ఏప్రిల్‌-సెప్టెంబరులో భారత్‌కు 64 టన్నుల పసిడి తరలింపు

Eenadu icon
By Business News Desk Published : 30 Oct 2025 02:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విదేశాల్లో నిల్వలు తగ్గించుకుంటున్న ఆర్‌బీఐ

విదేశాల నుంచి తన పసిడి నిల్వలను మనదేశానికి తీసుకు రావడాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వేగవంతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో 64 టన్నుల పసిడిని ఇక్కడకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్‌బీఐ మొత్తం పసిడి నిల్వల్లో 65 శాతానికి పైగా మనదేశంలోనే ఉన్నాయి. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే, భారత్‌లో ఆర్‌బీఐ పసిడి నిల్వల పరిమాణం దాదాపు రెట్టింపైంది. విదేశాల్లోని పసిడి నిల్వలను మనదేశానికి తీసుకు రావడానికి కారణాలు ఆర్‌బీఐ ఇప్పటివరకు వెల్లడించలేదు. సెప్టెంబరు చివరికి ఆర్‌బీఐ వద్ద 880 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. ఇందులో 576 టన్నుల పసిడి భారత్‌లోనే ఉంది. ఇది జీవనకాల గరిష్ఠ స్థాయి. గత నాలుగేళ్లలో విదేశాల నుంచి సుమారు 280 టన్నుల పసిడిని వెనక్కి తీసుకొచ్చినట్లు గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని