మూడో ఆర్థిక వ్యవస్థగా మారినా పేదరికం పోదు
ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు మన దేశం 2029 నాటికి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ, పేద దేశంగానే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు.
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
హైదరాబాద్/ దిల్లీ: ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు మన దేశం 2029 నాటికి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ, పేద దేశంగానే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ..ధనిక దేశంగా మారడం అంటే, అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సిన అవసరం లేదని.. సౌదీ అరేబియాను ఉటంకించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే 2029 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ అంశంపై సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘చాలామంది ఆర్థికవేత్తలు కూడా అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చాలా తొందరగానే మారుతుందని అంచనా వేశారు. నా దృష్టిలోనూ ఇది కష్టం కాదు. ఎందుకంటే ప్రజలు ఉత్పత్తిని పెంచుతారు. మనది 140 కోట్ల జనాభా ఉన్న దేశం కనుక, ఉత్పాదకత-వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థ స్థాయి అంతకంతకూ విస్తరిస్తుంది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినా, పేదరికమూ కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల అది సంబర పడాల్సిన విషయమేమీ కాదు’ అని సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రస్తుతం 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల)తో భారత్ అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని తెలిపారు.
తలసరి ఆదాయం తక్కువే: మన తలసరి ఆదాయం 2,600 డాలర్లు (సుమారు రూ.2.16 లక్షలు)గా ఉంది. ఇది ప్రపంచంలో 139వ స్థానం. బ్రిక్స్, జీ-20 దేశాలతో పోల్చి చూసినా ఇది చాలా తక్కువని దువ్వూరి పేర్కొన్నారు. వృద్ధి రేటును మరింత వేగవంతం చేసి, ఆ ప్రయోజనాలను ప్రజలందరికీ అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రధాని ఆకాంక్షిస్తున్నారని ఈ సందర్భంగా సుబ్బారావు గుర్తు చేశారు. ఇలా మారాలంటే.. చట్టపరమైన పాలన, బలమైన రాష్ట్రాలు, జవాబుదారీతనం, స్వతంత్రత కలిగిన వ్యవస్థలు అవసరం అని పేర్కొన్నారు.
వడ్డీ రేట్ల తగ్గింపునకు అప్పట్లో ఒత్తిడి ఉండేది
‘ఆర్బీఐ గవర్నరుగా నేనున్నప్పుడు.. ప్రణబ్ ముఖర్జీ, పి.చిదంబరం ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. వడ్డీరేట్ల తగ్గింపు కోసం, వృద్ధిరేటు అంచనాలను పెంచడం కోసం.. ఆర్థిక మంత్రిత్వ శాఖ తరచూ ఆర్బీఐపై ఒత్తిడి తెచ్చేది. సెంటిమెంటును మెరుగు పరచేందుకు ఇలా చేయాలని కోరేవార’ని తన పుస్తకంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తికి ఉన్న ప్రాధాన్యతను ప్రభుత్వం కొంత మేరే అర్థం చేసుకుందని ‘జస్ట్ ఏ మెర్సినరీ?: నోట్స్ ఫ్రం మై లైఫ్ అండ్ కెరియర్’ పుస్తకంలో సుబ్బారావు గుర్తు చేసుకున్నారు. 2008 సెప్టెంబరు 16న అమెరికా ఆర్థిక సేవల సంస్థ లేమాన్ బ్రదర్స్ దివాలా ప్రభావంతో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దీనికి కొద్ది రోజుల ముందు అంటే 2008 సెప్టెంబరు 5న ఆర్బీఐ గవర్నర్గా తాను బాధ్యతలు స్వీకరించానని, ప్రారంభంలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నట్లు సుబ్బారావు వివరించారు.
ప్రభుత్వానికి చీర్లీడర్గా ఆర్బీఐ?: వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు ఇంకా పలు అంశాల్లోనూ ప్రభుత్వం ఆర్బీఐపై ఒత్తిడి తెచ్చిందని ‘రిజర్వ్ బ్యాంక్ యాజ్ ద గవర్న్మెంట్స్ చీర్లీడర్?’ అనే అధ్యాయంలో దువ్వూరి వివరించారు. ‘ఓ సందర్భం నాకు గుర్తుంది. అప్పుడు ప్రణబ్ ఆర్థిక మంత్రిగా, అరవింద్ మాయారామ్ ఆర్థిక కార్యదర్శిగా, కౌశిక్ బసు ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. తమ అంచనాలకు అనుగుణంగా ఆర్బీఐ అంచనాలను మార్చుకోమని వారు సూచించారు. అధిక వృద్ధి అంచనాలను, తక్కువ ద్రవ్యోల్బణ రేటును ఆర్బీఐ కచ్చితంగా ప్రకటించాలనేంత వరకూ వారి సలహాలు వెళ్లాయి. తద్వారా మార్కెట్ సెంటిమెంటును పెంచి, ప్రభుత్వంతో తమ బాధ్యతను పంచుకోవాలని సూచించడం నన్ను వ్యాకులతకు గురి చేసింది. ఒక సమావేశంలో మాయారామ్ అయితే ప్రపంచంలో అంతటా.. ప్రభుత్వాలకు కేంద్ర బ్యాంకులు సహకరిస్తుంటాయని, మన ఆర్బీఐ మాత్రం తిరుగుబాటు ధోరణిలో ఉంటుంద’ని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వానికి ఆర్బీఐ ఒక చీర్లీడర్లా వ్యవహరించాలనడం నన్ను అశాంతికి గురి చేసింది. అయినా కూడా ఆర్బీఐ తన అత్యుత్తమ విధానాలకు దూరంగా వెళ్లలేద’ని సుబ్బారావు విశదీకరించారు.
చిదంబరం మాటను తిరస్కరించా: ‘2012లో చిదంబరం హోం శాఖ నుంచి ఆర్థిక శాఖకు తిరిగి వచ్చినపుడు.. పరపతి విధానాన్ని సరళతరం చేయాలని సూచించారు. ఆయన వాదనను నేను అంగీకరించలేద’ని దువ్వూరి తెలిపారు. ‘ఆయన ఆ సమయంలో ఆర్బీఐ ధోరణిపై బలంగా తన వాణిని వినిపించారు. వృద్ధి విషయంలో ప్రభుత్వం ఒంటరిగా నడవాలని మీరు అనుకుంటే అలానే చేస్తామ’ని అన్నారని గుర్తు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం