Charlie Munger: వారెన్ బఫెట్ సక్సెస్ చిరునామా చార్లీ ముంగర్ ఇకలేరు
Charlie Munger: సుదీర్ఘ కాలం బెర్క్షైర్ హాత్వే వైస్ ఛైర్మన్గా పనిచేసిన చార్లీ ముంగర్ మంగళవారం తుది శ్వాస విడిచారు. ప్రపంచ ప్రఖ్యాత మదుపరి వారెన్ బఫెట్ సక్సెస్లో ముంగర్ది కీలక పాత్ర.
కాలిఫోర్నియా: ప్రపంచ ప్రఖ్యాత మదుపరి వారెన్ బఫెట్ (Warren Buffet) తన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బెర్క్షైర్ హాత్వేను స్థాపించడంలో కీలకంగా వ్యవహరించిన చార్లీ ముంగర్ (Charlie Munger) (99) కన్నుమూశారు. కాలిఫోర్నియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ముంగర్ (Charlie Munger) దశాబ్దాల పాటు బెర్క్షైర్ బోర్డు వైస్ ఛైర్మన్గా వ్యవహరించారు. బఫెట్ (Warren Buffet) తీసుకునే ప్రతి పెట్టుబడి, వ్యాపార నిర్ణయాల్లో ఆయనదే కీలక పాత్ర ఉండేది. బెర్క్షైర్ విషయంలో బఫెట్ను ముందుంచి వెనకాల మొత్తం ముంగరే నడిపించేవారని సన్నిహితులు చెబుతుంటారు. కానీ, కంపెనీ సక్సెస్లో నా పాత్రేమీ లేదని ఆయన చెబుతుండేవారు. బఫెట్ (Warren Buffet) మాత్రం ముంగర్కే క్రెడిట్ ఇచ్చేవారు. మానవ నైజం, వ్యాపారాలకు విలువివ్వడం గురించి ముంగర్ (Charlie Munger) తనకు చాలా నేర్పారని బఫెట్ ఓ సందర్భంలో స్వయంగా తెలిపారు.
బఫెట్, ముంగర్ (Charlie Munger) 1500 మైళ్ల దూరంలో నివసించేవారు. కానీ, తన ప్రతి కీలక నిర్ణయం ముంగర్ను సంప్రదించిన తర్వాతే తీసుకున్నానని బఫెట్ (Warren Buffet) వెల్లడించారు. ప్రస్తుతం బఫెట్ నివాసం ఉంటున్న ఒమాహాలోనే ఇద్దరి చిన్నతనం గడవడం గమనార్హం. కానీ, ముంగర్ ఏడేళ్లు పెద్దవాడు కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఉండేది కాదని బఫెట్ తెలిపారు. అయితే, ఇద్దరూ బఫెట్ (Warren Buffet) తాత నడిపే నిత్యావసర సరకుల స్టోర్లోనే పనిచేశారు. అయినప్పటికీ.. ఇద్దరి మధ్య చిన్నతనంలో పెద్దగా పరిచయం లేదట.
ముంగర్, బఫెట్ తొలిసారి 1959లో ఒమాహాలో జరిగిన ఓ విందులో కలిశారు. అప్పటికే ముంగర్ (Charlie Munger) న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బఫెట్ (Warren Buffet) ఓ ఇన్వెస్ట్మెంట్ సంస్థను నడుపుతున్నారు. నాటి నుంచి ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. సుదీర్ఘ లేఖలు, తరచూ టెలిఫోన్ కాల్స్తో తమ ఆలోచనలను పంచుకునేవాళ్లమని ముంగర్ తన బయోగ్రఫీలో పేర్కొన్నారు. అలా 1960, 70ల్లో ఇరువురూ కలిసి కొన్ని కంపెనీలను కొనుగోలు చేశారు. అలా ట్రేడింగ్ స్టాంప్ల తయారీ సంస్థ ‘బ్లూ చిప్ స్టాంప్ కంపెనీ’లో వీరిద్దరూ అతిపెద్ద వాటాదారులుగా మారారు. తర్వాత ‘సీస్ క్యాండీ’, ‘బఫెల్లో న్యూస్ అండ్ వెస్కో’ను కొనుగోలు చేశారు. ముంగర్ 1978లో బెర్క్షైర్ వైస్ ఛైర్మన్గా మారారు. 1984లో వెస్కో ఫైనాన్షియల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు.
బెర్క్షైర్ హాత్వే వార్షిక సమావేశాల్లో బఫెట్ పక్కన కూర్చొని వాటాదారుల ప్రశ్నలకు ముంగర్ (Charlie Munger) సమాధానాలు ఇచ్చేవారు. కంపెనీ సమావేశాల్లో బఫెట్ (Warren Buffet) ఇచ్చే వివరణాత్మక సమాధానాలను ముంగర్ సావధానంగా వినేవారని సన్నిహితులు చెబుతుంటారు. అంతా అయిపోయిన తర్వాత ముంగర్ అభిప్రాయాన్ని కోరితే.. ‘ఇంకా చెప్పడానికి నా దగ్గర ఏం లేదు’ అని అనేవారట. అయితే, అవసరమైనప్పుడు మాత్రం సూటిగా సమాధానాలిచ్చేందుకు వెనుకాడేవారు కాదని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ముంగర్ (Charlie Munger) విపరీతంగా చదివేవారు. మానవ నైజాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన చాలా ఆసక్తి చూపేవారు. సైకాలజీ, భౌతిక శాస్త్రం, గణితం ఇలా అనేక రంగాల నుంచి వివిధ మోడల్స్ను అధ్యయనం చేసి వాటిని పెట్టుబడి నిర్ణయాల్లో ఉపయోగించేవారు. 1940లో మిషిగన్ యూనివర్శిటీలో గణితంలో బ్యాచిలర్ డిగ్రీని మధ్యలోనే ఆపేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్మీ ఎయిర్ కోర్లో వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేశారు. తిరిగి 1948లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు.
ముంగర్ (Charlie Munger) సంపద ఓ దశలో రెండు బిలియన్ డాలర్లకు చేరింది. కానీ, ఆయన క్రమంగా దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించడం ప్రారంభించడంతో అది తగ్గుతూ వచ్చింది. హార్వర్డ్ వెస్ట్లేక్ స్కూల్, స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ లా స్కూల్, మిషిగన్ యూనివర్శిటీ, హంటిగ్టన్ లైబ్రరీకి ఆయన పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. 2010లో ఆయన భార్య మరణించిన తర్వాత బెర్క్షైర్ స్టాక్లోని మెజారిటీ వాటాను ఆయన తన ఎనిమిది మంది పిల్లలకు పంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు