అంతర్జాతీయ సంకేతాలే కీలకం
అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లు కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. దేశీయంగా చూస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్ష (ఏప్రిల్ 3-5) నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు.
ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు కూడా
వాహన, ఔషధ షేర్లకు సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్ మార్కెట్
ఈ వారం
అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లు కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. దేశీయంగా చూస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్ష (ఏప్రిల్ 3-5) నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ ప్రసంగ (ఏప్రిల్ 3) అంశాలూ గమనించాలి. నిఫ్టీ-50 తన జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 22,526.60ను పరీక్షించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. కార్పొరేట్ సంస్థల ఫలితాల సీజను ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండొచ్చని భావిస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
- చమురు కంపెనీల షేర్లు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా మొదలుపెట్టొచ్చు. అయితే పరిమిత లాభాలకే అవకాశం ఉంది. సెప్టెంబరు కల్లా ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరొచ్చని జేపీ మోర్గాన్ పేర్కొన్న నేపథ్యంలో, మదుపర్లు పెట్రో ధరలను గమనించాలి.
- మార్చినెల విక్రయ గణాంకాలు బాగుంటాయన్న అంచనాల మధ్య వాహన కంపెనీల షేర్లు సానుకూల ధోరణితో ట్రేడ్ కావొచ్చు. వాహన సూచీకి 21,000 వద్ద మద్దతు; 22,000 వద్ద నిరోధం ఏర్పడొచ్చు.
- నిఫ్టీ బ్యాంక్ ఈ వారమూ రాణించొచ్చు. 45,500 వద్ద మద్దతు, 48,500 వద్ద నిరోధం అంచనా వేస్తున్నారు. ఒక వేళ 48,500 స్థాయిని అధిగమిస్తే 49,500-50,000కు చేరొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐలను పరిశీలించొచ్చు.
- ఎఫ్ఎమ్సీజీ కంపెనీల షేర్లు మార్కెట్తో పాటే చలించొచ్చు. ముడిపదార్థాల ధరలు తగ్గుతుండడం కలిసిరావొచ్చు. అయితే బలహీన గ్రామీణ గిరాకీ వెనక్కి లాగొచ్చు. రాడికో ఖైతాన్, కోల్గేట్, గోద్రేజ్ కన్జూమర్ 8-10% వరకు లాభాలందిచొచ్చని ఓ బ్రోకరేజీ అంచనా.
- సిమెంటు షేర్లు ఒక శ్రేణికి లోబడి ట్రేడవవచ్చు. ఎన్నికల కోడ్ కారణంగా గిరాకీ కాస్త నెమ్మదించడం ఇందుకు కారణం. ధరలూ స్తబ్దుగానే ఉన్నాయి. సాగర్ సిమెంట్స్ రేటింగ్ ను ఓ బ్రోకరేజీ సంస్థ ‘కొనుగోలు’కు సవరించింది.
- యంత్ర పరికరాల కంపెనీల షేర్లు ఇప్పటికే అధిక ధరల వద్ద ఉండడంతో విక్రయాల ఒత్తిడికి గురికావొచ్చు. ఏప్రిల్-జూన్లో ప్రభుత్వ ఆర్డర్లు సైతం తగ్గొచ్చు. అయితే మధ్యకాలానికి ఈ రంగంపై విశ్లేషకులు ‘బులిష్’గా ఉన్నారు. ఏబీబీ ఇండియా లక్ష్యం ధరను రూ.7,550కు యూబీఎస్ పెంచింది.
- అమెరికా మార్కెట్లో బలమైన విక్రయాల మధ్య ఔషధ కంపెనీల షేర్లు లాభాలను పెంచుకోవచ్చు. దేశీయ మార్కెట్పై ఆధారపడ్డ షేర్లు నెమ్మదిగా పెరిగినా.. బలమైన రికవరీని చూడగలవని అంచనా.
- ఐటీ కంపెనీల షేర్లు ఒత్తిడిలోనే కొనసాగొచ్చు. గిరాకీ స్తబ్దత, బలహీన స్థూల ఆర్థిక వాతావరణం వల్ల స్వల్పకాలంలో మదుపర్లు ఈ షేర్ల కొనుగోలు విషయంలో దూకుడుగా వ్యవహరించకపోవచ్చు. ఇన్ఫోసిస్, టీసీఎస్ బలంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- లోహ కంపెనీల షేర్లకు అంతర్జాతీయ సంకేతాలు కలసిరావొచ్చు. ‘పడ్డపుడల్లా కొనుగోలు’ చేసే వ్యూహాన్ని మదుపర్లు అనుసరించడం మేలు. హిందాల్కో, సెయిల్ షేర్లను పరిశీలించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్