షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్నకు చెందిన ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఏఐఎల్) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది.
రూ.7000 కోట్ల సమీకరణకు ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా దరఖాస్తు
దిల్లీ: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్నకు చెందిన ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఏఐఎల్) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. ఐపీఓ ద్వారా రూ.7000 కోట్లు సమీకరించేందుకు అనుమతి కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ.1,250 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో రూ.5,750 కోట్ల విలువైన షేర్లను సంస్థ ప్రమోటర్ గోస్వామి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ విక్రయించనుంది. అర్హులైన కంపెనీ ఉద్యోగుల కోసం కొన్ని షేర్లను కేటాయించనున్నారు. ప్రస్తుతం ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు 99.48% వాటా ఉంది. ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్లో రూ.250 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ చూస్తోంది. ఇది పూర్తయితే తాజా ఇష్యూ పరిమాణం తగ్గుతుంది.
- 1865లో స్థాపించిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (ఎస్పీ గ్రూప్), ప్రపంచవ్యాప్తంగా ఇంజినీరింగ్, నిర్మాణం, మౌలికం, స్థిరాస్తి, ఇంధనం, ఆర్థిక సేవల రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. భారీ కట్టడాల నిర్మాణం, దిగ్గజ ప్రదేశాల అభివృద్ధి, నీటి నిర్వహణ, పునరుత్పాదక ఇంధన, చమురు-గ్యాస్, విద్యుత్ విభాగాల్లో కంపెనీకి మంచి పేరుంది.
- ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాకు సముద్ర సంబంధిత, పారిశ్రామిక, ఉపరితల రవాణా, పట్టణ మౌలిక సదుపాయాలు, జల వనరులు, భూగర్భ, చమురు-గ్యాస్ మౌలిక వసతుల కల్పనా విభాగాలు ఉన్నాయి. గత 10 ఏళ్లలో 15 దేశాల్లో 76 ప్రాజెక్టులను కంపెనీ పూర్తిచేసింది. వీటి విలువ రూ.52,220 కోట్లు.
- 2023 సెప్టెంబరుకు కంపెనీ చేతిలో రూ.34,888 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. 2021-22లో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.11,018.97 కోట్లు కాగా.. 2022-23లో 14.7% పెరిగి రూ.12,637.38 కోట్లకు చేరింది. ఇదే సమయంలో లాభం రూ.357.60 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.410.86 కోట్లుగా నమోదైంది.
- పబ్లిక్ ఇష్యూ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్, జెఫ్రీస్ ఇండియా, నొమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్మెంట్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వ్యవహరిస్తాయి.
ఇకాస్ (ఇండియా) మొబిలిటీ కూడా: మొబిలిటీ సేవల సంస్థ ఇకాస్ (ఇండియా) మొబిలిటీ అండ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ కూడా ఐపీఓకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రానుంది. ఐపీఓలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్లో 1.8 కోట్ల షేర్లను ప్రమోటర్లు రాజేశ్ లూంబా, ఆదిత్య లూంబా విక్రయించనున్నారు. ప్రస్తుతం కంపెనీలో 100% వాటా ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు ఉంది. ఐపీఓ పూర్తి ఆఫర్ ఫర్ సేల్ కావడంతో, ఐపీఓ ద్వారా వచ్చిన నిధులు కంపెనీకి రావు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50 చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?