సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి.
దొడ్ల డెయిరీకి పెరిగిన లాభం
ఈనాడు, హైదరాబాద్: దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఈ సంస్థ రూ.3,125.5 కోట్ల ఆదాయం, రూ.166.7 కోట్ల నికర లాభం ఆర్జించింది. వార్షిక ఈపీఎస్ రూ.27.75 ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఆదాయం 11.1 శాతం, నికర లాభం 36.4 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 కోట్ల ఆదాయాల స్థాయిని అధిగమించటాన్ని గొప్ప మైలురాయిగా భావిస్తున్నట్లు దొడ్ల డెయిరీ ఎండీ సునీల్రెడ్డి పేర్కొన్నారు. పాల సేకరణ, విలువ ఆధారిత ఉత్పత్తులు, పంపిణీ కార్యకలాపాలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు, దీనివల్ల లాభాలు పెరిగినట్లు వివరించారు.
విమ్టా ల్యాబ్స్ లాభం రూ.12.4 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: కాంట్రాక్టు పరిశోధన, టెస్టింగ్ సేవలు అందించే విమ్టా ల్యాబ్స్ కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం జనవరి- మార్చి త్రైమాసికానికి రూ.80.2 కోట్ల ఆదాయాన్ని, రూ.12.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.82.5 కోట్లు, నికర లాభం రూ.12.7 కోట్లు ఉన్నాయి. దీంతో పోలిస్తే ప్రస్తుతం ఆదాయాలు, లాభాలు స్వల్పంగా తగ్గాయి. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి విమ్టా ల్యాబ్స్ ఆదాయం రూ.322.3 కోట్లు కాగా, దీనిపై రూ.41 కోట్ల నికరలాభం నమోదైంది. వార్షిక ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, నికరలాభం 14.9% క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం చివర్లో తమ వ్యాపార కార్యకలాపాలు ఆకర్షణీయంగా సాగినట్లు, అంతకు ముందు ఎదురైన ఇబ్బందులను తట్టుకొని నిలిచినట్లు సంస్థ ఎండీ హరిత వాసిరెడ్డి వివరించారు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో ఐడీఎఫ్సీ విలీనం
ఆమోదించిన వాటాదార్లు
దిల్లీ: ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ విలీనానికి వాటాదార్ల ఆమోదం లభించింది. షేర్ హోల్డర్లు, నాన్-కన్వర్ట్బుల్ డిబెంచర్ (ఎన్సీడీ) హోల్డర్లు దీనికి అంగీకారం తెలిపారు. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఈ నెల 17న వాటాదార్లు, ఎన్సీడీ హోల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఇందులో విలీన తీర్మానానికి అనుకూలంగా 99.95% ఓట్లు లభించాయి. విలీన ప్రతిపాదన ప్రకారం మందుగా ఐడీఎఫ్సీలో ఐడీఎఫ్సీ ఎఫ్హెచ్సీఎల్; ఆ తర్వాత ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో ఐడీఎఫ్సీ విలీనం అవుతాయి. ఈ విలీనం వల్ల ఐడీఎఫ్సీ వాటాదార్లకు ప్రతి 100 షేర్లకు, 155 ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు కేటాయిస్తారు. ఐసీఐసీఐ బ్యాంకులో ఐసీఐసీఐ విలీనమైనట్లుగానే ఇప్పుడు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో ఐడీఎఫ్సీ విలీనం అవుతుంది. తద్వారా ఒక పెద్ద ఆర్థిక సేవల సంస్థగా ఎదిగే అవకాశం దీనికి కనిపిస్తోంది.
ఎంత పెద్ద ప్రయాణమైనా సున్నా నుంచే మొదలు
అది 1969. ఆడ్రియన్ డాల్సీ, ల్యారీ హిల్బ్లోమ్, రాబర్ట్ లిన్ అనే ముగ్గురు యువకులు ఓ చిన్న కొరియర్ సంస్థను ప్రారంభించారు. తమ ఇంటి పేర్లలోని తొలి అక్షరాలను కలిపి ‘డీహెచ్ఎల్’ అని పేరుపెట్టారు. ఓ డొక్కు కారును నడుపుకొంటూ వెళ్తూ ఇంటింటికీ పార్సిళ్లు చేరవేసేవారు. కాలచక్రంలో 55 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ‘డీహెచ్ఎల్’ 250 సొంత విమానాలు, 32 వేల వాహనాలతో ప్రపంచం నలుమూలలా కొరియర్ సేవలు అందిస్తోంది.
ఆ సంస్థలో 5.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2019 నాటికే దాని ఆదాయం రూ.6 లక్షల కోట్లు దాటింది! మీరున్న చోటునుంచే, మీకున్న వనరులతోనే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఎన్ని అవాంతరాలెదురైనా ఆగిపోవద్దు. అంతా సున్నా నుంచే మొదలవుతుంది.
ఇన్స్టాగ్రామ్లో ఆండ్రూ ఒనొజా, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (8)
జియో ఎయిర్ఫైబర్కు రూ.1,000 ఛార్జీ మినహాయింపు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది.