Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది.

Published : 23 Apr 2024 09:35 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు భారత్‌కు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 196 పాయింట్ల లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ఠమైన రూ.83.36 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో పవర్‌ గ్రిడ్‌, నెస్లే ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్ ఫార్మా, రిలయన్స్‌, టాటా మోటార్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 87.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ సోమవారం నికరంగా రూ.2,915.23 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.3,542.93 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని