74,400-74,900 పైన సానుకూలతలు!
సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గతవారం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, జీవనకాల తాజా గరిష్ఠాల వద్ద ముగిశాయి.
సమీక్ష: సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గతవారం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, జీవనకాల తాజా గరిష్ఠాల వద్ద ముగిశాయి. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గడం, వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టనుండటం ప్రభావం చూపాయి. అంతర్జాతీయ సంకేతాలు, ముడిచమురు ధరలు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. దేశీయంగా చూస్తే.. మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. తయారీ పీఎంఐ 57.5కు చేరింది. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో వరుసగా ఎనిమిదో సారి కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. 2024-25 వృద్ధి అంచనాలను 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచింది. బ్యారెల్ ముడిచమురు 2.5% నష్టంతో 79.6 డాలర్ల వద్ద ముగిసింది. వచ్చే ఏడాదిలో ఉత్పత్తి కోతలను నిలిపివేయడానికి ఒపెక్ సభ్యులు మొగ్గుచూపడం కారణమైంది. డాలర్తో పోలిస్తే రూపాయి 83.40 దగ్గర స్థిరపడింది. అంతర్జాతీయంగా.. అమెరికాలో కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గింది. ఐరోపా కేంద్ర బ్యాంక్ అయిదేళ్లలో తొలిసారిగా వడ్డీ రేట్ల కోత విధించింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 3.7% లాభంతో 76,693 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 3.5% తగ్గి 23,290 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో ఐటీ, ఎఫ్ఎమ్సీజీ, వాహన లాభపడగా.. యంత్ర పరికరాలు, విద్యుత్, చమురు-గ్యాస్ షేర్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.13,718 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐలు) రూ.5,578 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 11:4గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: గతవారం 76,795 పాయింట్ల దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్, లాభాల్లో ముగిసింది. స్వల్పకాలంలో సూచీ 74,400- 74,900 పాయింట్ల ఎగువన కొనసాగినంత వరకు, సానుకూలంగానే ట్రేడయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఒడుదొడుకుల కారణంగా గరిష్ఠ స్థాయుల్లో కొంత స్థిరీకరణకు ఆస్కారం లేకపోలేదు.
ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలను దేశీయ సూచీలు అందిపుచ్చుకోవచ్చు. లోక్సభ ఎన్నికలు, ఆర్బీఐ సమావేశం ముగియడంతో ఒడుదొడుకులు కొంతమేర సద్దుమణగొచ్చు. ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం కీలకం కానుంది. ఫెడ్ ఈసారి కూడా రేట్లలో మార్పులు చేయకపోవచ్చు కానీ భవిష్యత్ వ్యాఖ్యల ప్రభావం చూపొచ్చు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగానే ఉండే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు, చేపట్టబోయే సంస్కరణలకు సంబంధించిన వార్తలపై కన్నేయొచ్చు. రుతుపవనాల పురోగతి కూడా కీలకం కానుంది. ఇప్పటివరకు వర్షపాతం ఆశాజనకంగా ఉండటం గ్రామీణ సెంటిమెంట్ను బలపరుస్తోంది. ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి, మే ద్రవ్యోల్బణం గణాంకాలపై దృష్టిపెట్టొచ్చు. కార్పొరేట్ వార్తలు, వార్షిక సాధారణ సమావేశాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. అంతర్జాతీయంగా.. అమెరికా నాన్ ఫారం పేరోల్స్, నిరుద్యోగం, కన్జూమర్ ప్రైస్ ద్రవ్యోల్బణం గణాంకాలు, చైనా ద్రవ్యోల్బణం, జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయాలు విడుదల కానున్నాయి. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు.
తక్షణ మద్దతు స్థాయులు: 75,678, 74,941, 74,474
తక్షణ నిరోధ స్థాయులు: 77,400, 78,200, 79,000
సెన్సెక్స్ 74,400-74,900 ఎగువన సానుకూలతలు కొనసాగించొచ్చు.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు