పర్యవేక్షణా వైఫల్యాలకు ఎంఐఐలపై జరిమానా
అసాధారణ లేదా అనుమానిత ట్రేడింగ్ లావాదేవీలను గుర్తించడంలో విఫలమైతే మార్కెట్ మౌలిక వసతుల సంస్థల (ఎంఐఐ)పై సెబీ జరిమానా విధించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.
జులై 1 నుంచి అమలు: సెబీ
దిల్లీ: అసాధారణ లేదా అనుమానిత ట్రేడింగ్ లావాదేవీలను గుర్తించడంలో విఫలమైతే మార్కెట్ మౌలిక వసతుల సంస్థల (ఎంఐఐ)పై సెబీ జరిమానా విధించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. చిన్న మదుపర్ల ప్రయోజనాలను పరిరక్షించే ఈ నిర్ణయం, ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి రానుంది.
- స్టాక్ మార్కెట్లు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలను ఎంఐఐలుగా వ్యవహరిస్తారు. ఇవి గత ఆర్థిక సంవత్సరంలో నమోదుచేసిన వార్షికాదాయం ఆధారంగా, సంబంధిత లోపాలపై జరిమానా ఉండనుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్నిసార్లు పర్యవేక్షణా లోపాలు తలెత్తాయనే విషయాన్నీ పరిగణనలోకి తీసుకోనుంది. ‘మార్కెట్ సమగ్రతను దెబ్బతీసేందుకు దారితీసే అసాధారణ లేదా అనుమానిత ట్రేడింగ్లను ఎప్పటికప్పుడు గుర్తించడమే ఎంఐఐల పర్యవేక్షణ వెనక ప్రధాన ఉద్దేశం. ఎంఐఐలు అందించే ఈ సమాచారం, నియంత్రణ పరమైన చర్యలు చేపట్టే విషయంలో తమకు ఉపయోగపడుతుంద’ని సెబీ వెల్లడించింది.
ఇలా చెల్లించాలి
- ఒక ఎంఐఐ మొత్తం వార్షిక ఆదాయం రూ.1,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంటే.. మొదటిసారి పర్యవేక్షణా వైఫల్యానికి రూ.25 లక్షలు జరిమానా విధిస్తారు. రెండో సారైతే రూ.50 లక్షలు, మూడో సారి నుంచి రూ.1 కోటి వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
- ఎంఐఐ వార్షిక ఆదాయం రూ.300-1000 కోట్లయితే, తొలి 3 వైఫల్యాలకు వరుసగా రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.20 లక్షలు చొప్పున జరిమానా కట్టాలి.
- ఎంఐఐ మొత్తం వార్షిక ఆదాయం రూ.300 కోట్ల కంటే తక్కువగా ఉంటే తొలి 3 పర్యవేక్షణా వైఫల్యాలకు ఈ జరిమానాలు వరుసగా రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.4 లక్షలుగా ఉంటాయి.
- మార్కెట్ వ్యాప్తంగా ప్రభావం లేదా ఎక్కువ మంది మదుపర్లు నష్టపోయేందుకు దారితీయడం లాంటి సందర్భాల్లో ఈ జరిమానా వర్తించదు.
మినహాయింపులు ఉంటాయ్
జరిమానా నుంచి మినహాయింపు పొందే అవకాశాన్ని ఎంఐఐలకు సెబీ కల్పించింది. ఇందుకోసం పర్యవేక్షణా వైఫల్యాన్ని గుర్తించిన వెంటనే సెబీకి ఆ వివరాలు సమర్పించాలి. జరిమానా విధించడానికి ముందు ఈ వివరాలను సెబీ పరిగణనలోకి తీసుకుంటుంది.
- సెబీ జరిమానా విధిస్తే.. ఆ మొత్తాన్ని 15 రోజుల్లోగా సెబీ మదుపర్ల భద్రత, అవగాహన నిధిలో ఎంఐఐలు జమచేయాల్సి ఉంటుంది.
- పర్యవేక్షణా వైఫల్యాలకు సెబీ విధించిన జరిమానా వివరాలను, ఎంఐఐలు తమ వెబ్సైట్లో ప్రదర్శించాలి. వార్షిక నివేదికలోనూ పొందుపర్చాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది.
ఏయే సందర్భాల్లో జరిమానా..
- పర్యవేక్షణ కార్యకలాపాలను నిర్వర్తించే విషయంలో వైఫల్యం చెందినట్లు తేలడం
- పర్యవేక్షణ సంబంధిత కార్యకలాపాల వివరాలను తెలియజేయకపోవడం లేదా అసమగ్రంగా ఆ వివరాలు ఉండటం
- సరైన సమయంలో పర్యవేక్షణా చర్యలను చేపట్టకపోవడం లేదా ఆలస్యం చేయడం లేదా పాక్షికంగా చేపట్టడం
సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీతో కేఆర్ఏల వ్యవస్థలు అనుసంధానం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు (కేఆర్ఏలు) తమ వ్యవస్థలను సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీతో (సీకేవైసీఆర్ఆర్) అనుసంధానం చేయాల్సిందిగా సెబీ ఆదేశించింది. ఆగస్టు 1 నుంచి కేవైసీ డేటాను అప్లోడ్ చేయడాన్ని ప్రారంభించాలనీ సూచించింది. ఒక క్లయింట్ కేవైసీ వివరాలను మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా కేఆర్ఏలో అప్లోడ్ చేస్తారు. మధ్యవర్తిత్వ సంస్థలే సీకేవైసీఆర్ఆర్లోనూ కేవైసీ సమాచారాన్ని అప్లోడ్ చేస్తుంటాయి. కేఆర్ఏ వ్యవస్థలో కేవైసీ సమచారాన్ని అప్లోడ్ చేయడం లేదా మార్పులు చేయడాన్ని నమోదిత మధ్యవర్తిత్వ సంస్థలు కొనసాగించొచ్చని సెబీ తెలిపింది. ఆ తర్వాత కేఆర్ఏలు ఆ కేవైసీ సమాచారాన్ని పరిశీలించి, ధ్రువీకరించాక మధ్యవర్తిత్వ సంస్థల నుంచి వివరాలు అందిన 7 రోజుల్లోగా సీకేవైసీఆర్ఆర్లో దానిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1 నుంచి దీనిని అమలు చేయాలి. ఇప్పటికే నమోదై ఉన్న వ్యక్తులు, సంస్థల కేవైసీ వివరాలను ఆగస్టు 1 నుంచి ఆరు నెలల్లోగా సీకేవైసీఆర్ఆర్లో కేఆర్ఏలు అప్లోడ్ చేయాలని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్