రూ.4,589 పెట్టుబడిపై అయిదేళ్లలో రూ.7,609 లాభం

Eenadu icon
By Business News Desk Published : 29 Oct 2025 02:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

2020-21 పసిడి బాండ్లపై 166% ప్రతిఫలం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు భారీ ప్రతిఫలం లభిస్తోంది. 2020 అక్టోబరు 28న జారీ చేసిన సార్వభౌమ పసిడి బాండ్ల (ఎస్‌జీబీ)పై 166% లాభం రానుంది. ఎస్‌జీబీ 2020-21 సిరీస్‌-1 బాండ్ల కాలావధి 8 ఏళ్లు అయినా, అయిదేళ్లకు ముందస్తు రిడెమ్షన్‌ చేసుకోవచ్చు కనుక, ఇందుకు ధరను ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ బాండ్లు కలిగినవారు 2025 అక్టోబరు 28 నుంచి రిడెమ్షన్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం మేలిమి బంగారం గ్రాము ధరను రూ.12,198గా నిర్ణయించింది. గత 3 వ్యాపార దినాల (ఈనెల 23, 24, 27)లో ముగింపు ధరల సగటు ఆధారంగా దీనిని నిర్ణయించారు. ఈ సిరీస్‌ బాండ్లను  జారీ చేసినపుడు దరఖాస్తు చేసుకున్న మదుపర్లు ఒక్కో గ్రాముకు ఆన్‌లైన్‌లో రూ.4,589, ఆఫ్‌లైన్‌లో రూ.4,639 చొప్పున చెల్లించారు. అంటే ఒక్కో గ్రాముపై రూ.7,609 ప్రతిఫలం (166%) పొందారన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని