Stock Market: నష్టాల్లో దేశీయ సూచీలు.. 22,200 దిగువకు నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 157 పాయింట్ల నష్టంతో 72,985 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు కుంగి 22,176 దగ్గర కొనసాగుతోంది.

Updated : 26 Feb 2024 09:44 IST

Stock Market Opening bell | ముంబయి: ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు (Stock Market) సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 157 పాయింట్ల నష్టంతో 72,985 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు కుంగి 22,176 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.88 వద్ద ప్రారంభమైంది. 

సెన్సెక్స్‌-30 సూచీలో ఎల్‌ అండ్‌ టి, పవర్‌గ్రిడ్‌, ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.. ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) శుక్రవారం రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. టెక్‌ స్టాక్స్‌లో అమ్మకాలు, యూరోజోన్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో నేడు ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ మార్కెట్లు మాత్రం రికార్డు గరిష్ఠాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 81.22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ శుక్రవారం నికరంగా రూ.1,276.09 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ సైతం రూ.176.68 కోట్ల వాటాలను కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని