Banking data: మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి.
ఖాతాదారుల్లో పెరుగుతున్న సందేహాలు
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ చర్యల నేపథ్యం
సాంకేతికత మెరుగుదలపై బ్యాంకుల దృష్టి
వినియోగదారుల భద్రతకు పెద్దపీట
ఈనాడు - హైదరాబాద్
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. కేవైసీ, ఇ-కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి)ని అమలు చేసేందుకు తగిన చర్యలూ తీసుకుంటున్నాయి. ఖాతాదారులకు సురక్షిత బ్యాంకింగ్ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాయి. ఐటీ వ్యవస్థ లోపాలను కారణంగా చూపిస్తూ కోటక్ మహీంద్రా బ్యాంకుపై ఆర్బీఐ కొన్ని ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఖాతాదారులు తమ సమాచారం క్షేమంగానే ఉందా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులూ తమ సాంకేతిక (ఐటీ) వ్యవస్థలను పటిష్ఠం చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి.
వివరాలు బయటికెళ్లాయా.. అంతే!
బ్యాంకు ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కితే అంతే సంగతులు. ఖాతాల్లోని సొమ్మును ఇట్టే కాజేస్తారు. బ్యాంకులు వినియోగిస్తున్న సాంకేతికతలో ఏ చిన్న లోపం ఉన్నా, సైబర్ నేరగాళ్లకు పని మరింత సులువవుతోంది. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 (డీపీడీపీ) ప్రకారం ప్రతి బ్యాంకు, ఆర్థిక సంస్థ తమ వినియోగదారుల సమాచారాన్ని అవసరమైనంత మేరకే వినియోగించాలి. ఆ సమాచారాన్ని అత్యంత భద్రతతో దాచి పెట్టాలి.
మార్కెటింగ్ కోసం వాడొద్దు
బ్యాంకులు కేవైసీ సందర్భంలో వినియోగదారుల వివరాలను ఖాతా నిర్వహణకు అవసరమైన మేరకే తీసుకోవాలని, అందుకే వినియోగించాలని చట్టం చెబుతోంది. మార్కెటింగ్ అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఇటీవలి ఒక నివేదిక ప్రకారం కొన్ని బ్యాంకులు ఈ సమాచారాన్ని ఇతర ఆర్థిక ఉత్పత్తులు అమ్మేందుకు వాడుకుంటున్నాయని తేలింది.
సైబర్ దాడుల నుంచి రక్షణ కోసం..
కేవైసీ కోసం వినియోగదారులు ఇచ్చిన సమాచారాన్ని రక్షించేందుకు, అధునాతన సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలను వినియోగిస్తాయి. ఎప్పటికప్పుడు తమ ఐటీ మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేస్తుంటాయి. అయినప్పటికీ కొన్నిసార్లు బ్యాంకుల నుంచి సమాచారం బయటకు వెళ్లిన సందర్భాలు కనిపిస్తూనే ఉంటాయి. దీని విషయంలోనూ ఇప్పుడు బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త ఖాతాదారులను చేర్చుకునేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి.
ముందు జాగ్రత్తగా..
బ్యాంకు వ్యవస్థల్లో ఏమైనా లోపాలు బయటపడి, ఆర్బీఐ నుంచి కఠిన ఆంక్షలను ఎదుర్కోవడం బ్యాంకులకు పెద్ద సవాలు. ఖాతాదారుల విశ్వాసాన్ని కోల్పోతే కష్టం. దీన్ని అరికట్టేందుకు ఆర్థిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు తన సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. 2019లో నిర్వహణ ఖర్చు నుంచి 5.6 శాతాన్ని ఇందుకోసం కేటాయించగా, గత ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతానికి పెంచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెరుగుతున్న ఖాతాదారులు, సాంకేతిక అభివృద్ధికి తగ్గట్లుగా తన ఐటీ మౌలిక వసతులను పటిష్ఠం చేస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా వనరులను కేటాయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంకు నిర్వహణ వ్యయాల్లో 9.3 శాతాన్ని ఐటీ, డిజిటల్ లావాదేవీల కోసం ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల వరకు ఐటీ మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయాలని యూకో బ్యాంకు ప్రణాళికలు వేసుకుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఐటీ సామర్థ్యాలను పెంచుకునేందుకు నిర్వహణ వ్యయాల్లో 8-10% కేటాయిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఐటీ, డిజిటల్ వసతులను అభివృద్ధి చేసేందుకు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి