Piyush Goyal: కొన్ని దేశాలపై అతిగా ఆధారపడటం తగ్గించుకోవాలి: పీయూష్‌ గోయల్‌

Eenadu icon
By Business News Team Published : 30 Oct 2025 00:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: స్థిరమైన సరఫరా వ్యవస్థ, కీలక సాంకేతికతలపై నియంత్రణ, కొన్ని దేశాలపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యమని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ‘స్వదేశీ’ పిలుపు.. కేవలం భారత్‌లో తయారీ గురించి కాదని, దేశ దీర్ఘకాలిక వృద్ధికి, సార్వభౌమత్వానికి ఇది దోహదపడుతుందన్నారు. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈమేరకు మాట్లాడారు. భారత టెక్ స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా ఆదరణను పొందుతున్నాయని తెలిపారు.

‘‘సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలు, ఇంధన వనరుల విషయంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం దేశాభివృద్ధికి కీలకం. స్వీయ సాంకేతికత, స్థిరమైన సరఫరా వ్యవస్థ వంటివి ఎంత ముఖ్యమో.. ఈ దశాబ్దంలో కొవిడ్‌ మొదలు అనేక పరిణామాలు చాటిచెప్పాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్ లేదా సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్‌గా నిలవడం నుంచి ప్రపంచ ఆవిష్కరణల ఇంజిన్‌గా మారాలని భారత్‌ నిర్ణయించింది’’ అని పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) వ్యాఖ్యానించారు.

ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు వ్యక్తి పేరు.. మార్చికల్లా అందుబాటులోకి!

చమురు, సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాల విషయంలో విదేశాలపై భారత్‌ ఆధారపడుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి గోయల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెమీకండక్టర్ల ఎగుమతుల్లో తైవాన్ అగ్రగామిగా ఉంది. ప్రపంచ అవసరాల్లో 90 శాతం ఈ దేశమే సరఫరా చేస్తుంది. ఈ రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులపై దాదాపు రూ. 1.6 లక్షల కోట్లమేర పెట్టుబడులు పెడుతోంది. అదేవిధంగా ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’ని కూడా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని