యుద్ధ మేఘాల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి
పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, అంతర్జాతీయ మార్కెట్లతో పాటు సోమవారం దేశీయ సూచీలూ బెంబేలెత్తాయి. మదుపర్లు స్థిరంగా అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి.
ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో మార్కెట్లు కుదేల్
సమీక్ష
పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, అంతర్జాతీయ మార్కెట్లతో పాటు సోమవారం దేశీయ సూచీలూ బెంబేలెత్తాయి. మదుపర్లు స్థిరంగా అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి. భారత్-మారిషస్ పన్ను ఒప్పందంలో మార్పులను ప్రతిపాదించడం, అమెరికాలో మార్చి ద్రవ్యోల్బణం అధికంగా నమోదు కావడమూ ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 83.44 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.04% నష్టంతో 89.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.5.18 లక్షల కోట్లు ఆవిరై రూ.394.48 లక్షల కోట్లకు పరిమితమైంది.
- సెన్సెక్స్ ఉదయం 73,315.16 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం కోలుకుని 73,905.80 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో 845.12 పాయింట్లు నష్టపోయి 73,399.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 246.90 పాయింట్లు కోల్పోయి 22,272.50 దగ్గర స్థిరపడింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 27 నష్టాలు నమోదుచేశాయి. విప్రో 2.47%, బజాజ్ ఫిన్సర్వ్ 2.40%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.30%, ఎల్ అండ్ టీ 2.10%, బజాజ్ ఫైనాన్స్ 2.09%, టాటా మోటార్స్ 1.93%, టెక్ మహీంద్రా 1.86%, హెచ్యూఎల్ 1.72%, టాటా స్టీల్ 1.59%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.58% నష్టపోయాయి. మారుతీ, నెస్లే, సన్ఫార్మా స్వల్పంగా లాభపడ్డాయి.
- ఒక్కో షేరుకు రూ.118 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు ఆస్టర్ డీఎం హెల్త్కేర్ బోర్డు ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 23లోగా వాటాదార్లకు కంపెనీ డివిడెండ్ చెల్లించనుంది. జీసీసీ వ్యాపార విక్రయం ద్వారా వచ్చిన నిధులతో ఈ డివిడెండ్ను కంపెనీ చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్టర్ డీఎం షేరు ఇంట్రాడేలో రూ.558.30 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకి, చివరకు 7.13% లాభంతో రూ.522.75 వద్ద ముగిసింది.
- 2018-19లో రిలయన్స్ క్యాపిటల్ ఆర్థిక గణాంకాల్లో ఆడిటింగ్ లోపాలపై ఒక ఆడిట్ సంస్థ, ఇద్దరు ఆడిటర్లపై రూ.4.5 కోట్ల జరిమానాను నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అధారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) విధించింది.
- రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎన్సీఎల్టీ నుంచి ఉపశమనం లభించింది. ముంబయి మెట్రో వన్పై స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎన్సీఎల్టీ కొట్టివేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా, ముంబయి మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా ముంబయి మెట్రోవన్ను ఏర్పాటు చేశాయి.
- దేశంలో ఎలక్ట్రానిక్ చిప్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులకు నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు రూ.241 కోట్ల సాఫ్ట్వేర్ ఉచితంగా అందించనున్నట్లు అమెరికాకు చెందిన సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ సంస్థ లామ్ రీసెర్చ్ కార్ప్ ప్రకటించింది. ఇందుకోసం ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లతో కంపెనీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
- కోటక్ మహీంద్రా బ్యాంక్ సర్వర్లు సోమవారం 11 గంటల పాటు మొరాయించడంతో, యూపీఐ చెల్లింపులు, నగదు ఉపసంహరణ, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు నిలిచి ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. అన్నీ పునరుద్ధరించినట్లు బ్యాంక్ ప్రతినిధి రాత్రి 10 గంటలకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి నీరిచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి