73750- 74150 ఎగువన సానుకూలమే!
బలమైన దేశీయ సంకేతాలతో గతవారం సూచీలు జీవనకాల సరికొత్త గరిష్ఠాలను అధిరోహించాయి. డీఐఐ, ఎఫ్ఐఐ కొనుగోళ్లకు తోడు చమురు ధరలు స్థిరంగా ఉండటం ఇందుకు దోహదపడ్డాయి.
సమీక్ష: బలమైన దేశీయ సంకేతాలతో గతవారం సూచీలు జీవనకాల సరికొత్త గరిష్ఠాలను అధిరోహించాయి. డీఐఐ, ఎఫ్ఐఐ కొనుగోళ్లకు తోడు చమురు ధరలు స్థిరంగా ఉండటం ఇందుకు దోహదపడ్డాయి. మేలో ఇండియా కాంపోజిట్ పీఎంఐ 61.7గా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్ను ప్రభుత్వానికి చెల్లిస్తామని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించింది. లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరడంతో, మదుపర్ల దృష్టి పెద్ద షేర్ల వైపునకు మళ్లింది. కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్ ముడిచమురు 2.2% నష్టంతో 82.1 డాలర్లకు చేరింది. అమెరికాలో నిల్వలు పెరగడం, అమెరికా ఫెడ్ వ్యాఖ్యలు ప్రభావం చూపాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 83.10 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ద్రవ్యోల్బణం 2 శాతానికి దిగి వచ్చే వరకు వడ్డీ రేట్ల కోత ప్రారంభించలేమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సభ్యులు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 1.9% లాభంతో 75,410 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.9% పెరిగి 22,957 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో యంత్ర పరికరాలు, లోహ, విద్యుత్ షేర్లు లాభపడగా.. ఆరోగ్య సంరక్షణ, ఐటీ, ఎఫ్ఎమ్సీజీ స్క్రిప్లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.1166 కోట్ల విలువైన షేర్లను, డీఐఐలు రూ.6,978 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) నికరంగా రూ.22,047 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 7:10గా నమోదు కావడం..
ఎంపిక చేసిన పెద్ద షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: గతవారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, 75,636 పాయింట్ల వద్ద జీవనకాల తాజా గరిష్ఠాన్ని నమోదుచేసింది. స్వల్పకాలంలో 73,570- 74,150 పాయింట్ల ఎగువన ట్రేడైతే, ప్రస్తుత సానుకూల ధోరణి కొనసాగే అవకాశం ఉంటుంది. గరిష్ఠ స్థాయుల్లో కొంత స్థిరీకరణకు అవకాశం లేకపోలేదు.
ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీయ సూచీలు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. స్వల్పకాలంలో కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతాయి. మే డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో సూచీల ఒడుదొడుకులు పెరిగే అవకాశం ఉంది. షేర్లు అధిక విలువలకు చేరడం, ఇండియా విక్స్ సూచీ పెరగడం ఇందుకు తోడవ్వొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరికొంతకాలం అధిక వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశాలు కనిపిస్తుండటం, అప్రమత్తతకు దారితీయొచ్చు. ఈ వారం ఎల్ఐసీ ఇండియా, ఎన్ఎమ్డీసీ, బాటా, కమిన్స్, అపోలో హాస్పిటల్స్, ఆల్కెమ్ ఫార్మా, ముత్తూట్ ఫైనాన్స్ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. త్రైమాసిక ఫలితాలు చివరి దశకు చేరడంతో, షేరు ఆధారిత కదలికలు పరిమితం కావొచ్చు. ఈ వారం 2023-24 జీడీపీ గణాంకాలు, మౌలిక రంగ వృద్ధి, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు విడుదల కానున్నాయి. అంతర్జాతీయంగా.. చైనా పారిశ్రామిక లాభాలు, యూరో ఏరియా ఎకనామిక్ సెంటిమెంట్ ఇండికేటర్, యూరో ఏరియా నిరుద్యోగ రేటు, అమెరికా నిరుద్యోగ క్లెయిమ్లు, అమెరికా మొదటి త్రైమాసిక జీడీపీ, యూరో ఏరియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్, ద్రవ్యోల్బణం, చైనా తయారీ పీఎంఐ గణాంకాలపై దృష్టిపెట్టొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు.
తక్షణ మద్దతు స్థాయులు: 74,800, 74,158, 73,762
తక్షణ నిరోధ స్థాయులు: 76,000, 76,500, 77,000
సెన్సెక్స్ 73750- 74150 ఎగువన సానుకూల ధోరణి కొనసాగించొచ్చు.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు