Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. ₹6 లక్షల కోట్ల సంపద ఆవిరి
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 790 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో సూచీలకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్లో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగాయి. సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 22,200 స్థాయిని కోల్పోయింది.
సెన్సెక్స్ ఉదయం 73,162.82 స్వల్ప లాభాల్లో ప్రారంభమై.. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 72,222.29 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 790.34 పాయింట్ల నష్టంతో 72,304.88 వద్ద ముగిసింది. నిఫ్టీ 247.20 పాయింట్ల నష్టంతో 21,951.15 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లో హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 82.92గా ఉంది. మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. వాటి మార్కెట్ విలువ రూ.386 లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 82.84 వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు ధర 2034 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మార్కెట్ పతనానికి కారణాలివే..
- అమెరికా నుంచి కీలక గణాంకాలు వెలువడనున్నాయి. జనవరి నెల వ్యక్తిగత వినియోగానికి సంబంధించిన ధరల సూచీ గణాంకాలు వెలువడనున్నాయి. వడ్డీ రేట్ల విషయంలో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలను ఈ గణాంకాలు ప్రభావితం చేయనున్నాయి.
- ఆసియా- పసిఫిక్ మార్కెట్లు చాలావరకు నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రభావం కూడా మన మార్కెట్లపై ఉంది. విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు కూడా మరో కారణం.
- ఇటీవల కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు కనిష్ఠాల వద్ద కొనుగోలు చేసి గరిష్ఠాల వద్ద విక్రయించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఆయా స్టాక్స్ విలువలు పెరగడం కూడా ఓ కారణమని మార్కెట్ నిపుణుల చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
తమ వెబ్సైట్లో వేసవి విహారం కోసం శోధించిన వాటి వివరాలను ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్