సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది.
ఫోక్స్వ్యాగన్ టైగన్లో కొత్త వేరియంట్లు
చెన్నై: ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. 1 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ కలిగిన టైగన్ జీటీ లైన్ ధర రూ.14.08 లక్షలు, 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ కలిగిన టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ ధర రూ.18.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
హైదరాబాద్లో హిటాచీ ఎనర్జీ జీసీసీ!
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లతో పాటు ఇతర హై వోల్టోజ్ పరికరాలు, సాంకేతిక సేవలను అందించే హిటాచీ ఎనర్జీ.. హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ (జీసీసీ) నెలకొల్పే యోచనలో ఉంది. పుణె నగరాన్నీ ఇందుకోసం పరిశీలిస్తున్నామని హిటాచీ ఎనర్జీ ఇండియా, దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నూగూరి వేణు తెలిపారు. సంస్థ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో సంస్థ విస్తరణ కోసం ఏటా రూ.100 కోట్ల మేరకు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 19 ఫ్యాక్టరీలున్నాయని తెలిపారు. వరంగల్ ఎన్ఐటీతో కలిసి అక్కడ ఒక సస్టైనబిలిటీ ఎనర్జీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా తమకు 7,000 మంది ఉద్యోగులున్నారని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,483 కోట్ల ఆదాయాన్ని, రూ.93.90 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తెలిపారు.
పీఓఎస్, క్యూఆర్ కోడ్, స్పీకర్ అన్నీ ఒకదాంట్లోనే
భారత్పే నుంచి ఆల్-ఇన్-వన్ పేమెంట్ డివైజ్
దిల్లీ: దేశీయ ఫిన్టెక్ సంస్థ భారత్పే, ఆల్-ఇన్-ఒన్ చెల్లింపు ఉత్పత్తి అయిన ‘భారత్పే వన్’ను మంగళవారం ఆవిష్కరించింది. దీని ప్రత్యేకత ఏమిటంటే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), క్యూఆర్ కోడ్, స్పీకర్.. అన్నీ ఒకే పరికరంలో ఉంటాయి. తొలి దశలో దాదాపు 100 నగరాల్లో దీనిని తీసుకువచ్చి, 6 నెలల్లో 450 నగరాలకు విస్తరించాలన్నది సంస్థ ప్రణాళిక. ‘హైడెఫినిషన్ టచ్స్క్రీన్ డిస్ప్లే, 4జీ, వైఫై కనెక్టివిటీ, తాజా ఆండ్రాయిడ్ ఓఎస్తో భారత్పే వన్ అత్యున్నత భద్రత, పనితీరును కనబరచగలద’ని సంస్థ పేర్కొంది. ఆఫ్లైన్ వ్యాపారులకు పలు అవసరాలను ఇది తీరుస్తుందని తెలిపింది. డైనమిక్, స్టాటిక్ క్యూఆర్ కోడ్, ట్యాప్ అండ్ పే, డెబిడ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు.. ఇలా పలు ఆప్షన్లలో చెల్లింపులను స్వీకరించేలా దీనిని డిజైన్ చేశారు. ‘చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు పలు అవసరాలు తీర్చేలా విస్తృత పరిష్కారాన్ని తక్కువ ఖర్చుతో ఈ డివైజ్ ద్వారా అందిస్తున్న’ట్లు భారత్పే సీఈఓ నలిన్ నేగి పేర్కొన్నారు.
మళ్లీ పూర్తి సామర్థ్యానికి దుబాయ్ విమానాశ్రయం
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు మళ్లీ పూర్తి సామర్థ్యానికి చేరుకున్నాయని సీఈఓ గ్రిఫిత్స్ ప్రకటించారు. ఇటీవలి కుంభవృష్టి ఫలితంగా ఏర్పడిన భారీ వరదలతో ఈ విమానాశ్రయ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడింది. గత 75 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం నమోదు కాగా, రన్వే నీట మునిగింది. దీంతో వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం నుంచి విమానాశ్రయం సాధారణ స్థితికి వచ్చిందని, రోజుకు దాదాపు 1400 విమాన సర్వీసులు నిర్వహిస్తున్నామని గ్రిఫిత్స్ తెలిపారు.
సెకనుకు 10,000 లావాదేవీలు!
రాజోర్పే నుంచి యూపీఐ స్విచ్
దిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఫిన్టెక్ కంపెనీ రాజోర్పే సొంత యూపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ‘యూపీఐ స్విచ్’ని ఆవిష్కరించింది. ఇది క్లౌడ్ ఆధారిత ఇన్నోవేషన్ అని, దీంతో లావాదేవీలు సులువుగా, వేగంగా జరుగుతాయని తెలిపింది. లావాదేవీ సంపూర్తిగా చేసే రేటు 4-5% మెరుగుపడుతుందని.. ఎప్పుడైనా సెకనుకు 10,000 లావాదేవీలను హ్యాండిల్ చేసేలా డిజైన్ చేసినట్లు వివరించింది. వ్యాపారులకు ఉద్దేశించిన యూపీఐ ఇన్నోవేషన్స్తో పోలిస్తే యూపీఐ స్విచ్ 5 రెట్లు వేగవంతమైనదని రాజోర్పే పేమెంట్స్ విభాగాధిపతి ఖిలన్ హరియా అన్నారు. రాజోర్పేతో మా భాగస్వామ్యం వ్యాపార చెల్లింపుల్లో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పగలదని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఓఓ గణేశ్ అనంతనారాయణన్ పేర్కొన్నారు.
80% పెరిగిన సైయెంట్ డీఎల్ఎం లాభం
ఈనాడు, హైదరాబాద్: సైయెంట్ డీఎల్ఎం, గత ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. త్రైమాసిక ఆదాయం 30.5% పెరిగి రూ.362 కోట్లకు, నికరలాభం 80.7% వృద్ధితో రూ.22.7 కోట్లకు చేరాయి. 2023-24 పూర్తికాలానికి ఆదాయం రూ.1,192 కోట్లు, నికరలాభం రూ.61.2 కోట్లుగా ఉన్నాయి. 2022-23తో పోల్చితే ఆదాయం 43.2%, నికరలాభం 92.9% పెరిగాయి. ఏరోస్పేస్, రక్షణ విభాగాల్లో లభించిన పెద్ద ఆర్డర్లతో ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేయగలిగినట్లు సైయెంట్ డీఎల్ఎం సీఈఓ ఆంథోనీ మాంటాల్బనో వివరించారు. వచ్చే రెండేళ్ల పాటు ఇదేవిధంగా అధిక వృద్ధి బాటలో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
30 నుంచి స్టెల్లాంటిస్ వాహన ధరలు పెంపు
దిల్లీ: సిట్రోయెన్ బ్రాండ్పై విక్రయిస్తున్న వాహన ధరలను ఈ నెల 30 నుంచి పెంచబోతున్నట్లు స్టెల్లాంటిస్ ఇండియా మంగళవారం వెల్లడించింది. జీప్ బ్రాండ్పై అమ్ముతున్న కంపాస్, మెరిడియన్ మోడళ్ల ధరలను 0.5% పెంచుతున్నట్లు పేర్కొంది. ముడి పదార్థాలు, కార్యకలాపాల వ్యయాలు పెరిగినందునే, వాహన ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపింది. వివిధ మోడళ్లపై రూ.4,000-17,000 వరకు ధరల పెంపు ఉంటుందని వివరించింది. సిట్రోయెన్ బ్రాండ్పై వస్తున్న కాంపాక్ట్ కార్ సి3, ఎస్యూవీలు సి3 ఎయిర్క్రాస్, సి5 ఎయిర్క్రాస్, విద్యుత్ కారు ఇ-సి3ల ధరలు రూ.6.16-37.67 లక్షల మధ్య ఉన్నాయి. జీప్ కంపాస్లు రూ.20.69-26.19 లక్షల మధ్య, జీప్ మెరీడియన్ ధరలు రూ.33.6-36.97 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
26% తగ్గిన ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లాభం
దిల్లీ: మార్చి త్రైమాసికంలో ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం రూ.174 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.235 కోట్లతో పోలిస్తే 26% తక్కువ. ఇదే సమయంలో మొత్తం నికర ప్రీమియం ఆదాయం రూ.12,629 కోట్ల నుంచి 17% వృద్ధి చెంది రూ.14,788 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.2320 కోట్ల నుంచి 10% అధికమై రూ.2,550 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ.811 కోట్ల నుంచి 5% పెరిగి రూ.852 కోట్లకు చేరింది. కంపెనీ ఒక్కో షేరుపై రూ.0.60 డివిడెండ్ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!