సంక్షిప్త వార్తలు
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.7,000 కోట్ల నిధుల సమీకరణ నిమిత్తం మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీఓలో రూ.4,000 కోట్ల వరకు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరించనుంది.
రూ.7,000 కోట్ల పబ్లిక్ ఇష్యూకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యత్నాలు
దిల్లీ: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.7,000 కోట్ల నిధుల సమీకరణ నిమిత్తం మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీఓలో రూ.4,000 కోట్ల వరకు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరించనుంది. మరో రూ.3,000 కోట్ల విలువైన షేర్లను మాతృసంస్థ బజాజ్ ఫైనాన్స్, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనుంది. 2025 సెప్టెంబరు కల్లా అప్పర్ లేయర్ బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావాలన్న ఆర్బీఐ నిబంధనను పాటించడం కోసమే, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాటా విక్రయానికి పూనుకుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ భవిష్యత్ మూలధన అవసరాల కోసం వినియోగించనున్నారు. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్ ఇండియా, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, గోల్డ్మాన్ శాక్స్(ఇండియా) సెక్యూరిటీస్, జేఎమ్ ఫైనాన్షియల్లు ఇష్యూకు మేనేజర్లుగా వ్యవహరించనున్నారు.
పొగాకు తయారీదార్ల కోసం జీఎస్టీ ప్రత్యేక ఫారం
దిల్లీ: పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదార్లు ఉత్పత్తి, సరఫరా వివరాలను పన్ను అధికారులతో పంచుకునేందుకు ప్రత్యేక ఫారం ‘జీఎస్టీ ఎస్ఆర్ఎం-2’ను జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్) తీసుకొచ్చింది. పన్ను ఎగవేతలను నియంత్రించడమే లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ తరహా ఉత్పత్తుల తయారీదార్లు, యంత్ర సామగ్రి వివరాల నమోదు చేసే నిమిత్తం గత నెలలోనే జీఎస్టీ ఎస్ఆర్ఎం-1 ఫారంను జీఎస్టీఎన్ తీసుకు రావడం గమనార్హం. తాజాగా తెచ్చిన రెండో ఫారం కూడా పోర్టల్లో అందుబాటులో ఉంది. పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదార్లు ఆ నెలకు సంబంధించి ఉత్పత్తి, సరఫరా, వినియోగ వివరాలను ఇందులో నమోదు చేయాల్సి ఉంటుందని జీఎస్టీఎన్ వెల్లడించింది. పాన్మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీలో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకు రావడమే ఈ కొత్త ఫారం ఉద్దేశంగా కనిపిస్తోందని మూరే సింగి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ మోహన్ తెలిపారు.
విమాన టికెట్ ధరలు 9% పెరిగాయ్
జనవరి-మార్చిపై ఎఫ్సీఎమ్ ట్రావెల్
ముంబయి: ఈ ఏడాది తొలి మూడు నెల (జనవరి-మార్చి)ల్లో భారత్లో విమాన టికెట్ల ధరలు సగటున 9% పెరిగాయని ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ నమోదిత ఎఫ్సీఎమ్ ట్రావెల్ వెల్లడించింది. ఆర్థిక వృద్ధి వల్ల ప్రయాణ గిరాకీ పెరగడం ఇందుకు కారణమని విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం.. 2023 ఇదే మూడు నెలలతో పోలిస్తే, ఈ ఏడాది జనవరి-మార్చిలో ప్రీమియం క్లాస్ బుకింగ్స్లో 20% వృద్ధి కనిపించింది. ఇందుకు తయారీ, ఐటీ తదితర రంగాలు సహకరించాయి. దేశీయ విమాన సామర్థ్యం 3% కంటే ఎక్కువ పెరిగింది. వ్యాపార సంబంధిత ప్రయాణాల్లో దిల్లీ-ముంబయి, ముంబయి-దిల్లీ, బెంగళూరు-ముంబయి మార్గాలు ముందు స్థానాల్లో నిలిచాయి. వ్యాపార ప్రయాణికులు ప్రీమియం అనుభవం కోసం కాస్త ఎక్కువ ఖర్చుపెట్టడానికీ సిద్ధపడుతున్నారు. వ్యాపార ప్రయాణాల్లో వృద్ధి కారణంగా, భారత్ త్వరలోనే ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద వ్యాపార ప్రయాణ మార్కెట్గా నిలుస్తుందని అంచనా వేసింది. భారత విమానయాన రంగం రాణిస్తుండడంతో, అంతర్జాతీయ విమాన సామర్థ్యం కూడా 14% మేర పెరిగింది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా, టికెట్ సగటు ధరలు కొంత తగ్గడమూ ఇందుకు దోహదం చేసిందని చెప్పాలి.
ఫిన్టెక్ రంగంలో ఎస్ఆర్ఓల ఏర్పాటుకు మార్గదర్శకాలు
ముంబయి: ఫిన్టెక్ పరిశ్రమలో స్వయం నియంత్రిత సంస్థ (ఎస్ఆర్ఓ)ల ఏర్పాటు నిమిత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తుది మార్గదర్శకాలను జారీ చేసింది. ఆర్బీఐ పర్యవేక్షణలో పనిచేస్తూ ఎస్ఆర్ఓ-ఎఫ్టీ (ఫిన్టెక్)లు ఈ రంగంలో ఆరోగ్యకర, స్థిరమైన అభివృద్ధి దిశగా బాధ్యతాయుతంగా, విశ్వసనీయతతో పనిచేయగలవని తెలిపింది. ఎస్ఆర్ఓ సభ్యులన్నీ వివాదాలకు అధికారిక మధ్యవర్తిగా ఉంటాయి. ఏ ఒక్క సంస్థకూ ఎస్ఆర్ఓలో 10% కంటే ఎక్కువ వాటా ఉండరాదు. ఎస్ఆర్ఓకు దరఖాస్తు చేయాలంటే కనీసం రూ.2 కోట్ల నికర సంపద ఉండాలి. భారత్లోనే ఇవి నమోదు కావాలి. కానీ విదేశీ ఫిన్టెక్ సంస్థలను అవి సభ్యులుగా చేసుకోవచ్చు. ఫిన్ టెక్ రంగానికి ప్రమాణాల నిర్దేశం, పర్యవేక్షణ, ఎన్ఫోర్స్మెంట్, అభివృద్ధి కార్యకలాపాల బాధ్యతలను ఎస్ఆర్ఓ-ఎఫ్టీ తీసుకుంటాయి. ఆర్బీఐ కింద పనిచేస్తూ బలమైన పాలనా ప్రమాణాలను ఎస్ఆర్ఓలు పాటించాల్సి ఉంటుంది. అవసరమైతే ఎస్ఆర్ఓ ఎఫ్టీ బోర్డుల్లో పరిశీలకులను ఆర్బీఐ నియమిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్