సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు.
బైజూస్ సలహామండలికి రజనీశ్, మోహన్దాస్ దూరం!
బెంగళూరు: ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు. కంపెనీతో వీరిద్దరి ఒప్పందం గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగియనుండగా, దీన్ని పొడిగించరాదని సంయుక్తంగా నిర్ణయించినట్లు వారు తెలిపారు.
‘బైజూస్ బ్రాండ్పై ఎడ్టెక్ సేవలు అందిస్తున్న థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎల్పీఎల్)తో మా ఒప్పందం ఏడాది కాలపరిమితికి చేసుకున్నాం. అది పూర్తయ్యాక, ఒప్పందాన్ని పొడిగించొద్దని కంపెనీతో పాటు మేము సంయుక్తంగా నిర్ణయించాం. అధికారికంగా ఒప్పందం లేకున్నా, ఆ కంపెనీ వ్యవస్థాపకులు ఎప్పుడైనా మమ్మల్ని సలహా కోసం సంప్రదించొచ్చు. కంపెనీకి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం’ అని కుమార్, పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లిష్ట సమయాల్లో రజనీశ్, పాయ్ల సేవలు తమకు ఎంతో ఉపకరించాయని కంపెనీ ప్రశంసించింది.
సీఐఐ అధ్యక్షుడిగా సంజీవ్పురి
దిల్లీ: భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ అధ్యక్షుడిగా ఐటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పురి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2024-25 సంవత్సరానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇప్పటివరకు సీఐఐ అధ్యక్షుడిగా ఉన్న టీవీఎస్ సప్లై చైన్ ఛైర్మన్ ఆర్.దినేశ్ నుంచి సంజీవ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రెసిడెంట్ డెజిగ్నేట్గా ఈవై (ఎర్నెస్ట్ అండ్ యంగ్) ఇండియా ప్రాంత ఛైర్మన్ రాజీవ్ మేమాని బాధ్యతలు చేపట్టారు. సీఐఐ జాతీయ ఉపాధ్యక్షుడిగా టాటా కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆర్.ముకుందన్ వ్యవహరిస్తారు. ఆయన టాటా గ్రూప్లో 33 ఏళ్లుగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
Ghazal Alagh: తరచూ ఆసక్తి రేకెత్తించే పోస్టులు చేస్తుంటారు మామా ఎర్త్ సహ-వ్యవస్థాపకురాలు గజల్ అలఘ్. స్టార్టప్ల వల్ల తాను నేర్చుకున్న పాఠాలను తాజాగా ‘‘ఎక్స్’’ వేదికగా పంచుకున్నారు. -
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి
Gautam Adani: కొంతకాలంగా అదానీ కంపెనీల షేర్లు రాణించాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద గణనీయంగా పుంజుకుంది. ఫలితంగా అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. -
ర్యానిటిడిన్ వినియోగంపై ఏదీ స్పష్టత?
ఛాతీలో మంట, కడుపులో గ్యాస్, అల్సర్ల నివారణకు వినియోగించే మందుల్లో ర్యానిటిడిన్ హెచ్సీఎల్ ఒకటి. ఈ మాత్ర ధర తక్కువే. ఓటీసీ (ఓవర్ ద కౌంటర్) అమ్మకాలు అధికం. -
ఉద్యోగార్థులూ.. మేమున్నాం
ఒకవైపు అంతర్జాతీయ సంస్థలు, టెక్ దిగ్గజాలు ఉద్యోగులను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు అంకురాలు కొత్త వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. -
మేలో నెమ్మదించిన వాహన విక్రయాలు
దేశంలో ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు మే నెలలో నెమ్మదించాయి. అధిక ప్రాతిపదిక(హై బేస్), సార్వత్రిక ఎన్నికల ప్రభావం అమ్మకాలపై పడటంతో స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి. -
2024-25లో పంచదార ఉత్పత్తి 30 మి.టన్నులే!
ఈ ఏడాది అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే 2024-25 సీజన్లో, దేశీయంగా పంచదార ఉత్పత్తి 30 మిలియన్ టన్నులకే పరిమితం కావొచ్చని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
సంస్థల్లో లింగ సమానత్వం!
దేశంలో చాలా సంస్థలు లింగ సమానత్వాన్ని, వైవిధ్యాన్ని ప్రోత్సహించడం కోసం ప్రగతిశీల విధానాలు, నైపుణ్యాభివృద్ధి, ఫ్లెక్సిబిలిటీ వంటి చురుకైన చర్యలు తీసుకుంటున్నాయని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా నివేదిక వెల్లడించింది. -
49% తగ్గిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 8.74 శాతం తగ్గి 7.37 బి.డాలర్లు (దాదాపు రూ.61,000 కోట్లు)కు పరిమితమైనట్లు వాణిజ్య శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. -
మాస్చిప్ టెక్నాలజీస్కు రూ.509.37 కోట్ల కాంట్రాక్టు
మాస్చిప్ టెక్నాలజీస్కు అతిపెద్ద సెమీకండక్టర్ కాంట్రాక్టు లభించింది. -
రూ.72 తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండరు ధరను ఈ నెల 1 నుంచి రూ.72 మేర తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. -
మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు
దేశ స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో రూ.1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. -
మారుతీ డ్రీమ్ సిరీస్ మోడళ్లు వస్తున్నాయ్
చిన్న కార్ల విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఆల్టో కే10, ఎస్ప్రెసో, సెలెరియోల్లో పరిమిత శ్రేణి ్బలిమిటెడ్ ఎడిషన్శ్ రకం మోడళ్లను విడుదల చేసేందుకు మారుతీ సుజుకీ సిద్ధమైంది. -
సంక్షిప్త వార్తలు (4)
భారత సైన్యంలోని నార్తర్న్ కమాండ్ నుంచి రూ.4.26 కోట్ల విలువైన ఆర్డరు లభించిందని లోకేష్ మెషిన్స్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్
-
ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్