Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,696

Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 56 పాయింట్లు లాభపడి 74,798 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 22,696 దగ్గర కొనసాగుతోంది.

Published : 09 Apr 2024 09:37 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు ఆరంభంలో దన్నుగా నిలిచాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 56 పాయింట్లు లాభపడి 74,798 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 22,696 దగ్గర కొనసాగుతోంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రిలయన్స్‌, టైటన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం మందకొడిగా ట్రేడయ్యాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 90.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ సోమవారం నికరంగా రూ.684.68 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.3,470.42 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని