పెండింగ్‌ రిటర్న్‌లు మూడేళ్లకు మించితే దాఖలు చేయలేరు

Eenadu icon
By Business News Desk Published : 01 Nov 2025 01:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

గడువు తేదీ నుంచి మూడేళ్లు - అంతకుమించి పెండింగ్‌లో ఉన్న జీఎస్‌టీ రిటర్న్‌లను ఈ ఏడాది నవంబరుతో మొదలయ్యే పన్ను కాలం నుంచి దాఖలు చేసే వీలుండదని జీఎస్‌టీ నెట్‌వర్క్‌ (జీఎస్‌టీఎన్‌) తెలిపింది. నెలవారీ, త్రైమాసిక, వార్షిక జీఎస్‌టీ రిటర్న్‌లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. రిటర్న్‌ల దాఖలుకు సమయ ఆంక్షలను విధిస్తూ 2023లో జీఎస్‌టీ చట్టంలో చేసిన సవరణల ఆధారంగా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని ప్రకారం.. 2022 అక్టోబరులో దాఖలు చేయకుండా పెండింగ్‌లో ఉన్న నెలవారీ రిటర్న్‌ ఫారంలు జీఎస్‌టీఆర్‌-1, జీఎస్‌టీఆర్‌-3బీలను, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సమర్పించాల్సిన వార్షిక రిటర్న్‌ జీఎస్‌టీఆర్‌-9ను 2024 డిసెంబరు 1 తర్వాత నుంచి దాఖలు చేయడానికి వీలుండదని జీఎస్‌టీఎన్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని