అయిదో రోజూ నిఫ్టీ జోరు
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించడంతో వరుసగా అయిదో రోజూ నిఫ్టీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 267 పాయింట్లు పెరిగింది. ఎఫ్ఎమ్సీజీ, స్థిరాస్తి షేర్లు పరుగులు తీయగా, బ్యాంకింగ్, లోహ స్క్రిప్లు డీలాపడ్డాయి.
సమీక్ష
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించడంతో వరుసగా అయిదో రోజూ నిఫ్టీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 267 పాయింట్లు పెరిగింది. ఎఫ్ఎమ్సీజీ, స్థిరాస్తి షేర్లు పరుగులు తీయగా, బ్యాంకింగ్, లోహ స్క్రిప్లు డీలాపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 2 పైసలు పెరిగి 83.29 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.84% నష్టంతో 82.18 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై మినహా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు నీరసంగా ట్రేడయ్యాయి.
- మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ తొలిసారిగా 5 లక్షల కోట్ల డాలర్ల ఎగువన ముగిసింది. బుధవారం ట్రేడింగ్ ముగిసేసరికి మదుపర్ల సంపద రూ.415.94 లక్షల కోట్లుగా నమోదైంది.
సెన్సెక్స్ ఉదయం 74,165.52 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ప్రారంభంలో తడబడిన సూచీ 73,860.33 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం పుంజుకుని 74,307.79 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 267.75 పాయింట్ల లాభంతో 74,221.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 68.75 పాయింట్లు పెరిగి 22,597.80 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,483.15- 22,629.50 పాయింట్ల మధ్య కదలాడింది.
- త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో భెల్ షేరు 5.42% నష్టపోయి రూ.301.90 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.6,023.97 కోట్లు తగ్గి రూ.1.05 లక్షల కోట్లకు చేరింది.
- ఫలితాల ప్రభావంతో జేకే టైర్ షేరు 4.91% రాణించి రూ.424.15 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.517.54 కోట్లు పెరిగి రూ.11,058.59 కోట్లకు చేరింది.
- బలమైన ఆర్థిక ఫలితాలు, భారీ ఆర్డర్లను దక్కించుకోవడంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) షేరు ఇంట్రాడేలో రూ.359 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 0.04% తగ్గి రూ.341.55 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.71,213.86 కోట్లుగా ఉంది. గత ఏడాది కాలంలో ఈ షేరు 193% దూసుకెళ్లింది.
- వరుసగా ఆరో రోజూ హిందుస్థాన్ జింక్ షేర్లు దూసుకెళ్లాయి. బుధవారం ఇంట్రాడేలో రూ.807 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 4.13% లాభంతో రూ.772.70 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3.26 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే షేరు 164% పరుగులు తీసింది. మే 14 నుంచి చూస్తే 37.96% పెరిగింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 21 లాభపడ్డాయి. హెచ్యూఎల్ 2.45%, రిలయన్స్ 1.72%, ఇన్ఫోసిస్ 1.43%, ఏషియన్ పెయింట్స్ 1.26%, ఐటీసీ 1.10%, అల్ట్రాటెక్ 0.97% రాణించాయి. ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్ 1.35% వరకు నష్టపోయాయి.
- 3 ఏళ్ల కనిష్ఠానికి బ్రిటన్ ద్రవ్యోల్బణం: ఈ ఏడాది ఏప్రిల్లో బ్రిటన్ ద్రవ్యోల్బణం 2.3 శాతానికి చేరింది. ఇది దాదాపు మూడేళ్ల కనిష్ఠ స్థాయి.
- ఈక్విటీ, రుణం ద్వారా రూ.12,000 కోట్ల వరకు సమీకరించే ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది.
- ప్రైవేట్ పెట్టుబడిదార్ల నుంచి నిధులు సమీకరించే అవకాశం ఉందని ఓయో వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ విలువను 4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.33,000 కోట్లు)గా లెక్కకట్టారు. ఐపీఓ ప్రతిపాదనను ఓయో ప్రస్తుతానికి విరమించుకున్న సంగతి విదితమే.
- అగ్రగామి డిబెంచర్ ట్రస్టీ బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ ఐపీఓ ఈనెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.57-60 నిర్ణయించారు. రిటైల్ మదుపర్లు కనీసం 2000 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయాలి. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్పై నమోదుకానున్నాయి.
- కార్పొరేట్ ఏజెంట్గా బీమా ఉత్పత్తులను విక్రయించేందుకు ఐఆర్డీఏఐ నుంచి అనుమతి లభించిందని మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది.
- ట్రావెల్ పోర్టల్ ఐక్సిగో, స్టీల్ వైర్ తయారీదారు బన్సల్ వైర్ ఇండస్ట్రీస్లను నిర్వహించే లీ ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్కు, ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు సెబీ అనుమతి ఇచ్చింది.
నేటి బోర్డు సమావేశాలు: ఐటీసీ, ఇండిగో, పేజ్ ఇండస్ట్రీస్, ఫోర్టిస్ హెల్త్కేర్, శిల్పా మెడికేర్, తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, టాటా ఇన్వెస్ట్మెంట్, బేయర్ క్రాప్సైన్స్, ష్నైడర్ ఎలక్ట్రిక్, సీఈఎస్సీ, సెల్లో వరల్డ్, ఫినోలెక్స్ కేబుల్స్, జేకే లక్ష్మీ సిమెంట్, సెంకో గోల్డ్, ఇక్రా, అమృతాంజన్ హెల్త్కేర్, జీఓసీఎల్ కార్పొరేషన్, ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!