Stock Market: నష్టాల్లోనే దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 22,650కి దిగొచ్చిన నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 201 పాయింట్ల నష్టంతో 74,301 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,655 దగ్గర కొనసాగుతోంది.

Published : 30 May 2024 09:35 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ (Stock Market) సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 201 పాయింట్ల నష్టంతో 74,301 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,655 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.43 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, టైటన్‌, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.5842 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.5,233 కోట్ల వాటాలను కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని