సంక్షిప్త వార్తలు(6)
ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) డైరెక్టర్ జనరల్గా జ్యోతి విజ్ను నియమించారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వచ్చినట్లు ఫిక్కీ మంగళవారం వెల్లడించింది.
ఫిక్కీ డైరెక్టర్ జనరల్గా జ్యోతి
దిల్లీ: ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) డైరెక్టర్ జనరల్గా జ్యోతి విజ్ను నియమించారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వచ్చినట్లు ఫిక్కీ మంగళవారం వెల్లడించింది. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి 1988లో జ్యోతి డిగ్రీ పూర్తి చేశారు. 1990లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ ఎకనామిక్స్లో పీజీ చేశారు. 1993లో ఫిక్కీలో చేరిన ఆమె వివిధ హోదాల్లో సేవలు అందించారు. ‘జ్యోతిని డైరెక్టర్ జనరల్గా నియమించినందుకు ఆనందంగా ఉంది. విధానాల రూపకల్పనలో ఆమె బలం, నాయకత్వం, సంస్థలో సుదీర్ఘ అనుభవం ఫిక్కీకి అదనపు విలువ జోడించడంలో సాయపడతాయ’ని ఫిక్కీ అధ్యక్షుడు అనీశ్ షా వెల్లడించారు. ఫిక్కీ సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఫిక్కీకి అందించిన సేవలకు సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.
కోయ్ ఛైర్పర్సన్గా అభిజిత్ కిశోర్
దిల్లీ: సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కోయ్) ఛైర్పర్సన్గా వొడాఫోన్ ఐడియా సీఓఓ అభిజిత్ కిశోర్ నియమితులయ్యారు. భారతీ ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ను వైస్ ఛైర్పర్సన్గా నియమించినట్లు కోయ్ తెలిపింది. ఈ నెల నుంచే ఈ నియామకాలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు కోయ్ ఛైర్పర్సన్గా వ్యవహరించిన రిలయన్స్ జియో ప్రెసిడెంట్ ప్రమోద్ కె మిత్తల్ నుంచి అభిజిత్ బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్లో ఓపెన్టెక్స్ట్ విస్తరణ
ఈనాడు, హైదరాబాద్: సాంకేతిక సేవలను అందించే ఓపెన్టెక్స్ట్ హైదరాబాద్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయంగా తమ కంపెనీ కృత్రిమ మేధ ఆవిష్కరణలకు ఈ కేంద్రం తోడ్పడుతుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ముహి మాజ్జౌబ్ తెలిపారు. ఈ కొత్త కేంద్రంతో ఉద్యోగుల సంఖ్య 25% వరకు పెరుగుతుందన్నారు.
మ్యాట్రిక్స్ ఫార్మాకు కోటక్ రూ.1445 కోట్లు
ముంబయి: హైదరాబాద్కు చెందిన మ్యాట్రిక్స్ ఫార్మాలో ఈక్విటీ, రుణం రూపేణ రూ.1445 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు కోటక్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్స్ లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది. యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియెంట్ (ఏపీఐ) సంస్థ వయాట్రిస్ను కొనుగోలు చేయడంతో, దేశీయంగా ఏపీఐ విభాగంలో రెండో అతిపెద్ద సంస్థగా మ్యాట్రిక్స్ అవతరించింది. యాంటీ రెట్రోవైరల్ (ఏఆర్వీ) ఏపీఐల తయారీలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థగా నిలిచింది. ఈ లావాదేవీ కోసమూ కోటక్ నిధులు ఉపకరించాయి. పరిశోధన-అభివృద్ధిలో కూడా మ్యాట్రిక్స్ బలోపేతం అయ్యేందుకు ఈ పెట్టుబడి సహకరించనుంది. ఇప్పటికే 185 మంది శాస్త్రవేత్తలు, 600 డీఎంఎఫ్ (డ్రగ్ మాస్టర్ ఫైల్)ను సంస్థ కలిగి ఉంది. అమెరికా, ఐరోపా నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే, అంతర్జాతీయ ఔషధ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునే వీలు మ్యాట్రిక్స్కు కలగనుంది.
ఇండిగోలో 1.99% వాటా రూ.3367 కోట్లకు విక్రయం
విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో 1.99% వాటాకు సమానమైన షేర్లను, ఆ సంస్థ ప్రమోటర్ రాహుల్ భాటియాకు చెందిన ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ సుమారు రూ.3,367 కోట్లకు మంగళవారం విక్రయించింది. బీఎస్ఈలో లభ్యమవుతున్న బల్క్ డీల్ సమాచారం ప్రకారం.. ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ మొత్తం 77,19,573 షేర్లను రూ.4362.04 సగటు ధరకు విక్రయించింది. అంటే లావాదేవీ మొత్తం విలువ రూ.3367.31 కోట్లు అవుతుంది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో ప్రస్తుతం ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్కు 37.75% వాటా ఉంది. తాజా వాటా విక్రయానంతరం ఇది 35.76 శాతానికి తగ్గింది. సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో 0.81% వాటాకు సమానమైన 31.23 లక్షల షేర్లను కొనుగోలు చేసింది.
సాధారణ బీమాకు మాస్టర్ సర్క్యులర్
దిల్లీ: ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ సాధారణ బీమా కంపెనీలు క్లెయిమ్లను తిరస్కరించడానికి వీల్లేదని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) మంగళవారం బీమా సంస్థలకు స్పష్టం చేసింది. అవసరమైన పత్రాలను పాలసీ ఇచ్చేప్పుడే తీసుకోవాలని, మాస్టర్ సర్క్యులర్లో ఐఆర్డీఏఐ తెలిపింది. ఇంతకుముందటి 13 సర్క్యులర్లను రద్దు చేసింది. తాజా ఆదేశాల ప్రకారం.. క్లెయిమ్ సెటిల్మెంట్కు అవసరమైన సంబంధిత పత్రాలను మాత్రమే సమర్పించమని వినియోగదార్లను సాధారణ బీమా కంపెనీలు కోరవచ్చని సూచించింది. రిటైల్ ఖాతాదార్లు తమ పాలసీని బీమా సంస్థకు సమాచారమిచ్చి, ఏ సమయంలోనైనా రద్దు చేసుకోవచ్చని పేర్కొంది. బీమా సంస్థ మాత్రం మోసం జరిగిందని చూపిస్తేనే పాలసీని రద్దు చేసుకోవచ్చని వెల్లడించింది. గడువు తీరని పాలసీని రద్దు చేసుకుంటే, ప్రీమియంలో కొంత మొత్తాన్ని బీమా సంస్థ సదరు పాలసీదారుడికి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక