Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 21,960

Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 244 పాయింట్లు నష్టపోయి 72,396 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు కుంగి 21,961 దగ్గర కొనసాగుతోంది.

Updated : 22 Mar 2024 09:39 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 244 పాయింట్లు నష్టపోయి 72,396 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు కుంగి 21,961 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.26 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో సన్‌ఫార్మా, టైటన్, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ సూచీ 41,000 వద్ద తాజా గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ గురువారం నికరంగా రూ.1,826.97 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.3,208.87 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని