అయిదేళ్లలో 8 ఎస్‌యూవీలు తెస్తాం

Eenadu icon
By Business News Desk Published : 30 Oct 2025 02:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

50% మార్కెట్‌ వాటా తిరిగి సాధించడమే లక్ష్యం: మారుతీ 

టోక్యో: భారత్‌లో అయిదేళ్లలో 8 స్పోర్స్‌ యుటిలిటీ వాహన (ఎస్‌యూవీ) మోడళ్లు ఆవిష్కరిస్తామని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తెలిపింది. దీంతో తమ మొత్తం మోడళ్ల సంఖ్య 28కు చేరుతుందని పేర్కొంది. భారత ప్రయాణికుల వాహన విభాగంలో, ఎంఎస్‌ఐ మార్కెట్‌ వాటాను తిరిగి 50 శాతానికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ టొషిహిరో సుజుకీ తెలిపారు. జపాన్‌ వాహన ప్రదర్శనకు విచ్చేసిన భారత విలేకర్లతో ఆయన మాట్లాడారు. భారత కార్ల విపణిలో పోటీ బాగా పెరిగిందని, ఈ నేపథ్యంలో 50% మార్కెట్‌ వాటాను తిరిగి చేజిక్కించుకోవడం  కష్టమే అయినా, దానిని సాధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. 2018-19లో 51.2 శాతంగా ఉన్న ఎంఎస్‌ఐ వాటా, 2025-26 తొలి అర్ధభాగంలో 38.8 శాతానికి పడింది. ఎంఎస్‌ఐలో సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌కు 58% వాటా ఉంది. కంపెనీలు మరిన్ని కొత్త మోడళ్లు తీసుకొచ్చేందుకు ‘జీఎస్‌టీ రేట్ల తగ్గింపు’ ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మారుతీ ఎగుమతులు 4 లక్షల వాహనాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. భారత్‌- ఐరోపా కూటమి మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం ఆమోదంతో, ఐరోపా దేశాలకు ప్రధాన ఎగుమతి కేంద్రంగా భారత్‌ మారుతుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని