Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,300

Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 97 పాయింట్ల నష్టంతో 73,579 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 39 పాయింట్లు కుంగి 22,317 దగ్గర కొనసాగుతోంది.

Published : 06 Mar 2024 09:36 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 97 పాయింట్ల నష్టంతో 73,579 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 39 పాయింట్లు కుంగి 22,317 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో రిలయన్స్‌, ఎల్‌ అండ్ టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, టైటన్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలూ ప్రతికూలంగానే ఉన్నాయి. బిట్‌కాయిన్‌, బంగారం ధరలు రికార్డు గరిష్ఠాలకు చేరిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 82.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ మంగళవారం నికరంగా రూ.574.28 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.1,834.61 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని