Gautam Adani on Hindunburg report: ఆ దాడి కేవలం అదానీ గ్రూప్‌ పైనే కాదు.. భారత్‌ పైన కూడా: గౌతమ్‌ అదానీ

Eenadu icon
By Business News Team Published : 24 Sep 2025 13:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Gautam Adani on Hindunburg report | ఇంటర్నెట్‌ డెస్క్: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ టార్గెట్ చేసింది కేవలం అదానీ గ్రూప్‌ను మాత్రమే కాదని.. భారత వ్యాపార సంస్థలపై కూడా అని గౌతమ్ అదానీ అన్నారు. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై అదానీ, ఆయన కంపెనీలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి తాజాగా క్లీన్‌చిట్‌ లభించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన తన షేర్‌ హోల్డర్లకు బుధవారం ఓ లేఖ రాశారు.

తమను బలహీనపరిచేందుకు హిండెన్‌బర్గ్ చేసిన ప్రయత్నం.. తమ పునాదులను మరింత పటిష్టం చేసిందని అదానీ తన లేఖలో పేర్కొన్నారు. ‘ఆ రిపోర్ట్‌ అదానీ గ్రూప్‌పై విమర్శ మాత్రమే కాదు. ప్రపంచస్థాయిలో కలలు కనే భారతీయ సంస్థల ధైర్యానికి ప్రత్యక్ష సవాలు. మా లక్ష్యాన్ని, ప్రపంచస్థాయిలో ముందంజ వేయగల సామర్థ్యాన్ని ఆ నివేదిక ప్రశ్నించింది. కానీ, మేం ప్రతిసారీ చెప్పినట్లుగానే.. సెబీ తుది నిర్ణయంతో చివరికి సత్యమే గెలిచింది’ అని అదానీ తన లేఖలో పేర్కొన్నారు.

అదానీ గ్రూప్‌, గౌతమ్‌ అదానీపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను సెప్టెంబర్ 18న సెబీ కొట్టివేసింది. స్టాక్‌ అవకతవకలు, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడుతోందంటూ అమెరికా షార్ట్‌ సెల్లర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో తప్పుడు వాదనలు ప్రచారం చేసినవారు క్షమాపణ చెప్పాలని అదానీ కోరారు. మరోవైపు.. అదానీ, ఆయన కంపెనీలకు సెబీ నుంచి క్లీన్‌చిట్‌ లభించిన నేపథ్యంలో కంపెనీ షేర్లు దూసుకెళ్తున్నాయి. దీంతో ఆయన వ్యక్తిగత ఆదాయం 95.7 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు