మన నగరాల్లో టెస్లా షోరూంలు!
అమెరికా విద్యుత్ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా, మన దేశంలో షోరూమ్లు (విక్రయ కేంద్రాలు) ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
3,000-5,000 చదరపు అడుగుల స్థలాల అన్వేషణ
భారత్ కోసం కుడిచేతి వైపు స్టీరింగ్ ఉన్న కార్ల తయారీ ప్రారంభం
దిల్లీ: అమెరికా విద్యుత్ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా, మన దేశంలో షోరూమ్లు (విక్రయ కేంద్రాలు) ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముఖ్య నగరాల్లో 3,000-5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో షోరూమ్తో పాటు సర్వీస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు స్థలాన్వేషణలో కంపెనీ ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలోనే మన దేశంలో విక్రయాలు ప్రారంభించాలని టెస్లా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దిల్లీ, ముంబయిలలో విక్రయ కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటికే స్థలాలను పరిశీలించినట్లు సమాచారం. పాశ్చాత్య దేశాల్లో కారు స్టీరింగ్ ఎడమచేతి వైపు ఉంటుంది. జర్మనీలోని ప్లాంట్లో, భారతీయులకు తగ్గట్లుగా కుడి చేతి వైపు స్టీరింగ్ ఉండే కార్లను టెస్లా ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ప్లాంటు ఏర్పాటుకూ సుముఖత చూపుతున్న టెస్లా, అది సిద్ధమయ్యేలోగా జర్మనీ నుంచి కార్లను దిగుమతి చేసుకుని విక్రయించాలనుకుంటోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత నాలుగేళ్లలో తొలిసారిగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో టెస్లా అంతర్జాతీయ వాహన డెలివరీలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మనదేశం సహా కొత్త విపణులకు విస్తరించేందుకు టెస్లా వేగంగా సన్నాహాలు చేసుకుంటోందని సమాచారం.
మనదేశం ఇస్తున్న రాయితీ ఇదీ
విద్యుత్ వాహనాల తయారీ ప్లాంటును కనీసం 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడితో పెట్టేవారికి, కొంతకాలం పాటు వాహనాలను 15% సుంకంపైనే దిగుమతి చేసుకునే అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పించింది. గత జూన్లో న్యూయార్క్లో సంప్రదింపులు జరిపిన ప్రధాని మోదీ-టెస్లా అధిపతి మస్క్,త్వరలోనే దిల్లీలో మరోసారి సమావేశం కానున్నారు. వచ్చే ఆదివారం నుంచి 2 రోజుల పాటు మస్క్ మనదేశంలో పర్యటించనున్నారు.
టాటా ఎలక్ట్రానిక్స్తో ఒప్పందం!
తన అంతర్జాతీయ కార్యకలాపాల కోసం సెమీ కండక్టర్ చిప్లను కొనుగోలు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్తో టెస్లా వ్యూహాత్మక ఒప్పందం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఒప్పంద విలువ, షరతుల వంటివి మస్క్ భారత్ పర్యటన సందర్భంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. మస్క్ భారత్ పర్యటనలో శాట్కామ్ సేవలకు సంబంధించి స్టార్ లింక్ ప్రణాళికలనూ వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
14,000 మందికి ఉద్వాసన?
టెస్లా అంతర్జాతీయంగా 10% మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. గత డిసెంబరు నాటికి టెస్లాలో 1.40 లక్షల మంది పని చేస్తున్నారు. 10 శాతం సిబ్బంది తొలగింపు నిర్ణయంతో సుమారు 14,000 మందిపై ప్రభావం పడనుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఎలాన్ మస్క్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఏయే విభాగాల వారిని తొలగిస్తున్నదీ ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే కొందరు తొలగింపునకు గురయ్యారని, వారికి కంపెనీ సిస్టమ్ యాక్సెస్ నిలిపివేసినట్లు సమాచారం. కొన్ని విభాగాల్లో ఒకేరకమైన బాధ్యతలు చూసే వారు అధికంగా ఉన్నందునే, తొలగింపులు చేయనున్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఇంతకాలం కంపెనీకి సేవలందించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తొలగింపునకు గురైన వారు కొత్త అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగంలో కొనసాగుతున్నవారు సవాళ్లకు సిద్ధమవ్వాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (8)
జియో ఎయిర్ఫైబర్కు రూ.1,000 ఛార్జీ మినహాయింపు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్