Stock market: ఆఖర్లో అమ్మకాలు.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 33 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 5 పాయింట్లు లాభపడింది.

Published : 11 Jun 2024 16:01 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో కదలాడిన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు బలహీనపడ్డాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. 

సెన్సెక్స్‌ ఉదయం 76,680.90 పాయింట్లు వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నా దాదాపు లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 76,860.53 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో అమ్మకాల కారణంగా 33.49 పాయింట్ల నష్టంతో 76,456.59 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం కేవలం 5 పాయింట్లు లాభపడి 23,264.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.57 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌లో ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభపడగా.. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌, ఐటీసీ, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ 81.43 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2322 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు