సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది.
ఫోక్స్వ్యాగన్ టైగన్లో కొత్త వేరియంట్లు
చెన్నై: ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. 1 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ కలిగిన టైగన్ జీటీ లైన్ ధర రూ.14.08 లక్షలు, 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ కలిగిన టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ ధర రూ.18.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
హైదరాబాద్లో హిటాచీ ఎనర్జీ జీసీసీ!
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లతో పాటు ఇతర హై వోల్టోజ్ పరికరాలు, సాంకేతిక సేవలను అందించే హిటాచీ ఎనర్జీ.. హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ (జీసీసీ) నెలకొల్పే యోచనలో ఉంది. పుణె నగరాన్నీ ఇందుకోసం పరిశీలిస్తున్నామని హిటాచీ ఎనర్జీ ఇండియా, దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నూగూరి వేణు తెలిపారు. సంస్థ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో సంస్థ విస్తరణ కోసం ఏటా రూ.100 కోట్ల మేరకు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 19 ఫ్యాక్టరీలున్నాయని తెలిపారు. వరంగల్ ఎన్ఐటీతో కలిసి అక్కడ ఒక సస్టైనబిలిటీ ఎనర్జీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా తమకు 7,000 మంది ఉద్యోగులున్నారని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,483 కోట్ల ఆదాయాన్ని, రూ.93.90 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తెలిపారు.
పీఓఎస్, క్యూఆర్ కోడ్, స్పీకర్ అన్నీ ఒకదాంట్లోనే
భారత్పే నుంచి ఆల్-ఇన్-వన్ పేమెంట్ డివైజ్
దిల్లీ: దేశీయ ఫిన్టెక్ సంస్థ భారత్పే, ఆల్-ఇన్-ఒన్ చెల్లింపు ఉత్పత్తి అయిన ‘భారత్పే వన్’ను మంగళవారం ఆవిష్కరించింది. దీని ప్రత్యేకత ఏమిటంటే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), క్యూఆర్ కోడ్, స్పీకర్.. అన్నీ ఒకే పరికరంలో ఉంటాయి. తొలి దశలో దాదాపు 100 నగరాల్లో దీనిని తీసుకువచ్చి, 6 నెలల్లో 450 నగరాలకు విస్తరించాలన్నది సంస్థ ప్రణాళిక. ‘హైడెఫినిషన్ టచ్స్క్రీన్ డిస్ప్లే, 4జీ, వైఫై కనెక్టివిటీ, తాజా ఆండ్రాయిడ్ ఓఎస్తో భారత్పే వన్ అత్యున్నత భద్రత, పనితీరును కనబరచగలద’ని సంస్థ పేర్కొంది. ఆఫ్లైన్ వ్యాపారులకు పలు అవసరాలను ఇది తీరుస్తుందని తెలిపింది. డైనమిక్, స్టాటిక్ క్యూఆర్ కోడ్, ట్యాప్ అండ్ పే, డెబిడ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు.. ఇలా పలు ఆప్షన్లలో చెల్లింపులను స్వీకరించేలా దీనిని డిజైన్ చేశారు. ‘చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు పలు అవసరాలు తీర్చేలా విస్తృత పరిష్కారాన్ని తక్కువ ఖర్చుతో ఈ డివైజ్ ద్వారా అందిస్తున్న’ట్లు భారత్పే సీఈఓ నలిన్ నేగి పేర్కొన్నారు.
మళ్లీ పూర్తి సామర్థ్యానికి దుబాయ్ విమానాశ్రయం
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు మళ్లీ పూర్తి సామర్థ్యానికి చేరుకున్నాయని సీఈఓ గ్రిఫిత్స్ ప్రకటించారు. ఇటీవలి కుంభవృష్టి ఫలితంగా ఏర్పడిన భారీ వరదలతో ఈ విమానాశ్రయ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడింది. గత 75 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం నమోదు కాగా, రన్వే నీట మునిగింది. దీంతో వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం నుంచి విమానాశ్రయం సాధారణ స్థితికి వచ్చిందని, రోజుకు దాదాపు 1400 విమాన సర్వీసులు నిర్వహిస్తున్నామని గ్రిఫిత్స్ తెలిపారు.
సెకనుకు 10,000 లావాదేవీలు!
రాజోర్పే నుంచి యూపీఐ స్విచ్
దిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఫిన్టెక్ కంపెనీ రాజోర్పే సొంత యూపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ‘యూపీఐ స్విచ్’ని ఆవిష్కరించింది. ఇది క్లౌడ్ ఆధారిత ఇన్నోవేషన్ అని, దీంతో లావాదేవీలు సులువుగా, వేగంగా జరుగుతాయని తెలిపింది. లావాదేవీ సంపూర్తిగా చేసే రేటు 4-5% మెరుగుపడుతుందని.. ఎప్పుడైనా సెకనుకు 10,000 లావాదేవీలను హ్యాండిల్ చేసేలా డిజైన్ చేసినట్లు వివరించింది. వ్యాపారులకు ఉద్దేశించిన యూపీఐ ఇన్నోవేషన్స్తో పోలిస్తే యూపీఐ స్విచ్ 5 రెట్లు వేగవంతమైనదని రాజోర్పే పేమెంట్స్ విభాగాధిపతి ఖిలన్ హరియా అన్నారు. రాజోర్పేతో మా భాగస్వామ్యం వ్యాపార చెల్లింపుల్లో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పగలదని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఓఓ గణేశ్ అనంతనారాయణన్ పేర్కొన్నారు.
80% పెరిగిన సైయెంట్ డీఎల్ఎం లాభం
ఈనాడు, హైదరాబాద్: సైయెంట్ డీఎల్ఎం, గత ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. త్రైమాసిక ఆదాయం 30.5% పెరిగి రూ.362 కోట్లకు, నికరలాభం 80.7% వృద్ధితో రూ.22.7 కోట్లకు చేరాయి. 2023-24 పూర్తికాలానికి ఆదాయం రూ.1,192 కోట్లు, నికరలాభం రూ.61.2 కోట్లుగా ఉన్నాయి. 2022-23తో పోల్చితే ఆదాయం 43.2%, నికరలాభం 92.9% పెరిగాయి. ఏరోస్పేస్, రక్షణ విభాగాల్లో లభించిన పెద్ద ఆర్డర్లతో ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేయగలిగినట్లు సైయెంట్ డీఎల్ఎం సీఈఓ ఆంథోనీ మాంటాల్బనో వివరించారు. వచ్చే రెండేళ్ల పాటు ఇదేవిధంగా అధిక వృద్ధి బాటలో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
30 నుంచి స్టెల్లాంటిస్ వాహన ధరలు పెంపు
దిల్లీ: సిట్రోయెన్ బ్రాండ్పై విక్రయిస్తున్న వాహన ధరలను ఈ నెల 30 నుంచి పెంచబోతున్నట్లు స్టెల్లాంటిస్ ఇండియా మంగళవారం వెల్లడించింది. జీప్ బ్రాండ్పై అమ్ముతున్న కంపాస్, మెరిడియన్ మోడళ్ల ధరలను 0.5% పెంచుతున్నట్లు పేర్కొంది. ముడి పదార్థాలు, కార్యకలాపాల వ్యయాలు పెరిగినందునే, వాహన ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపింది. వివిధ మోడళ్లపై రూ.4,000-17,000 వరకు ధరల పెంపు ఉంటుందని వివరించింది. సిట్రోయెన్ బ్రాండ్పై వస్తున్న కాంపాక్ట్ కార్ సి3, ఎస్యూవీలు సి3 ఎయిర్క్రాస్, సి5 ఎయిర్క్రాస్, విద్యుత్ కారు ఇ-సి3ల ధరలు రూ.6.16-37.67 లక్షల మధ్య ఉన్నాయి. జీప్ కంపాస్లు రూ.20.69-26.19 లక్షల మధ్య, జీప్ మెరీడియన్ ధరలు రూ.33.6-36.97 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
26% తగ్గిన ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లాభం
దిల్లీ: మార్చి త్రైమాసికంలో ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం రూ.174 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.235 కోట్లతో పోలిస్తే 26% తక్కువ. ఇదే సమయంలో మొత్తం నికర ప్రీమియం ఆదాయం రూ.12,629 కోట్ల నుంచి 17% వృద్ధి చెంది రూ.14,788 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.2320 కోట్ల నుంచి 10% అధికమై రూ.2,550 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ.811 కోట్ల నుంచి 5% పెరిగి రూ.852 కోట్లకు చేరింది. కంపెనీ ఒక్కో షేరుపై రూ.0.60 డివిడెండ్ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది. -
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
Play Store: ప్లే స్టోర్లో ప్రభుత్వ యాప్లను పోలిన ఫేక్ యాప్స్కు చెక్ పెట్టేందుకు గూగుల్ లేబుల్స్ తీసుకురానుంది. -
యూఎస్లో యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ను లాంచ్ చేసిన రెడ్డీస్
డాక్టర్ రెడ్డీస్ అమెరికాలో జెనరిక్ యాంటీ బాక్టీరియల్ ఔషధాన్ని విడుదల చేసింది. -
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
Naresh Goyal: క్యాన్సర్తో పోరాడుతున్న తన భార్య జీవిత చరమాంకంలో ఉందని, ఆమె పక్కన ఉండేందుకు మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలని జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కోర్టును కోరారు. -
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 732 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
Bajaj Pulsar NS400Z: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్400Z పేరుతో మరో కొత్త పల్సర్ను లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
Noise Pop Buds: నాయిస్ మరో ట్రూవైర్లెస్ ఇయర్ఫోన్స్ను భారత్లో విడుదల చేసింది. క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. -
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 453 పాయింట్ల లాభంతో 75,064 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 135 పాయింట్లు పుంజుకొని 22,783 దగ్గర కొనసాగుతోంది. -
కోఫోర్జ్ చేతికి సిగ్నిటీ టెక్నాలజీస్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ను, దేశీయ ఐటీ రంగ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన కోఫోర్జ్ లిమిటెడ్ (గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్) సొంతం చేసుకోనుంది. -
పన్ను రాయితీలను ‘ఊహాజనిత నష్టం’గా ఎలా పరిగణిస్తారు?
ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలను, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) ‘ఊహాజనిత నష్టం’ గా ఎలా నిర్ణయిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు. -
మన ఎలక్ట్రానిక్స్లో చైనా, హాంకాంగ్ నుంచే 56%
గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులు 89.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.45 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
సేవల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయ్
మన దేశం నుంచి సేవల ఎగుమతులు, ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 1.3% తగ్గి 30 బిలియన్ డాలర్ల (సుమరు రూ.2.5 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ గురువారం తెలిపింది. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
నష్టాల నుంచి లాభాల్లోకి
ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవ్వడం, సానుకూల తయారీ గణాంకాల మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్ను బలోపేతం చేశాయి. -
రాణించిన డాబర్ ఇండియా
డాబర్ ఇండియా, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.341.22 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.292.76 కోట్ల కంటే ఇది 16.55% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.2,677.80 కోట్ల నుంచి 5.11% పెరిగి రూ.2,814.6 4 కోట్లకు చేరింది. -
బియ్యం, డెయిరీ ఉత్పత్తులపైనా నిఘా
దేశీయ మార్కెట్లో విక్రయమయ్యే పోషక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్), డెయిరీ ఉత్పత్తులు, మసాలాలపై నిఘా పెట్టాలని ఆహార నియంత్రణాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ భావిస్తోంది. -
‘కొవాగ్జిన్’ ఆవిష్కరణలో భద్రతకే పెద్దపీట
టీకా తీసుకున్న ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ‘కొవాగ్జిన్’ టీకాను రూపొందించినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ గురువారం వెల్లడించింది. ‘ఏదైనా టీకా ప్రభావం కొంతకాలమే ఉండొచ్చు, కానీ రోగుల భద్రత ఎంతో ముఖ్యం. -
కోల్ ఇండియా లాభంలో 26% వృద్ధి
కోల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.8,682.20 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.6,875.07 కోట్ల కంటే ఇది 26.2% అధికం. -
37% తగ్గిన అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం
అదానీ ఎంటర్ప్రైజెస్, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.450.58 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.722.48 కోట్లతో పోలిస్తే ఇది 37% తక్కువ. -
జీఎస్టీ నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం
రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీ ఉన్నతాధికారుల 3వ జాతీయ సమన్వయ సమావేశం శుక్రవారం జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM