కంపెనీల ఐటీఆర్‌ దాఖలుకు డిసెంబరు 10 వరకు అవకాశం

Eenadu icon
By Business News Desk Published : 30 Oct 2025 02:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: ఖాతాపుస్తకాలను ఆడిట్‌ చేయించాల్సిన కంపెనీలు, ఇతర పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ ఊరటనిచ్చింది. 2025-26 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేసేందుకు గడువును డిసెంబరు 10 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు అక్టోబరు 31తో ముగియాల్సి ఉంది. ఈ పన్ను చెల్లింపుదారులు తమ ఆడిట్‌ రిపోర్టులు సమర్పించేందుకు గడువును నవంబరు 10 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని