మన నగరాల్లో టెస్లా షోరూంలు!
అమెరికా విద్యుత్ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా, మన దేశంలో షోరూమ్లు (విక్రయ కేంద్రాలు) ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
3,000-5,000 చదరపు అడుగుల స్థలాల అన్వేషణ
భారత్ కోసం కుడిచేతి వైపు స్టీరింగ్ ఉన్న కార్ల తయారీ ప్రారంభం
దిల్లీ: అమెరికా విద్యుత్ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా, మన దేశంలో షోరూమ్లు (విక్రయ కేంద్రాలు) ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముఖ్య నగరాల్లో 3,000-5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో షోరూమ్తో పాటు సర్వీస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు స్థలాన్వేషణలో కంపెనీ ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలోనే మన దేశంలో విక్రయాలు ప్రారంభించాలని టెస్లా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దిల్లీ, ముంబయిలలో విక్రయ కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటికే స్థలాలను పరిశీలించినట్లు సమాచారం. పాశ్చాత్య దేశాల్లో కారు స్టీరింగ్ ఎడమచేతి వైపు ఉంటుంది. జర్మనీలోని ప్లాంట్లో, భారతీయులకు తగ్గట్లుగా కుడి చేతి వైపు స్టీరింగ్ ఉండే కార్లను టెస్లా ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ప్లాంటు ఏర్పాటుకూ సుముఖత చూపుతున్న టెస్లా, అది సిద్ధమయ్యేలోగా జర్మనీ నుంచి కార్లను దిగుమతి చేసుకుని విక్రయించాలనుకుంటోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత నాలుగేళ్లలో తొలిసారిగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో టెస్లా అంతర్జాతీయ వాహన డెలివరీలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మనదేశం సహా కొత్త విపణులకు విస్తరించేందుకు టెస్లా వేగంగా సన్నాహాలు చేసుకుంటోందని సమాచారం.
మనదేశం ఇస్తున్న రాయితీ ఇదీ
విద్యుత్ వాహనాల తయారీ ప్లాంటును కనీసం 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడితో పెట్టేవారికి, కొంతకాలం పాటు వాహనాలను 15% సుంకంపైనే దిగుమతి చేసుకునే అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పించింది. గత జూన్లో న్యూయార్క్లో సంప్రదింపులు జరిపిన ప్రధాని మోదీ-టెస్లా అధిపతి మస్క్,త్వరలోనే దిల్లీలో మరోసారి సమావేశం కానున్నారు. వచ్చే ఆదివారం నుంచి 2 రోజుల పాటు మస్క్ మనదేశంలో పర్యటించనున్నారు.
టాటా ఎలక్ట్రానిక్స్తో ఒప్పందం!
తన అంతర్జాతీయ కార్యకలాపాల కోసం సెమీ కండక్టర్ చిప్లను కొనుగోలు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్తో టెస్లా వ్యూహాత్మక ఒప్పందం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఒప్పంద విలువ, షరతుల వంటివి మస్క్ భారత్ పర్యటన సందర్భంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. మస్క్ భారత్ పర్యటనలో శాట్కామ్ సేవలకు సంబంధించి స్టార్ లింక్ ప్రణాళికలనూ వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
14,000 మందికి ఉద్వాసన?
టెస్లా అంతర్జాతీయంగా 10% మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. గత డిసెంబరు నాటికి టెస్లాలో 1.40 లక్షల మంది పని చేస్తున్నారు. 10 శాతం సిబ్బంది తొలగింపు నిర్ణయంతో సుమారు 14,000 మందిపై ప్రభావం పడనుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఎలాన్ మస్క్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఏయే విభాగాల వారిని తొలగిస్తున్నదీ ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే కొందరు తొలగింపునకు గురయ్యారని, వారికి కంపెనీ సిస్టమ్ యాక్సెస్ నిలిపివేసినట్లు సమాచారం. కొన్ని విభాగాల్లో ఒకేరకమైన బాధ్యతలు చూసే వారు అధికంగా ఉన్నందునే, తొలగింపులు చేయనున్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఇంతకాలం కంపెనీకి సేవలందించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తొలగింపునకు గురైన వారు కొత్త అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగంలో కొనసాగుతున్నవారు సవాళ్లకు సిద్ధమవ్వాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
ఓలా క్యాబ్స్ సీఈఓ పదవికి హేమంత్ భక్షి రాజీనామా చేశారు. సీఈఓ పదవి చేపట్టిన 4 నెలలకే బాధ్యతల నుంచి వైదొలిగారు. -
సౌత్ ఇండియన్ బ్యాంకుతో జట్టు కట్టిన టాటా మోటార్స్
వాణిజ్య వాహనాల ఫైనాన్స్ కోసం టాటా మోటార్స్.. సౌత్ ఇండియన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. -
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
దేశంలో డిజిటల్ లావాదేవీలతో పాటు నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది. సీఎంఎస్ సంస్థ వెలువరించిన తాజా నివేదిక ఈ పరిస్థితిని తెలియజేస్తోంది. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!