Banking data: మన సమాచారం సురక్షితమేనా?
ఖాతాదారుల్లో పెరుగుతున్న సందేహాలు
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ చర్యల నేపథ్యం 
సాంకేతికత మెరుగుదలపై బ్యాంకుల దృష్టి
వినియోగదారుల భద్రతకు పెద్దపీట
ఈనాడు - హైదరాబాద్

దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. కేవైసీ, ఇ-కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి)ని అమలు చేసేందుకు తగిన చర్యలూ తీసుకుంటున్నాయి. ఖాతాదారులకు సురక్షిత బ్యాంకింగ్ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాయి. ఐటీ వ్యవస్థ లోపాలను కారణంగా చూపిస్తూ కోటక్ మహీంద్రా బ్యాంకుపై ఆర్బీఐ కొన్ని ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఖాతాదారులు తమ సమాచారం క్షేమంగానే ఉందా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులూ తమ సాంకేతిక (ఐటీ) వ్యవస్థలను పటిష్ఠం చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి.
వివరాలు బయటికెళ్లాయా.. అంతే!
బ్యాంకు ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కితే అంతే సంగతులు. ఖాతాల్లోని సొమ్మును ఇట్టే కాజేస్తారు. బ్యాంకులు వినియోగిస్తున్న సాంకేతికతలో ఏ చిన్న లోపం ఉన్నా, సైబర్ నేరగాళ్లకు పని మరింత సులువవుతోంది. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 (డీపీడీపీ) ప్రకారం ప్రతి బ్యాంకు, ఆర్థిక సంస్థ తమ వినియోగదారుల సమాచారాన్ని అవసరమైనంత మేరకే వినియోగించాలి. ఆ సమాచారాన్ని అత్యంత భద్రతతో దాచి పెట్టాలి.
మార్కెటింగ్ కోసం వాడొద్దు
బ్యాంకులు కేవైసీ సందర్భంలో వినియోగదారుల వివరాలను ఖాతా నిర్వహణకు అవసరమైన మేరకే తీసుకోవాలని, అందుకే వినియోగించాలని చట్టం చెబుతోంది. మార్కెటింగ్ అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఇటీవలి ఒక నివేదిక ప్రకారం కొన్ని బ్యాంకులు ఈ సమాచారాన్ని ఇతర ఆర్థిక ఉత్పత్తులు అమ్మేందుకు వాడుకుంటున్నాయని తేలింది.
సైబర్ దాడుల నుంచి రక్షణ కోసం..
కేవైసీ కోసం వినియోగదారులు ఇచ్చిన సమాచారాన్ని రక్షించేందుకు, అధునాతన సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలను వినియోగిస్తాయి. ఎప్పటికప్పుడు తమ ఐటీ మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేస్తుంటాయి. అయినప్పటికీ కొన్నిసార్లు బ్యాంకుల నుంచి సమాచారం బయటకు వెళ్లిన సందర్భాలు కనిపిస్తూనే ఉంటాయి. దీని విషయంలోనూ ఇప్పుడు బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త ఖాతాదారులను చేర్చుకునేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి.
ముందు జాగ్రత్తగా..
బ్యాంకు వ్యవస్థల్లో ఏమైనా లోపాలు బయటపడి, ఆర్బీఐ నుంచి కఠిన ఆంక్షలను ఎదుర్కోవడం బ్యాంకులకు పెద్ద సవాలు. ఖాతాదారుల విశ్వాసాన్ని కోల్పోతే కష్టం. దీన్ని అరికట్టేందుకు ఆర్థిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు తన సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. 2019లో నిర్వహణ ఖర్చు నుంచి 5.6 శాతాన్ని ఇందుకోసం కేటాయించగా, గత ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతానికి పెంచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెరుగుతున్న ఖాతాదారులు, సాంకేతిక అభివృద్ధికి తగ్గట్లుగా తన ఐటీ మౌలిక వసతులను పటిష్ఠం చేస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా వనరులను కేటాయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంకు నిర్వహణ వ్యయాల్లో 9.3 శాతాన్ని ఐటీ, డిజిటల్ లావాదేవీల కోసం ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల వరకు ఐటీ మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయాలని యూకో బ్యాంకు ప్రణాళికలు వేసుకుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఐటీ సామర్థ్యాలను పెంచుకునేందుకు నిర్వహణ వ్యయాల్లో 8-10% కేటాయిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఐటీ, డిజిటల్ వసతులను అభివృద్ధి చేసేందుకు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

పీఎఫ్ రూల్స్: కొత్తగా ఏం మారాయి? 25% వాటా మాటేంటి?
EPF New Rules: ఉద్యోగుల భవిష్యనిధి (EPF)కి సంబంధించి ఇటీవల కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని నిబంధనలు సరళతరం చేయడంతోపాటు ఉపసంహరణ ఆప్షన్ల సంఖ్యను EPFO పెంచింది. - 
                                    
                                        

బంగారం మెరుపులు ఎందుకంటే?
బంగారం ధర వెనక్కి తిరిగి చూడటం లేదు. రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పది గ్రాముల పసిడి (24 క్యారెట్లు) రూ.1.17- 1.20 లక్షల ధర పలికింది నిన్నమొన్ననే. - 
                                    
                                        

రూ.వెయ్యితో ఎలా బతికేదీ?!
నెలకు వెయ్యి రూపాయలు లేదా అంతకన్నా తక్కువ పింఛను వస్తే పరిస్థితేంటి? 1952 భవిష్య నిధి చట్టం (ఈపీఎఫ్) కిందకు వచ్చే ఉద్యోగుల పింఛన్ పథకం (1995) కింద 37 లక్షలమంది వృద్ధులు, వారి కుటుంబాలకు ఇస్తున్న మొత్తం ఇంతే! ఈ అరకొర పింఛన్తోనే ఆహారం, దుస్తులు, ఇంటి అద్దెలు, వైద్యం వంటి ఖర్చులన్నీ తీరిపోవాలి. - 
                                    
                                        

ఫాదర్ ఆఫ్ ఫాస్టాగ్: రూ.50 వేలతో కంపెనీ.. ఫాస్టాగ్తో హిస్టరీ..!
Father of FASTag: ఐటెక్ కంపెనీ సీఈఓ అషిమ్ పాటిల్. ఫాదర్ ఆఫ్ ఫాస్టాగ్గా వ్యవహరిస్తారు. తాజాగా ఈ కంపెనీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. - 
                                    
                                        

‘వారితో పనిచేయడం మీ అదృష్టం’.. జెన్-Z ఉద్యోగులకు సుందర్ పిచాయ్ సూచనలు
Sundar Pichai: కెరీర్లో తనకెదురైన అనుభవాలను సుందర్ పిచాయ్ ఇటీవల అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో పంచుకున్నారు. ఈ సందర్భంగా జెన్-Z ఉద్యోగులకు కొన్ని కీలక సూచనలు చేశారు. - 
                                    
                                        

క్రెడిట్ కార్డు బిల్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు.. ఈ పరిమితి దాటితే IT నజర్!
Income tax notice: ఆదాయపు పన్ను పరిమితికి మించి సంపాదన ఉన్నవారు ఐటీఆర్ (Income Tax Returns) దాఖలు చేయడం తప్పనిసరి. కానీ, మీ ఆదాయం.. పరిమితి కన్నా తక్కువగా ఉన్నప్పటికీ మీరు చేసే కొన్ని ఆర్థిక లావాదేవీలు.. మిమ్మల్ని ఆదాయ పన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లొచ్చు. - 
                                    
                                        

ఎయిర్పోర్ట్ లాంజ్లో ఫ్రీ.. ఫ్రీ.. వెనుక లాజిక్ ఇదీ!
Airport lounge: లాంజ్ల్లో ఉచితంగా లభించే సదుపాయాల వెనుక ఉన్న బిజినెస్ మోడల్ను వివరించారు ఓ మాజీ బ్యాంకర్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. - 
                                    
                                        

సైబర్ మోసాల బారిన పడకుండా.. ఈ టిప్స్ పాటించండి!
Cyber frauds: సైబర్ మోసాల బారినపడకుండా ఉండేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కొన్ని సూచనలు చేసింది. ఆ వివరాలు ఇవీ.. - 
                                    
                                        

ఏటీఎం ఆలోచన ఎలా పురుడుపోసుకుందో తెలుసా?
ATM history: ఏటీఎం ఎలా పురుడు పోసుకుంది. తొలి ఏటీఎం ఎక్కడ ఏర్పాటైంది? దీన్ని రూపొందించిన వ్యక్తికి భారత్తో ఉన్న సంబంధం ఏంటి? - 
                                    
                                        

అరుదైనవి సాధిస్తామా?
అరుదైన భూఅయస్కాంతాలు (రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్).. విమానాలు, కంప్యూటర్లు, కార్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వంటి వస్తువుల తయారీలో కీలకం. ఈ విడిభాగాల కొరత ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. - 
                                    
                                        

‘డార్క్’ మోసాలకు చెక్.. డార్క్ పాటర్న్స్పై కేంద్రం నజర్!
Dark patterns: డార్క్ పాటర్న్స్ నుంచి వినియోగదారులకు ఊరట లభించనుంది. వీటిపై కేంద్రం దృష్టిసారించింది. - 
                                    
                                        

ఆర్థిక అడ్డంకులను తట్టుకునేలా
ప్రతి వ్యక్తికీ ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాలనే కోరిక ఉంటుంది. దీనికోసం ఎన్నో త్యాగాలు చేయాల్సిందే. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఆర్థికంగా ఏ ఇబ్బందులూ రాకుండా చూసుకోవాలి. అప్పుడే విషమ పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడే శక్తి వస్తుంది. ఇందుకోసం ఏం చేయాలి? చూద్దాం. - 
                                    
                                        

మోసాల ఖాతాలో మరో బ్యాంకు!
ఇండస్ఇండ్ బ్యాంకుకు దేశంలో అయిదో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా పేరుంది. ఇందులో పలు అకౌంటింగ్ మోసాలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. ఈ ఉదంతం బ్యాంకుల కార్యనిర్వహణ లొసుగులను బట్టబయలు చేసింది. దీంతో రిజర్వు బ్యాంకు, సెబీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. ఈ పరిస్థితుల్లో మన బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా భరోసా ఇవ్వడం కాస్త ఊరట కలిగించేదే! - 
                                    
                                        

ఈపీఎఫ్ వడ్డీ జమయ్యేది ఎప్పుడు? ఆలస్యం వల్ల ప్రయోజనం కోల్పోతామా?
EPF interest: ఈపీఎఫ్ వడ్డీ జమ ఆలస్యం కావడం వల్ల ప్రయోజనం కోల్పోతామా? వడ్డీ ఎప్పుడు జమ కావొచ్చు? - 
                                    
                                        

సైన్యం చేతిలో డ్రోనాయుధాలు!
భారతదేశ రక్షణ రంగంలో డ్రోన్లు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. సరిహద్దు నిఘా, యుద్ధ వ్యూహాలు, సరిహద్దులోని బలగాలకు సామగ్రి సరఫరా, ఉగ్రవాదుల గుర్తింపు కార్యకలాపాల్లో సైనిక సామర్థ్యాన్ని డ్రోన్లు గణనీయంగా పెంచుతున్నాయి. - 
                                    
                                        

బఫెట్ చెప్పిన మదుపు వ్యూహాలు
ప్రపంచ దిగ్గజ మదుపరి వారెన్ బఫెట్ బెర్క్షైర్ హాత్వే సీఈఓ పదవి నుంచి దిగిపోనున్నట్లు ప్రకటించారు. పెట్టుబడులతో అపర కుబేరుడిగా మారిన ఆయన పాటించిన, చెప్పిన మదుపు సూత్రాలు ఎప్పుడూ ఆచరణీయమే. ఈ నేపథ్యంలో ఒకసారి అవేమిటో చూద్దాం.. - 
                                    
                                        

అధిక సుంకాలు... అందివస్తున్న అవకాశాలు!
‘అమెరికా ఫస్ట్’ పేరిట ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న వ్యూహం అంతర్జాతీయ వాణిజ్యంలో మౌలిక మార్పులకు నాంది పలికింది. అనేక దేశాలపై ట్రంప్ ‘ప్రతీకార’ సుంకాలు విధించారు. వాటి అమలుకు 90 రోజుల గడువిచ్చి, ఆయా దేశాలను సంప్రదింపులకు రమ్మనడం సరికొత్త పద్ధతి. - 
                                    
                                        

ట్రంప్ సుంకాలతో మాంద్యం ముప్పు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తమ దేశంలోకి దిగుమతి అవుతున్న వివిధ దేశాల ఉత్పత్తులపై భారీగా వడ్డించిన సుంకాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకూ చేటు కలగనుందా.. దేశంలో ఆర్థిక మాంద్యం వస్తుందా.. అంటే ఆ ప్రమాదం లేకపోలేదని వాల్స్ట్రీట్ వర్గాలు, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. - 
                                    
                                        

ఏమిటీ AnTuTu స్కోర్.. ఫోన్ కొనేటప్పుడు ఈ సంఖ్య చూడాలా?
AnTuTu score: మొబైల్ సంస్థలు AnTuTu స్కోర్ గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తుంటాయి. ఇంతకీ ఏమిటీ స్కోర్? - 
                                    
                                        

మైక్రో రిటైర్మెంట్.. ఉద్యోగ జీవితంలో కొత్త ట్రెండ్!
Micro retirement: ఉద్యోగ జీవితానికి సంబంధించి కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే మైక్రో రిటైర్మెంట్. ఇంతకీ ఏమిటిది? 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


