ఆరోగ్య బీమాకు వయోపరిమితి రద్దు
ఆరోగ్య బీమా రంగంలో విప్లవాత్మక మార్పులకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ శ్రీకారం చుట్టింది. ఆరోగ్య బీమా పాలసీ కొత్తగా కొనుగోలు చేసేందుకు, ఇప్పటివరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని రద్దు చేసింది.
ఇప్పటివరకు 65 ఏళ్ల వరకే
దిల్లీ: ఆరోగ్య బీమా రంగంలో విప్లవాత్మక మార్పులకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ శ్రీకారం చుట్టింది. ఆరోగ్య బీమా పాలసీ కొత్తగా కొనుగోలు చేసేందుకు, ఇప్పటివరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని రద్దు చేసింది. దీంతో ఇకపై ఏ వయసువారైనా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ఐఆర్డీఏఐ గెజెట్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ నిర్ణయంతో ఆరోగ్యసంరక్షణ వ్యయాల నుంచి పాలసీదార్లకు రక్షణ లభిస్తుందని, బీమా మార్కెట్ విస్తరిస్తుందని ఐఆర్డీఏఐ భావిస్తోంది. ‘అన్ని వయసుల వారికి ఆరోగ్య బీమా పాలసీలను కంపెనీలు తీసుకురావాలి. వయోవృద్ధులు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణీలు, ఇతర వర్గాల వారి కోసం ప్రత్యేకంగా బీమా పాలసీలను రూపొందించాలి’ అని ఐఆర్డీఏఐ ఇటీవలి గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది.
- ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారికీ, ఆరోగ్య బీమా పాలసీలను అందించాలని సంస్థలను ఆదేశించింది. క్యాన్సర్, గుండె జబ్బు, ఎయిడ్స్ వంటి క్లిష్టతరమైన వ్యాధులతో బాధపడుతున్నారంటూ, ఆరోగ్య బీమా పాలసీలను నిరాకరించడం ఇక కంపెనీలకు కుదరదు.
- పాలసీదార్ల సౌకర్యార్థం బీమా ప్రీమియం మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించేందుకు కంపెనీలు అనుమతి ఇవ్వొచ్చు. ప్రయాణ పాలసీలను సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు మాత్రమే అందించాలి.
- ఆయుష్ చికిత్స కవరేజీకి పరిమితి లేదు. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధా, హోమియోపతి వంటి చికిత్సలకు కూడా బీమా మొత్తం లభిస్తుంది.
- ప్రయోజన ఆధారిత పాలసీలు కలిగిన పాలసీదార్లు పలు సంస్థల వద్ద క్లెయిమ్లు దాఖలు చేసుకోవచ్చు. వయోవృద్ధుల క్లెయిమ్లు, ఫిర్యాదులను ప్రత్యేక వ్యవస్థ ద్వారా పరిష్కరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!