Stock market: సెన్సెక్స్..నిఫ్టీ రికార్డుల హోరు
ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లిస్తామన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటనతో ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంచనాలు పెరిగాయి.
ప్రభుత్వానికి ఆర్బీఐ భారీ డివిడెండ్తో జీవనకాల కొత్త గరిష్ఠాలకు సూచీలు
రూ.420 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లిస్తామన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటనతో ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంచనాలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల నికరలాభాలు రూ.3 లక్షల కోట్లను మించడమూ ప్రభావం చూపింది. జూన్ 4న మార్కెట్లు మరింత దూసుకెళ్తాయని ప్రధాని ప్రకటించడం, మదుపర్లలో ధీమా పెంచింది. ఫలితంగా గురువారం దేశీయ సూచీలు కదం తొక్కాయి. బ్యాంకింగ్, చమురు, వాహన షేర్లు దూసుకెళ్లడంతో సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. ఈ ఏడాది జనవరి 29 తర్వాత, అతిపెద్ద ఒకరోజు లాభాన్ని నమోదు చేసిన సెన్సెక్స్, మళ్లీ 75,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ కూడా 23,000 పాయింట్లకు చేరువైంది. ‘బుద్ధ పూర్ణిమ’ సందర్భంగా గురువారం ఫారెక్స్ మార్కెట్ పనిచేయలేదు.
మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గురువారం ఒక్కరోజే రూ.4.28 లక్షల కోట్లు పెరిగి రికార్డు గరిష్ఠమైన రూ.420.22 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్ ఉదయం 74,253.53 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ, ఇంట్రాడేలో 75,499.91 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద ముగిసింది. నిఫ్టీ 369.85 పాయింట్లు పెరిగి 22,967.65 దగ్గర స్థిరపడింది. ఈ సూచీ 22,993.60 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.
- అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీ: బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలోకి అదానీ ఎంటర్ప్రైజెస్ చేరొచ్చన్న వార్తలతో, గ్రూప్ కంపెనీల షేర్లు దూసుకెళ్లాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 8.01%, ఎన్డీటీవీ 7.56%, అదానీ పోర్ట్స్ 4.72%, ఏసీసీ 2.86%, అదానీ పవర్ 2.79%, అదానీ టోటల్ గ్యాస్ 2.30%, అంబుజా సిమెంట్స్ 2.09%, అదానీ విల్మర్ 1.85%, అదానీ గ్రీన్ 1.25%, అదానీ ఎనర్జీ 1.17% రాణించాయి. 10 గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.17.23 లక్షల కోట్లుగా నమోదైంది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 27 దూసుకెళ్లాయి. ఎల్ అండ్ టీ 3.64%, ఎం అండ్ ఎం 3.55%, యాక్సిస్ బ్యాంక్ 3.30%, మారుతీ 3.16%, అల్ట్రాటెక్ 2.74%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.22%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.99%, రిలయన్స్ 1.80%, టీసీఎస్ 1.66% లాభపడ్డాయి.
- రాణించిన గో డిజిట్: గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేరు ఇష్యూ ధర రూ.272తో పోలిస్తే, బీఎస్ఈలో 3.34% లాభంతో రూ.281.10 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 15.44% పెరిగిన షేరు రూ.314 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 12.40% లాభంతో రూ.305.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.28,043.46 కోట్లుగా నమోదైంది. 2020లో గో డిజిట్లో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ.2 కోట్లు, ఆయన భార్య అనుష్క శర్మ రూ.50 లక్షల పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలో ఒక్కో షేరు రూ.75 చొప్పున కొనుగోలు చేయగా, ప్రస్తుతం దాని విలువ నాలుగింతలైంది..
- రుణ పరిష్కార ప్రణాళికను అమలు చేసేందుకు అదనంగా 90 రోజుల సమయం ఇవ్వాల్సిందిగా ఎన్సీఎల్టీని రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్ కోరారు. ప్రస్తుత గడువు ఈ నెల 27న ముగియనుంది.
- ఎలక్ట్రిఫికేషన్ ప్లాట్ఫామ్ వెర్టెలోకు దశలవారీగా 3000 విద్యుత్ వాహనాలను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎంజీ మోటార్ తెలిపింది.
- నోయిడాలో 650 ఫ్లాట్లను రూ.2000 కోట్లకు విక్రయించినట్లు గోద్రేజ్ ప్రోపర్టీస్ వెల్లడించింది. ఈ నెలలోనే ఈ ప్రాజెక్టును సంస్థ ప్రకటించింది.
- కంపెనీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 49% వరకు పెంచేందుకు వాటాదార్ల అనుమతిని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కోరింది.
- సన్ఫార్మాలో కంపెనీ విలీన ఒప్పందానికి టారో వాటాదార్లు ఆమోదం తెలిపారు.
- హ్యూలెట్ ప్యాకార్డ్ ఎంటర్ప్రైజ్కు చెందిన కమ్యూనికేషన్స్ టెక్నాలజీ గ్రూప్ (సీటీజీ) ఆస్తులు కొన్నింటిని 225 మి. డాలర్ల (సుమారు రూ.1,874 కోట్ల)కు కొనుగోలు చేస్తున్నట్లు హెచ్సీఎల్ టెక్ వెల్లడించింది.
5 లక్షల కోట్ల డాలర్లకు ఎన్ఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)లో నమోదైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ గురువారం 5 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.416.57 లక్షల కోట్ల) మైలురాయిని అధిగమించింది. 2017 జులైలో ఈ విలువ 2 లక్షల కోట్ల డాలర్లు కాగా, 2021 మే నెలలో 3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందుకు 46 నెలల సమయం పట్టింది. 2023 డిసెంబరులో 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని చేరింది. అక్కడ నుంచి 6 నెలల్లోపే మరో లక్ష కోట్ల డాలర్ల మేర విలువ పెరిగింది. ఈ ఎక్స్ఛేంజీలో అత్యంత విలువైన కంపెనీలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్టెల్ ఉన్నాయి.
నేటి బోర్డు సమావేశాలు: ఎన్టీపీసీ, హిందాల్కో, కర్ణాటక బ్యాంక్, టొరెంట్ ఫార్మా, సాయి సిల్క్స్ కళామందిర్, అశోక్ లేలాండ్, బాష్, యునైటెడ్ స్పిరిట్స్, సుజ్లాన్ ఎనర్జీ, హడ్కో, కొచ్చిన్ షిప్యార్డ్, హిందుస్థాన్ కాపర్, గ్లెన్మార్క్ ఫార్మా, సన్ టీవీ నెట్వర్క్, మణప్పురం ఫైనాన్స్, డోమ్స్ ఇండస్ట్రీస్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, జేఎం ఫైనాన్షియల్, ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రోడక్ట్స్, హెచ్సీసీ, జామ్నా ఆటో, నజారా టెక్నాలజీస్, కోల్టే-పాటిల్ డెవలపర్స్, ఓరియెంట్ గ్రీన్ పవర్, ఎన్ఐఐటీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు