యూఎస్ఎఫ్డీఏ తనిఖీల్లో మన అధికారులు
అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) మనదేశంలో నిర్వహించే ఫార్మా కంపెనీల యూనిట్ల తనిఖీల్లో స్థానిక ఔషధ నియంత్రణ అధికార వర్గాలు పాలుపంచుకోనున్నాయి.
‘అబ్జర్వ్డ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్’లో తెలంగాణ సహా 4 రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అధికార్లు
దేశీయ ఫార్మా కంపెనీలకు మేలు
ఈనాడు, హైదరాబాద్: అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) మనదేశంలో నిర్వహించే ఫార్మా కంపెనీల యూనిట్ల తనిఖీల్లో స్థానిక ఔషధ నియంత్రణ అధికార వర్గాలు పాలుపంచుకోనున్నాయి. ‘అబ్జర్వ్డ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్’లో 4 రాష్ట్రాల ‘స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీస్’కు భాగస్వామ్యం కల్పించాలని యూఎస్ఎఫ్డీఏ నిర్ణయించింది. ఈ విషయాన్ని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి, యూఎస్ఎఫ్డీఏ ఇండియా కంట్రీ డైరెక్టర్ సారా మాక్ముల్లెన్ వెల్లడించారు. ఇందులో తెలంగాణ, గుజరాత్, గోవా, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. మనదేశంలో ఔషధ నియంత్రణ బాధ్యతలు నిర్వర్తించే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) భాగస్వామ్యంతో ఈ రాష్ట్రాలను ఎంపిక చేసినట్లు యూఎస్ఎఫ్డీఏ పేర్కొంది. దీని ప్రకారం ఫార్మా కంపెనీల్లో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించే కొన్ని రకాల ఆడిట్లు, తనిఖీల్లో రాష్ట్రాలకు చెందిన ఔషధ నియంత్రణ అధికార్లు ‘అబ్జర్వర్లు’ గా పాల్గొనే అవకాశం లభిస్తుంది. దీనివల్ల తనిఖీ వ్యవహారాల్లో ఔషధ నియంత్రణ అధికార్లకు అవగాహన పెరిగి, ప్రమాణాలను పాటించే విషయంలో ఫార్మా కంపెనీలకు మార్గదర్శకత్వం వహించగలుగుతారని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎంపిక చేసిన అధికార్లకే ఇప్పటిదాకా అవకాశం
యూఎస్ఎఫ్డీఏ ఎంపిక చేసిన అధికార్లు మాత్రమే ఇప్పటిదాకా తనిఖీలకు వస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది ఇతర దేశాలకు చెందిన వారు కాగా, మనదేశం నుంచి కొద్ది మందే ఉంటున్నారు. ఎఫ్డీఏ తనిఖీల తీరుపై ఫార్మా కంపెనీల నిర్వాహకులకు పూర్తిస్థాయిలో అవగాహన లేనందున, తగిన విధంగా సన్నద్ధులవ్వడం లేదు. ఫలితంగా తనిఖీ బృందాలు ఫార్మా కంపెనీల యూనిట్లలో అభ్యంతరాలు గుర్తించి హెచ్చరిక లేఖలు, ఫారమ్- 483 జారీ చేస్తున్నాయి. దీనివల్ల ఆయా యూనిట్లలో మందుల ఉత్పత్తి నిలిచిపోతోంది. అమెరికాకు సంబంధిత మందులను కొంతకాలం ఎగుమతి చేయలేక పోతున్నాయి. తనిఖీల్లో వెలుగుచూసిన అభ్యంతరాలను సవరించి.. ఆ విషయాన్ని యూఎస్ఎఫ్డీఏకు నివేదించి, మళ్లీ వారి తుది అనుమతి సంపాదించేందుకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదు.
అవగాహనతో పరిస్థితి మారుతుంది
యూఎస్ఎఫ్డీఏ ఆడిట్లు, తనిఖీలపై స్థానిక ఔషధ నియంత్రణ వర్గాలకూ పూర్తిస్థాయి అవగాహన అవసరమని, తద్వారా స్థానిక కంపెనీలకు సూచనలు ఇచ్చి లోపాలు లేకుండా జాగ్రత్త వహిస్తారనే ఆలోచన వచ్చింది. అందుకే ‘మీ తనిఖీల్లో స్థానిక అధికారులను భాగస్వాములను చేయాల’ని కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ, ఫార్మాగ్జిల్ (ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి) వర్గాలు యూఎస్ఎఫ్డీఏను కోరుతూ వస్తున్నాయి. వాణిజ్య శాఖ, సీడీఎస్సీఓ, ఫార్మాగ్జిల్ ప్రతినిధులు అమెరికా (మేరీల్యాండ్)లో ఉన్న యూఎస్ఎఫ్డీఏ కార్యాలయాన్ని సందర్శించి, అక్కడి అధికారులతో సంప్రదింపులు సాగించారు. ఈ ప్రయత్నాలు ఫలించి, తాము నిర్వహించే ఆడిట్లలో స్థానిక ఔషధ నియంత్రణ అధికార్లకు స్థానం కల్పించేందుకు యూఎస్ఎఫ్డీఏ అంగీకరించింది. తొలి దశలో 4 రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అధికార్లను ‘అబ్జర్వ్డ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్’ లో చేర్చింది. మనదేశంలో ఫార్మా యూనిట్లు అధికంగా ఉన్న రాష్ట్రాలను ఇందుకు ఎంపిక చేశారు. మలి దశలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ ఈ అవకాశం లభించొచ్చు. దానికి ఆయా రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అధికారులు కసరత్తు చేయాల్సి ఉంది. యూఎస్ఎఫ్డీఏ తీసుకున్న నిర్ణయం వల్ల ఫార్మా యూనిట్ల ఆడిట్లు, తనిఖీల ప్రక్రియ సులభతరం అవుతుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!