సంక్షిప్తవార్తలు (4)
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) ఓయో సుమారు రూ.100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ వెల్లడించారు.
ఓయోకు తొలిసారి వార్షిక లాభం
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) ఓయో సుమారు రూ.100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ వెల్లడించారు. ఓయో లాభాన్ని నమోదుచేసిన తొలి ఆర్థిక సంవత్సరం ఇదేనని పేర్కొన్నారు. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ ఎబిటా ప్లస్లో నమోదైందని తెలిపారు. కంపెనీ వద్ద సుమారు రూ.1,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు. ఇందువల్లే అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తమ రుణ రేటింగ్ను పెంచిందని వివరించారు. 2023-24లో ఓయో నికర లాభం రూ.99.6 కోట్లుగా నమోదయ్యింది. ఎబిటా కూడా 2022-23లోని రూ.274 కోట్ల నుంచి గణనీయంగా పెరిగి రూ.888 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా సుమారు 5,000 హోటళ్లు, 6,000 హోమ్స్ను సంస్థ జతచేసుకుంది. ‘మున్ముందు భారత్లోనే కాకుండా నార్డిక్స్, ఆగ్నేయాసియా, అమెరికా, బ్రిటన్ లాంటి కీలక మార్కెట్లలోనూ కంపెనీ వృద్ధిని నమోదు చేస్తుంద’ని అగర్వాల్ తెలిపారు. ఆధ్యాత్మిక - వ్యాపార పర్యటనలు, సమావేశాలు, డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటి ధోరణులు పెరగడం వల్ల 2024-25లోనూ ఇంతకంటే ఆకర్షణీయ ఫలితాలను నమోదు చేస్తామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు తగ్గిన నష్టం
ఈనాడు, హైదరాబాద్: జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.168 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఆదాయం రూ.2,570 కోట్లు ఉంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.1,997 కోట్లు, నికరనష్టం రూ.639 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయాలు పెరిగి, నష్టాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.9,207 కోట్ల ఆదాయాన్ని, రూ.829 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2022-23లో ఆదాయం రూ.7,269 కోట్లు, నికర నష్టం రూ.848 కోట్లుగా నమోదయ్యాయి.
2023-24లో రూ.27,000 కోట్ల పసిడి బాండ్ల కొనుగోలు
ముంబయి: అధిక ప్రతిఫలం లభించడానికి తోడు, పన్ను ప్రయోజనాలు ఉంటుండటంతో పసిడి బాండ్లకు మదుపర్ల నుంచి విశేష ఆదరణ దక్కుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) మదుపర్లు రూ.27,031 కోట్ల విలువైన పసిడి బాండ్లను కొనుగోలు చేశారు. 2022-23లో కొనుగోలు చేసిన రూ.6,551 కోట్ల పసిడి బాండ్ల విలువతో పోలిస్తే ఇది 4 రెట్లకు పైగా ఉంది. పరిమాణం పరంగా 2023-24లో 44.34 టన్నుల పసిడికి సమానమైన బాండ్లను కొనుగోలు చేశారు. 2022-23లో ఇది 12.26 టన్నులుగా ఉందని ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది. పసిడి బాండ్లను ప్రభుత్వం తరపున ఆర్బీఐ విక్రయిస్తోంది. 2015 నవంబరులో పసిడి బాండ్ల పథకాన్ని ప్రారంభించగా.. ఇప్పటివరకు 67 విడతల్లో రూ.72,274 కోట్ల విలువైన పసిడి బాండ్లను (146.96 టన్నులకు సమానమైన) ఆర్బీఐ విక్రయించింది. పసిడి బాండ్లకు మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఉంది. గ్రాము పసిడి విలువకు సమానంగా పసిడి బాండు ధరను నిర్ణయిస్తున్నారు.
బీడీఎల్కు ఆకర్షణీయ లాభాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), మార్చి త్రైమాసికానికి రూ.942.60 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికరలాభం రూ.288.77 కోట్లు, ఈపీఎస్ రూ.7.88 నమోదయ్యాయి. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.835.42 కోట్లు, నికరలాభం రూ.152.75 కోట్లు, ఈపీఎస్ రూ.4.17 ఉన్నాయి. దీంతో పోల్చితే సమీక్షా త్రైమాసికంలో నికరలాభం ఆకర్షణీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి ఈ సంస్థ రూ.2,731.10 కోట్ల ఆదాయాన్ని, రూ.612.72 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్ రూ.16.72 ఉంది. 2022-23లో ఆదాయం రూ.2,644 కోట్లు, నికరలాభం రూ.352.17 కోట్లు, ఈపీఎస్ రూ.9.61 ఉన్నాయి. వాటాదార్లకు ఒక్కో షేరుకు 85 పైసల చొప్పున తుది డివిడెండ్ను బీడీఎల్ యాజమాన్యం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (8)
జియో ఎయిర్ఫైబర్కు రూ.1,000 ఛార్జీ మినహాయింపు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
-
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
-
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
-
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు