మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం-వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి బంగారం ధర సోమవారం 2355 డాలర్ల వద్ద కదలాడుతోంది.

Published : 28 May 2024 02:24 IST

ఈనాడు వాణిజ్య విభాగం: బంగారం-వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి బంగారం ధర సోమవారం 2355 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఫలితంగా హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర సోమవారం రాత్రి 11.30 గంటల సమయానికి రూ.74,700 వద్ద కదలాడుతోంది. వెండి కిలో ధర రూ.95,900 స్థాయి వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు దిగి రావడంతో, గత గురువారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.74,500కు, వెండి కిలో ధర రూ.92,000 కు పరిమితమైన సంగతి విదితమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని