State Bank of India: అత్యుత్తమ బ్యాంక్’గా ఎస్బీఐ
ఇదే మనందరి లక్ష్యం
ఉద్యోగులకు నూతన ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి సందేశం

ఎస్బీఐ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు శెట్టితో ఆయన సతీమణి శ్రీదేవి
‘ఉద్యోగులు, అధికారులు.. అందరం కలిసి దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్గా స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను తీర్చదిద్దాలి. ఈ దశాబ్దం ప్రారంభంలో మార్కెట్ విలువ పరంగా అంతర్జాతీయ బ్యాంకుల్లో ఎస్బీఐ 52వ స్థానంలో ఉండగా.. ఇపుడు 35 స్థానాలు మెరుగుపరచుకుని 17వ స్థానానికి చేరింది. ఇప్పటి దాకా పనిచేసిన ఛైర్మన్లకు ఈ విషయంలో కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ పునాదిపై మరింతగా ఎదిగి, అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా ఎస్బీఐను మలుద్దాం. అందుకు నికర లాభాలను పెంచుకోవాలి. మరిన్ని కోట్ల మంది జీవితాల్లోకి వెళ్లాలి. ఇదంతా జరగడానికి మీ సహకారం కావాలి. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి, అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్న తరుణంలో.. ఎస్బీఐ దశాబ్దంగానూ తీర్చిదిద్దుదాం’ అని ఎస్బీఐ కొత్త ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు శెట్టి సందేశమిచ్చారు.
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్గా తెలుగు వారైన చల్లా శ్రీనివాసులు శెట్టి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం పదవీ విరమణ చేసిన దినేశ్ ఖరా స్థానంలో సీఎస్ శెట్టి బాధ్యతలు స్వీకరించినట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో ఎస్బీఐ తెలిపింది. శెట్టి బ్యాంక్లో ఇప్పటిదాకా అత్యంత సీనియర్ మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ)గా ఉన్నారు. ఎస్బీఐలోని సంప్రదాయం ప్రకారం.. బ్యాంక్ ఎండీల నుంచే ఛైర్మన్ నియామకం జరుగుతోంది. సాధారణంగా సీనియర్ ఎండీకే ఆ అవకాశం దక్కుతుంటుంది. 1988లో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ)గా ఎస్బీఐలో తన వృత్తి జీవితాన్ని మొదలుపెట్టిన శ్రీనివాసులు.. ఇపుడు అదే బ్యాంక్లో ఛైర్మన్గా అత్యున్నత బాధ్యతలు నెరపే స్థాయికి ఎదగడం విశేషం.
ఎక్కడి నుంచి ఎక్కడి దాకా..
శ్రీనివాసులు శెట్టి తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా (ఉమ్మడి పాలమూరు జిల్లా) మానవ పాడు మండలం, పెద్ద పోతుల పాడులో జన్మించారు. ఏడో తరగతి వరకు సొంతూర్లోనే ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్ వరకు గద్వాలలో, ఆ తర్వాత హైదరాబాద్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేర్వేరు టాస్క్ ఫోర్స్లు/కమిటీలకు ఈయన నేతృత్వం వహించారు.
ఎన్నో హోదాల్లో.. ఎన్నో బాధ్యతల్లో..
మూడు దశాబ్దాల బ్యాంకింగ్ కెరియర్లో శెట్టి ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. కార్పొరేట్ రుణాలు, రిటైల్, డిజిటల్, అంతర్జాతీయ బ్యాంకింగ్, అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకింగ్ వంటి విభాగాల్లో అపార అనుభవం ఆయన సొంతం. ఎస్బీఐలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (స్ట్రెస్డ్ అసెట్స్ రెసొల్యూషన్ గ్రూప్), చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ (కార్పొరేట్ అకౌంట్స్ గ్రూప్), డిప్యూటీ జనరల్ మేనేజర్ (కమర్షియల్ బ్రాంచ్- ఇండోర్), వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (సిండికేషన్స్-న్యూయార్క్ బ్రాంచ్).. ఇలా పలు హోదాల్లో ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
రూ.7,500 కోట్ల సమీకరణ: ఎస్బీఐ తొలిసారిగా బాసెల్ 3 నిబంధనల కింద టైర్-2 బాండ్లను జారీ చేయడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.7,500 కోట్లు సమీకరించినట్లు బుధవారం ప్రకటించింది. ఇష్యూ ప్రాథమిక పరిమాణం రూ.5000 కోట్లు కాగా.. రూ.8,800 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి.
ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు వస్తే డిపాజిట్లు పెరగొచ్చు
ఈక్విటీ మార్కెట్లలో ఏదైనా దిద్దుబాటు కనిపిస్తే.. బ్యాంకుల్లోకి మళ్లీ డిపాజిట్లు పెరుగుతాయనే అభిప్రాయాన్ని ఎస్బీఐ ఎండీ అశ్వినీ తెవారి వ్యాఖ్యానించారు. తక్కువ వ్యయం డిపాజిట్ల వృద్ధికి జన్ధన్ ఖాతాలపై ఎస్బీఐ ఆధారపడుతోందని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

పౌరవిమాన సేవల్లోకి మరో 4 సంస్థలు
దేశీయ విమాన ప్రయాణికుల విపణిలో అత్యధిక మార్కెట్వాటా ఉన్న ఇండిగో సేవల్లో ఇటీవల తలెత్తిన సమస్యల కారణంగా, లక్షలమంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడిన నేపథ్యంలో.. మరిన్ని విమానయాన సంస్థలను రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. -

ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోకి సునీల్ మిత్తల్
భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నారు. చైనా ఎలక్ట్రానిక్స్ సంస్థ హైయర్ గ్రూపు అనుబంధ కంపెనీ హైయర్ అప్లయన్సెస్ ఇండియాలో 49% వాటాను మిత్తల్ నేతృత్వంలోని భారతీ ఎంటర్ప్రైజెస్, అమెరికా ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్ సంయుక్తంగా కొనుగోలు చేయనున్నాయి. -

నెమ్మదించిన స్థిరాస్తి లావాదేవీలు
ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరులో హైదరాబాద్లో ఇళ్ల/ఫ్లాట్ల విక్రయాలు 11,323లకు పరిమితమవుతున్నాయని స్థిరాస్తి విశ్లేషణా సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసిక అమ్మకాలు 13,902తో పోలిస్తే ఈసారి 19% తగ్గాయంది. -

సూచీలకు కొనసాగిన నష్టాలు
సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఇంధనం, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వడం, విదేశీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, రూపాయి విలువ తగ్గడమూ మదుపర్ల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపాయి. -

కొత్త తరం కియా సెల్టోస్ తయారీ ప్రారంభం
మధ్యశ్రేణి ఎస్యూవీ (స్పోర్ట్స్ వినియోగ వాహన) విభాగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేలా, కొత్త తరం సెల్టోస్ కారు వాణిజ్య తయారీని కియా ఇండియా ప్రారంభించింది. -

అపోలో హాస్పిటల్స్ వాటాదార్లకు అపోలో హెల్త్టెక్ షేర్లు
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ ప్రతిపాదించిన పునర్వ్యవస్థీరణ ప్రణాళికకు స్టాక్ ఎక్స్ఛేంజీలు అనుమతి ఇచ్చాయి. ఫార్మసీ వ్యాపారాన్ని, డిజిటల్ హెల్త్కేర్ వ్యాపారాన్ని విడదీయాలని; అనుబంధ కంపెనీలైన అపోలో హెల్త్కో, కీమెడ్ లను అపోలో హెల్త్టెక్లో కలపాలని సంస్థ ప్రతిపాదించింది. -

అనిల్ అంబానీకి ఊరట
అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ఖాతాలను ‘మోసపూరితమైనవి’గా వర్గీకరించి, 3 బ్యాంకుల కన్సార్షియం చేపడుతున్న, చేపట్టబోయే అన్ని చర్యలపై బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది. -

ఇండిగో టికెట్ల రద్దుపై కేంద్రానికి 100 ఫిర్యాదులు
ఇండిగో విమాన టికెట్ల రద్దుపై 100 వరకు ఫిర్యాదులను తమ శాఖ అందుకున్నట్లు, వాటిని విమాన నియంత్రణాధికార సంస్థకు పంపినట్లు వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే పేర్కొన్నారు. -

క్యాస్ట్రోల్లో 65% వాటా విక్రయం
లూబ్రికెంట్లు తయారు చేసే క్యాస్ట్రోల్ ఇండియా మాతృసంస్థ, బ్రిటన్కు చెందిన క్యాస్ట్రోల్లో 65% వాటా విక్రయించడానికి బ్రిటన్ ఇంధన సంస్థ బీపీ అంగీకరించింది. అంతర్జాతీయ ఆల్నర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ స్టోన్పీక్కు ఈ వాటా విక్రయిస్తామని తెలిపింది. -

రష్యా చమురు కొనుగోలు ఆంక్షల నుంచి రిలయన్స్కు ఒక నెల మినహాయింపు!
రష్యా చమురు ఉత్పత్తి సంస్థ రాస్నెఫ్ట్ నుంచి, ముడిచమురు దిగుమతి చేసుకోవడాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగించనుంది. రష్యా సంస్థల నుంచి చమురు కొనుగోలు చేసేవారిపై విధించిన ఆంక్షల నుంచి ఒక నెల పాటు రిలయన్స్కు అమెరికా మినహాయింపు ఇవ్వడం ఇందుకు నేపథ్యం. -

జోస్ అలుక్కాస్ ప్రచారకర్త దుల్కర్ సల్మాన్
ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ను తమ ప్రచారకర్తగా నియమించుకున్నట్లు ఆభరణాల సంస్థ జోస్ అలుక్కాస్ వెల్లడించింది. -

సంక్షిప్త వార్తలు(5)
వేగవంతంగా చెక్కులను క్లియర్ చేసే వ్యవస్థ రెండో దశ అమలును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వాయిదా వేసింది. బ్యాంకులు తమ కార్యకలాపాలను క్రమబద్దీకరించుకోవడానికి మరింత సమయం ఇచ్చింది.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
-

రివ్యూ: శంబాల.. ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడిందా?
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/12/2025)
-

క్యాన్సర్ చికిత్సపై వీడియో.. గ్లోబల్ సైన్స్ పోటీ ఫైనల్స్లో భారత విద్యార్థిని
-

రివ్యూ: ఈషా.. తెలుగు హారర్ థ్రిల్లర్ భయపెట్టిందా?
-

రష్యాను కుడుతున్న.. ఉక్రెయిన్ ‘కందిరీగ’లు!


