యూఎస్ఎఫ్డీఏ తనిఖీల్లో మన అధికారులు
అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) మనదేశంలో నిర్వహించే ఫార్మా కంపెనీల యూనిట్ల తనిఖీల్లో స్థానిక ఔషధ నియంత్రణ అధికార వర్గాలు పాలుపంచుకోనున్నాయి.
‘అబ్జర్వ్డ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్’లో తెలంగాణ సహా 4 రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అధికార్లు
దేశీయ ఫార్మా కంపెనీలకు మేలు
ఈనాడు, హైదరాబాద్: అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) మనదేశంలో నిర్వహించే ఫార్మా కంపెనీల యూనిట్ల తనిఖీల్లో స్థానిక ఔషధ నియంత్రణ అధికార వర్గాలు పాలుపంచుకోనున్నాయి. ‘అబ్జర్వ్డ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్’లో 4 రాష్ట్రాల ‘స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీస్’కు భాగస్వామ్యం కల్పించాలని యూఎస్ఎఫ్డీఏ నిర్ణయించింది. ఈ విషయాన్ని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి, యూఎస్ఎఫ్డీఏ ఇండియా కంట్రీ డైరెక్టర్ సారా మాక్ముల్లెన్ వెల్లడించారు. ఇందులో తెలంగాణ, గుజరాత్, గోవా, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. మనదేశంలో ఔషధ నియంత్రణ బాధ్యతలు నిర్వర్తించే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) భాగస్వామ్యంతో ఈ రాష్ట్రాలను ఎంపిక చేసినట్లు యూఎస్ఎఫ్డీఏ పేర్కొంది. దీని ప్రకారం ఫార్మా కంపెనీల్లో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించే కొన్ని రకాల ఆడిట్లు, తనిఖీల్లో రాష్ట్రాలకు చెందిన ఔషధ నియంత్రణ అధికార్లు ‘అబ్జర్వర్లు’ గా పాల్గొనే అవకాశం లభిస్తుంది. దీనివల్ల తనిఖీ వ్యవహారాల్లో ఔషధ నియంత్రణ అధికార్లకు అవగాహన పెరిగి, ప్రమాణాలను పాటించే విషయంలో ఫార్మా కంపెనీలకు మార్గదర్శకత్వం వహించగలుగుతారని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎంపిక చేసిన అధికార్లకే ఇప్పటిదాకా అవకాశం
యూఎస్ఎఫ్డీఏ ఎంపిక చేసిన అధికార్లు మాత్రమే ఇప్పటిదాకా తనిఖీలకు వస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది ఇతర దేశాలకు చెందిన వారు కాగా, మనదేశం నుంచి కొద్ది మందే ఉంటున్నారు. ఎఫ్డీఏ తనిఖీల తీరుపై ఫార్మా కంపెనీల నిర్వాహకులకు పూర్తిస్థాయిలో అవగాహన లేనందున, తగిన విధంగా సన్నద్ధులవ్వడం లేదు. ఫలితంగా తనిఖీ బృందాలు ఫార్మా కంపెనీల యూనిట్లలో అభ్యంతరాలు గుర్తించి హెచ్చరిక లేఖలు, ఫారమ్- 483 జారీ చేస్తున్నాయి. దీనివల్ల ఆయా యూనిట్లలో మందుల ఉత్పత్తి నిలిచిపోతోంది. అమెరికాకు సంబంధిత మందులను కొంతకాలం ఎగుమతి చేయలేక పోతున్నాయి. తనిఖీల్లో వెలుగుచూసిన అభ్యంతరాలను సవరించి.. ఆ విషయాన్ని యూఎస్ఎఫ్డీఏకు నివేదించి, మళ్లీ వారి తుది అనుమతి సంపాదించేందుకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదు.
అవగాహనతో పరిస్థితి మారుతుంది
యూఎస్ఎఫ్డీఏ ఆడిట్లు, తనిఖీలపై స్థానిక ఔషధ నియంత్రణ వర్గాలకూ పూర్తిస్థాయి అవగాహన అవసరమని, తద్వారా స్థానిక కంపెనీలకు సూచనలు ఇచ్చి లోపాలు లేకుండా జాగ్రత్త వహిస్తారనే ఆలోచన వచ్చింది. అందుకే ‘మీ తనిఖీల్లో స్థానిక అధికారులను భాగస్వాములను చేయాల’ని కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ, ఫార్మాగ్జిల్ (ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి) వర్గాలు యూఎస్ఎఫ్డీఏను కోరుతూ వస్తున్నాయి. వాణిజ్య శాఖ, సీడీఎస్సీఓ, ఫార్మాగ్జిల్ ప్రతినిధులు అమెరికా (మేరీల్యాండ్)లో ఉన్న యూఎస్ఎఫ్డీఏ కార్యాలయాన్ని సందర్శించి, అక్కడి అధికారులతో సంప్రదింపులు సాగించారు. ఈ ప్రయత్నాలు ఫలించి, తాము నిర్వహించే ఆడిట్లలో స్థానిక ఔషధ నియంత్రణ అధికార్లకు స్థానం కల్పించేందుకు యూఎస్ఎఫ్డీఏ అంగీకరించింది. తొలి దశలో 4 రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అధికార్లను ‘అబ్జర్వ్డ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్’ లో చేర్చింది. మనదేశంలో ఫార్మా యూనిట్లు అధికంగా ఉన్న రాష్ట్రాలను ఇందుకు ఎంపిక చేశారు. మలి దశలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ ఈ అవకాశం లభించొచ్చు. దానికి ఆయా రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అధికారులు కసరత్తు చేయాల్సి ఉంది. యూఎస్ఎఫ్డీఏ తీసుకున్న నిర్ణయం వల్ల ఫార్మా యూనిట్ల ఆడిట్లు, తనిఖీల ప్రక్రియ సులభతరం అవుతుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (8)
జియో ఎయిర్ఫైబర్కు రూ.1,000 ఛార్జీ మినహాయింపు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్