కమొడిటీ డెరివేటివ్స్లో అంతరాయంపై 15 నిమిషాల్లోపే సమాచారమివ్వాలి
కమొడిటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్కు అంతరాయం ఏర్పడితే 15 నిమిషాల్లోగా ఆ సమాచారం ఇవ్వాలని స్టాక్ ఎక్స్ఛేంజీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తెలిపింది.
అప్పుడు ట్రేడింగ్ సమయమూ పొడిగించాలి
ఎక్స్ఛేంజీలకు సెబీ వెల్లడి
దిల్లీ: కమొడిటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్కు అంతరాయం ఏర్పడితే 15 నిమిషాల్లోగా ఆ సమాచారం ఇవ్వాలని స్టాక్ ఎక్స్ఛేంజీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తెలిపింది. అలాంటి సందర్భాల్లో ట్రేడింగ్ను 30 నిమిషాల పాటు ట్రేడింగ్ను పొడిగించాలనీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిర్దిష్ట విధాన ప్రక్రియను (ఎస్ఓపీ) సెబీ తీసుకొచ్చింది. ట్రేడింగ్ను స్టాక్ ఎక్స్ఛేంజీలే స్వచ్ఛందంగా నిలిపేయడం లేదా నియంత్రణ పరమైన కారణాల రీత్యా అప్పుడప్పుడు అంతరాయాలు చోటుచేసుకుంటాయి. ఒకవేళ ఏదేని ఎక్స్ఛేంజీలో అంతరాయం ఏర్పడితే.. ఇతర ఎక్స్ఛేంజీల్లోని మార్కెట్ సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదని సెబీ తెలిపింది. 2024 జులై 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని సెబీ తెలిపింది.
- ట్రేడింగ్కు అంతరాయం ఏర్పడిన విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీ తక్షణమే సెబీకి తెలియజేయాలి. అంతరాయం చోటుచేసుకున్న సమయం నుంచి 15 నిమిషాల్లోగా మార్కెట్ వర్గాలు, ట్రేడర్లకు మెసేజ్, తన వెబ్సైట్ ద్వారా సమాచారం ఇవ్వాలి.
- తిరిగి ట్రేడింగ్ కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే వరకు 45 నిమిషాలకోసారి అంతరాయానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలి. ట్రేడింగ్ సమయం పొడిగింపు వివరాలను కూడా తెలియజేయాలని సెబీ తెలిపింది. డిజాస్టరీ రికవరీ సైట్ నుంచి లేదా ఇతరత్రా పద్ధతుల ద్వారా ట్రేడింగ్ కార్యకలాపాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ఎక్స్ఛేంజీ ప్రయత్నించాలని పేర్కొంది.
- సాయంత్రం గం.5.00/రాత్రి గం.9.00ల వరకు ట్రేడ్ అయ్యే కాంట్రాక్టులకు సంబంధించి, మార్కెట్ సమయం ముగియడానికి కనీసం 30 నిమిషాల ముందు (ముందస్తు సమాచారం ఇచ్చిన 15 నిమిషాలతో కాకుండా) ట్రేడింగ్ను పునరుద్ధరిస్తే.. ట్రేడింగ్ సమయాన్ని పొడిగించాల్సిన అవసరం ఉండదు. అయితే గం.4.30 లేదా గం.8.30 కల్లా ట్రేడింగ్ను పునరుద్ధరిస్తామంటూ గం.4:15 లేదా గం.8.15 కల్లా మార్కెట్ వర్గాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ట్రేడింగ్ సమయంలో ఎటువంటి మార్పు ఉండదు. ఒకవేళ సమాచారాన్ని గం.4.45 లేదా గం.8:45కు ఇస్తే.. ట్రేడింగ్ సమయాన్ని గం.5.00 లేదా గం.9.00 తర్వాతి నుంచి 30 నిమిషాల పాటు ఎక్స్ఛేంజీలు పొడిగించాలి. ఒకవేళ గం.4.45 లేదా గం.8.45 కల్లా సమాచారం ఇవ్వకుంటే, ట్రేడింగ్ సమయాన్ని పొడిగించనక్కర్లేదు. అలాగే మార్కెట్ వర్గాలు, ట్రేడర్లకు ఇచ్చే సమాచారంలో మదుపర్లు తమ పొజిషన్లను మార్చుకునేందుకు ఎప్పటి కల్లా లాగిన్ అవ్వాలనే వివరాలను పొందుపర్చాలి.
- రాత్రి గం.11:30 లేదా గం.11.55 వరకు ట్రేడ్ అయ్యే కాంట్రాక్టుల విషయంలో ట్రేడింగ్ పునరుద్ధరణ సమాచారాన్ని గం.10.45 లేదా 11.10 కల్లా ఇవ్వాలి. ట్రేడింగ్ పునఃప్రారంభ సమాచారంపై ఎప్పటికప్పుడు వివరాలను 11.10 వరకు ఇవ్వొచ్చు. అప్పటివరకు సమాచారం ఇవ్వకుంటే ట్రేడింగ్ సమయంలో పొడిగింపు ఉండదు. ఒకవేళ సమాచారం ఇస్తే 30 నిమిషాల పాటు ట్రేడింగ్ను పొడిగించవచ్చని సెబీ తెలిపింది.
- వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత కమొడిటీలకు ఆప్షన్ ట్రేడింగ్ను ప్రారంభించేందుకు నిర్దేశించిన సగటు రోజువారీ టర్నోవర్ పరిమితిని రూ.100 కోట్లకు సెబీ తగ్గించింది. అంతకుముందు ఇది రూ.200 కోట్లుగా ఉంది. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
సామాజిక సేవా సంస్థలు వార్షిక ప్రభావ నివేదిక సమర్పించాలి: సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీల (ఎస్ఎస్ఈలు) వద్ద నమోదైన లేదా వాటి ద్వారా నిధులు సమీకరించిన సామాజిక సేవా సంస్థలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘వార్షిక ప్రభావ నివేదిక’ను ఆయా ఎక్స్ఛేంజీలకు అక్టోబరు చివరికల్లా సమర్పించాలని సెబీ తెలిపింది. సమాజం మీద ఎంత మేర నాణ్యమైన ప్రభావాన్ని ఆ సంస్థలు సృష్టించాయో వార్షిక ప్రభావ నివేదిక ద్వారా ఎస్ఎస్ఈలు తెలుసుకుంటాయి. ఒకవేళ లాభాపేక్ష రహిత సంస్థలు (ఎన్పీఓ) సెక్యూరిటీల నమోదు లేకుండా కేవలం రిజిస్టర్ మాత్రమే అయితే.. ఎన్పీఓలు చేపట్టిన కార్యకలాపాలతో కూడిన వివరాలు ఆ నివేదికలో ఉండాలి. ఎస్ఎస్ఈల ద్వారా నిధులు సమీకరించిన సామాజిక సంస్థలు, ఆర్థిక సంవత్సరం ముగిశాక 90 రోజుల్లోగా వార్షిక ప్రభావ నివేదికను వెల్లడించాల్సి ఉంటుందని 2023 సెప్టెంబరులో సెబీ వెల్లడించింది. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024 అక్టోబరు 31 కల్లా సమర్పించాలని సెబీ తెలియజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!