ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ట్రేడింగ్ ఈనెల 28తో ముగిసింది. ఈనెలలో చివరి 3 రోజులు సెలవులు కావడమే ఇందుకు కారణం.
2023-24లో చిన్న, మధ్య షేర్లదే పైచేయి..
2024-25లో దిగ్గజ కంపెనీల జోరు!
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ట్రేడింగ్ ఈనెల 28తో ముగిసింది. ఈనెలలో చివరి 3 రోజులు సెలవులు కావడమే ఇందుకు కారణం. గత ఏడాది కాలంలో చూస్తే పెద్ద (లార్జ్క్యాప్) షేర్లతో పోలిస్తే, మధ్య తరహా కంపెనీలు (మిడ్క్యాప్), చిన్న కంపెనీల షేర్లదే (స్మాల్క్యాప్) పైచేయిగా నిలిచింది. పెద్ద కంపెనీల షేర్ల కంటే ఇవి అధిక ప్రతిఫలాన్ని అందించాయి. 2023-24లో నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ 69%, నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 59% ప్రతిఫలాన్ని పంచాయి. ఇదే కాలంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్ 25%, నిఫ్టీ 29% మాత్రమే పెరగడం గమనార్హం. చిన్న, మధ్యస్థాయి కంపెనీల ఆదాయాల్లో వృద్ధికి తోడు భవిష్యత్తు అవకాశాలూ వాటికి బాగుండటం ఇందుకు కారణం. ఫలితంగా స్మాల్ క్యాప్, మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకీ నిధులు అధికంగా ప్రవహించాయి.
- 2023 మార్చి 31న స్మాల్క్యాప్ సూచీ 26,692.09 కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 7న జీవనకాల గరిష్ఠమైన 46,821.39కి చేరింది.
- 2023 మార్చి 31న మిడ్క్యాప్ సూచీ 23,881.79 కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 8న జీవనకాల గరిష్ఠమైన 40,282.49కి చేరింది.
ఇంతలా దూసుకెళ్లిన చిన్న, మధ్య తరహా షేర్ల విలువలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల చేసిన వ్యాఖ్యల కారణంగా.. తదుపరి నష్టాలు సంభవించాయి. ఈ నెలలోనే స్మాల్క్యాప్ సూచీ 4.55% పతనమైతే, మిడ్క్యాప్ సూచీ కూడా స్పల్పంగా దిద్దుబాటుకు గురైంది. 2024-25లోనూ చిన్న - మధ్య తరహా కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ముఖ్య పెట్టుబడుల వ్యూహకర్త వి.కె.విజయకుమార్ విశ్లేషిస్తున్నారు. సాధారణంగా చిన్న షేర్లపై దేశీయ మదుపర్లు దృష్టి సారిస్తుంటారని, విదేశీ పెట్టుబడిదారులు మాత్రం లార్జ్క్యాప్పైనే అధిక పెట్టుబడులు పెడుతుంటారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
లార్జ్క్యాప్ షేర్లు సానుకూల ధోరణిలో చలించేందుకు అవకాశాలు ఉన్నాయని.. ఈ షేర్ల అండతో 2024-25లో నిఫ్టీ 25,500ను తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ నిఫ్టీ కిందకు వచ్చినా 19500- 20,000 స్థాయుల వద్ద గట్టి మద్దతు లభించొచ్చని అంచనా వేస్తున్నారు.
రంగాల్లో ఇవి..
- రంగాల వారీ సూచీలను గమనిస్తే.. 2023-24లో నిఫ్టీ స్థిరాస్తి సూచీ 131% ప్రతిఫలాన్ని పంచింది. ఆ తర్వాత స్థానాల్లో నిఫ్టీ డిఫెన్స్ (115.96%), నిఫ్టీ పీఎస్ఈ (101.07%), నిఫ్టీ సీపీఎస్ఈ (94.45%), నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు (83.75%) సూచీలు నిలిచాయి.
- నిఫ్టీ సర్వీసెస్ (19.71%), నిఫ్టీ ఎఫ్ఎమ్సీజీ (16.6%), నిఫ్టీ బ్యాంక్ (15.14%), నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ (13.85%), నిఫ్టీ మీడియా రంగాలు ఓ మోస్తరుగా లాభాలను పంచాయి.
- 2024-25లో అధిక ప్రతిఫలాన్ని పంచే రంగాల సూచీల్లో నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ముందు వరుసలో ఉండొచ్చన్నది జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా. సానుకూలతల ప్రభావం ఇప్పటికే షేర్లపై కనిపించినందున, స్థిరాస్తి రంగ షేర్లు కొంత నెమ్మదించే అవకాశం ఉంది.
ఏం చేయాలి..
సార్వత్రిక ఎన్నికలు, కీలక వడ్డీ రేట్ల నిర్ణయాలపై అనిశ్చితుల కారణంగా 2024లో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. అందువల్ల మదుపర్లు తమ పోర్ట్ఫోలియోలో దిగ్గజ కంపెనీల షేర్లు (లార్జ్ క్యాప్), మధ్య తరహా కంపెనీల (మిడ్ క్యాప్) షేర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆర్థిక మూలాలు బాగున్న చిన్న కంపెనీలనూ పరిశీలించొచ్చని చెబుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ, దిగ్గజ బ్యాంకుల షేర్లు మున్ముందు మెరుగైన పనితీరును కనబర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్