Indian Economy: 4 లక్షల కోట్ల డాలర్ల భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాకారం
జపాన్ను వచ్చే ఏడాది అధిగమిస్తుంది
ఈఏసీ-పీఎమ్ సభ్యుడు సంజీవ్ సన్యాల్
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని పేర్కొన్నారు. ఎగుమతుల వృద్ధికి సవాళ్లు ఎదురవుతున్నా, మనదేశం 7% వృద్ధి రేటు సాధించడాన్ని ప్రస్తావించారు.
రెండేళ్లలో జర్మనీని సైతం: ‘ప్రస్తుతం భారత్ 3.7 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ. 307 లక్షల కోట్ల) పరిమాణంతో అయిదో ఆర్థిక వ్యవస్థగా ఉంది. 4.1 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.340 లక్షల కోట్ల)తో జపాన్ మనకంటే కాస్త ముందుంది. కాబట్టి ఈ ఏడాది, లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో మనం ఆ దేశాన్ని అధిగమిస్తామ’ని సన్యాల్ అన్నారు. ఇక జర్మనీ 4.6 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.382 లక్షల కోట్ల) స్థాయిలో ఉంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పెద్దగా వృద్ధి చెందడం లేదు కాబట్టి రెండేళ్ల అనంతరం ఆ దేశాన్నీ అధిగమిస్తామ’ని సన్యాల్ అంచనా వేశారు. ‘ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని 8-9 శాతానికి చేర్చేందుకు కావాల్సిన ద్రవ్య చర్యలు తీసుకోకపోవడమే మంచిది. దీర్ఘకాలంలో 7% వృద్ధే మంచిది. అదే ఉద్యోగాలను, పన్ను ఆదాయాన్ని సృష్టించగలద’ని సన్యాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 7 శాతంగా ఏడీబీ, ఫిచ్ రేటింగ్స్; 6.8 శాతంగా ఐఎమ్ఎఫ్, ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్, మోర్గాన్ స్టాన్లీ అంచనా వేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తాజ్’.. ప్రపంచంలో బలమైన హోటల్ బ్రాండ్
ప్రపంచంలోనే అత్యంత బలమైన హోటల్ బ్రాండ్ హోదాను టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్)లోని ‘తాజ్’ తిరిగి దక్కించుకుంది. -
హైదరాబాద్- అయోధ్య విమానం నిలిపివేత
హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నిర్వహిస్తున్న విమాన సర్వీసును ఈ నెల 1 నుంచి నిలిపివేసినట్లు స్పైస్జెట్ వెల్లడించింది. -
జీవిత బీమా.. మరింత ధీమా
జీవిత బీమా పాలసీలను పాలసీదారులకు మరింత చేరువ చేసే దిశగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పలు నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసింది. -
జీఎస్టీ తొలగిస్తే.. అందుబాటు ధరకు హెల్మెట్లు
హెల్మట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తొలగిస్తే, వాటి ధరలు తగ్గి, మరింతమంది నాణ్యమైనవి వినియోగించుకుంటారని జీఎస్టీ మండలి - ఆర్థిక శాఖను ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) కోరింది. -
3 నెలల కనిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి
దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి, ఏప్రిల్లో 5 శాతంగా నమోదైంది. ఇది 3 నెలల కనిష్ఠ స్థాయి. తయారీ రంగం నిరుత్సాహపరచడమే దీనికి కారణం. -
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో రూ.3-4 లక్షల కోట్ల పెట్టుబడులు
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం వచ్చే నాలుగేళ్లలో రూ.3-4 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించే అవకాశం ఉందని ఇక్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ రేటింగ్స్ అధికారి కె.రవిచంద్రన్ అంచనా వేశారు. -
మూడో త్రైమాసికం నుంచి వడ్డీ రేట్లు తగ్గుతాయి
డిపాజిట్లపై వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని, మధ్యస్థ కాలంలో ఇవి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ దినేశ్ ఖారా వెల్లడించారు. -
ఒడుదొడుకులున్నా ముందుకే
రెండు రోజుల విరామం తర్వాత సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. విద్యుత్, యంత్ర పరికరాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాన్ని తాకింది. -
వ్యాపార మద్దతు విధానాలు అవలంబించాలి
ప్రధాని మోదీ ప్రభుత్వం చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, ఉద్యోగాల సృష్టిని మరింత ప్రోత్సహించడానికి అనువైన విధానాన్ని అనుసరించాలని పీడబ్ల్యూసీ ఇండియా ఛైర్పర్సన్ సంజీవ్ క్రిషన్ సూచించారు. -
నెస్లేకు 4.5% రాయల్టీనే
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం నెస్లే ఇండియా నికర విక్రయాలపై, తన మాతృసంస్థ నెస్లేకు ప్రస్తుత స్థాయిలోనే రాయల్టీ చెల్లించనుంది. రాయల్టీ పెంపు ప్రతిపాదనను వాటాదార్లు తిరస్కరించడమే ఇందుకు కారణం. -
సంక్షిప్త వార్తలు
దేశీయ ప్రఖ్యాత స్నాక్స్ తయారీ, విక్రయ సంస్థ హల్దీరామ్స్, పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
ఈ నైపుణ్యం మీ జీవితాన్నే మార్చేస్తుంది.. వారెన్ బఫెట్ చెప్పిన సూత్రమిదే
Warren Buffett: యువ నిపుణుల కోసం ఓ సలహా ఇచ్చారు అమెరికన్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. ఈ నైపుణ్యం మీ సంపాదనపై ప్రభావం చూపుతుందన్నారు.