార్లను తట్టుకుని నిలబడేందుకు సరసమైన ధరనే ఈ స్పోర్టీ కారుకు నిర్ణయించినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తొలుత దీని ధర 5,00,000 యువాన్ల (సుమారు రూ.58,00,000) వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఎస్యూ7 కార్లలో 4 వేరియంట్లను షియామీ విడుదల చేసింది. ఇందులో హై-పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ వెర్షన్ కూడా ఉంది. ఎంట్రీ లెవల్ వెర్షన్, ప్రో వేరియంట్, లిమిటెడ్ ఫౌండర్స్ ఎడిషన్లు మిగతావి. స్పోర్టింగ్ స్లీక్ 4-డోర్ సెడాన్ డిజైన్తో ఈ కారును తీసుకొచ్చింది.
1.98 సెకన్లలో 100 కి.మీ. వేగం: మ్యాక్స్ వేరియంట్ 265 కి.మీ. గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 2.78 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఒకసారి ఛార్జింగ్తో 819 కి.మీ. వరకు ప్రయాణించొచ్చు. లిమిటెడ్ ఫౌండర్స్ ఎడిషన్ డ్యూయెల్ మోటార్, 4-వీల్-డ్రైవ్ పవర్ట్రెయిన్, 986 బీహెచ్పీ పవర్తో రూపొందింది. కేవలం 1.98 సెకన్లలోనే ఇది 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఎస్యూ7లలో బ్యాటరీల కోసం సీఏటీఎల్తో షియామీ ఒప్పందం చేసుకుంది. ఇందులో రెండు ఎంపికలున్నాయి. 73.6 కిలోవాట్ అవర్ ప్యాక్ను ప్రాథమిక వేరియంట్లకు వినియోగిస్తున్నారు. 101 కిలోవాట్ అవర్ ప్యాక్ను టాప్ మోడళ్లకు వాడుతున్నారు. ఈ బ్యాటరీలు ఒకసారి ఛార్జింగ్తో కనీసం 700 కి.మీ. ప్రయాణించేలా డిజైన్ చేశారు. 15 నిమిషాలు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్తో 350-510 కి.మీ. ప్రయాణించేలా ఎస్యూ7లు రూపొందాయి.
నీ వచ్చే ఏడాది 150 కిలోవాట్ అవర్ పెద్ద బ్యాటరీని పరిచయం చేయాలని షియామీ భావిస్తోంది. ఇది జరిగితే ఒకసారి ఛార్జింగ్తో 1,200 కి.మీ. ప్రయాణించే అవకాశం లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం